ఉత్కంఠభరిత పోరులో `డాన్స్ ప్లస్` విజేత సాంకేత్..
ఓంకార్ నిర్వహణలో రన్ అవుతున్న `డాన్స్ ప్లస్` డాన్స్ షో లేటెస్ట్ సీజన్ గ్రాండ్ ఫినాలే టైటిల్ విన్నర్గా డాన్సర్ సాంకేత్ సహదేవ్ నిలిచారు. ఉత్కంఠభరితంగా సాగిన పోటీలో సాకేత్ విజేతగా నిలిచారు.
డాన్స్ మాస్టర్ శేఖర్ మాస్టర్ గెస్ట్ గా, ఈ ఆదివారం సాయంత్రం జరిగిన ఈ ఫినాలే ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. గెస్ట్ గా వచ్చిన శేఖర్ మాస్టర్ విన్నర్ సాంకేత్కి ట్రోఫీని అందజేశారు. దీంతోపాటు 20 లక్షల ప్రైజ్ మనీని అందజేశారు.
టైటిల్ విన్నర్ సందర్భంగా సాకేతి చాలా భావోద్వేగానికి గురయ్యారు. ఆయన ఆనందానికి అవద్దుల్లేవని చెప్పొచ్చు. సాంకేత్ బాబా మాస్టర్ టీమ్ కంటెస్టెంట్ కావడం విశేషం.ఇందులో జడ్జ్ మోనాల్కి యాంకర్ ఓంకార్ గిఫ్ట్ ఇవ్వడంతో ఆమె ఆనందంతో కన్నీళ్లు పెట్టుకోవడం హైలైట్గా నిలిచింది.
కొత్త టాలెంట్ ని ప్రపంచానికి పరిచయం చేసిన `డాన్స్ ప్లస్` దేశవ్యాప్తంగా వచ్చిన 5,344 డిజిటల్ ఎంట్రీల నుంచి ఆడిషన్స్ నిర్వహించి 18 టీమ్స్ తో మొదలైన ఈ రసవత్తరమైన పోటీ దేశంలోని రకరకాల ప్రాంతాల నుంచి ప్రతిభ గల డాన్సర్లకు ఓ మంచి మంచి వేదిక కల్పించింది. పాన్ ఇండియా డాన్స్ షో గా ప్రేక్షకుల అభిమానాన్ని ఆశీర్వాదాన్ని అందుకుంది.
ఫైనల్స్ కి అర్హత సంపాదించిన 5 టీం లలో విజేతను తేల్చే ఫైనల్స్ ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా ఒక పండగలా జరిగాయి. తను ఎక్కడున్నా ఎంతో సందడి చేసే ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ముఖ్య అతిధిగా వచ్చారు. ఇక ప్రతి టీం ని సపోర్ట్ చేసేందుకు బిగ్ బాస్ ఫేమ్ దీప్తి సునయన, స్టార్ మా సూపర్ హిట్ సీరియల్ "జానకి కలగనలేదు" హీరో అమరదీప్, "జాతిరత్నాలు" సినిమా హీరోయిన్ ఫారియా అబ్దుల్లా, ప్రముఖ నాట్యకారిణి సంధ్య రాజు, సినిమా సెలబ్రిటీ నటాషా దోషి ఫైనల్స్ ని పోటీ లా కాకుండా ఒక సంబరంలా మార్చేశారు.
ఎంత పండగలా అనిపించినా పోటీని ఎదుర్కొనే ప్రతి కంటెస్టెంట్... తమ టాలెంట్ తో ఈ షోకి ఒక ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొచ్చారు. తనదైన శైలిలో ప్రతి ఎపిసోడ్ నీ ఇంటరెస్టింగ్ గా నడిపించిన దర్శకుడు ఓంకార్ ఫైనల్స్ ని మరింత పదునైన వ్యూహాలతో రసవత్తరంగా నడిపించారు. రఘు మాస్టర్, యష్ మాస్టర్, బాబా భాస్కర్ మాస్టర్, ముమైత్ ఖాన్, యాని మాస్టర్, మోనాల్ గజ్జర్ న్యాయ నిర్ణేతలుగా ఉన్నారు.