నిజంగానే అవంటే నాకు భయం...ట్రోల్ చేయడం దారుణం
హాట్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ ని నెటిజెన్స్ ట్రోల్స్ చేస్తున్నారు. కోవిడ్ టెస్టుల సమయంలో పాయల్ చిన్న పిల్ల మాదిరి ఏడవగా, ఆమె అతి చేస్తుందని విమర్శిస్తున్నారు. నెటిజన్స్ విమర్శలకు పాయల్ ఇది దారుణం అని స్పందించారు.
సెలిబ్రిటీలు ఏ చిన్న పొరపాటు చేసిన ట్రోల్ చేయడానికి నెటిజెన్స్ రెడీగా ఉంటాడు. సోషల్ మీడియా ద్వారా ఓ ఆటాడేస్తారు. నెటిజెన్స్ చేసే ఈ సోషల్ మీడియా ట్రోల్ల్స్ సదరు సెలెబ్రిటీలను ఇబ్బంది పెట్టిన సందర్భాలు అనేకం.
తాజాగా పాయల్ రాజ్ పుత్ ఓ విషయంలో నెటిజెన్స్ కి దొరికి పోయింది. ఇటీవల ఓ షూటింగ్ లో పాయల్ పాల్గొన్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో భద్రతా నియమాల రీత్యా షూటింగ్ లో పాల్గొన్న అందరికీ కరోనా పరీక్షలు నిర్వహించారు.
ఇక పాయల్ రాజ్ పుత్ సైతం కోవిడ్ పరీక్షల కోసం శాంపిల్స్ ఇవ్వడం జరిగింది. వైద్య సిబ్బంది పాయల్ ముక్కు నుండి శాంపిల్స్ సేకరిస్తున్న సమయంలో ఆమె గట్టిగా ఏడ్చేశారు. చిన్న పిల్ల మాదిరి ఏడ్చేశారు.
జస్ట్ శ్వాబ్ శాంపిల్స్ ఇవ్వడానికి పాయల్ చేసిన రాద్దాంతం చూసిన నెటిజెన్స్ ఆమెను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. అందులో ఏడ్చే అంత కష్టం ఏముంది. పాయల్ కొంచెం అతి చేశారని ఆమెను విమర్శించడం జరిగింది.
ప్రస్తుతం తెలుగులో ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీ చేస్తున్న పాయల్, తమిళంలో ఓ కామెడీ హారర్ లో నటిస్తున్నారు. ఆర్ ఎక్స్ 100 తరువాత ఆ స్థాయి హిట్ పాయల్ ఖాతాలో పడలేదు.