బుల్లితెరపై శృతి మించిన రొమాన్స్.. ఏందీ రచ్చ..?
కాసేపు నవ్వులు, కొద్దిగా డ్యాన్స్ లు అంత వరకు బాగానే ఉంది కానీ.. ఆ డ్యాన్స్ లు వేసే నటులు మరింత రెచ్చిపోవడమే.. ప్రేక్షకులకు మింగుడుపడటం లేదు.
బుల్లితెరపై ఒకప్పుడు టీవీ సీరియల్స్ మాత్రమే వచ్చేవి. ఆ సీరియల్స్ కి జనాలు బాగా చేరువయ్యారు. ఆ సీరియల్స్ లో నటించే నటులను తమ సొంతవారిలా భావించి అభిమానించడం మొదలుపెట్టారు.
అయితే.. అదే సీరియల్ నటులతో టీవీ ప్రోగ్రాంలు చేయడం మొదలుపెట్టారు. కొన్ని స్కిట్లు, డ్యాన్స్ లు, పాటలతో ఓ గంట ప్రోగ్రామ్ చేసి వినోదాన్ని అందించడం మొదలుపెట్టారు.
దానిలో భాగంగానే ఇటీవల శ్రీదేవి డ్రామా కంపెనీ అనే కొత్త రకం కార్యక్రమం టీవీ ప్రజల ముందుకు తీసుకువచ్చారు.
కాసేపు నవ్వులు, కొద్దిగా డ్యాన్స్ లు అంత వరకు బాగానే ఉంది కానీ.. ఆ డ్యాన్స్ లు వేసే నటులు మరింత రెచ్చిపోవడమే.. ప్రేక్షకులకు మింగుడుపడటం లేదు.
సినిమాల్లో హీరో, హీరోయిన్లు కూడా మరీ అంత దారుణంగా నటించరేమో అనే భావన కలిగేలా ప్రవర్తిస్తున్నారు. ఓ టీవీ షోలో ఉన్నామనే ఫీలింగ్ కూడా లేకుండా.. అసభ్యరీతిలో డ్యాన్స్ లు చేస్తున్నారు.
జబర్దస్త్ మల్లెమాలవారు ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ అనే కామెడీ షోని ఇటీవల ప్రారంభించారు. ఈటీవీలో ప్రసారం అవుతున్న ఈ షోకి సంబంధించి ప్రోమో విడుదల చేశారు. యాంకర్ వర్ష, ఇమ్మానుయేల్ల లవ్ ట్రాక్తో ఈ షోని రన్ చేస్తుండగా.. వారానికో సెలబ్రిటీని తీసుకుని వచ్చి కొత్త కొత్త డ్రామాలతో రక్తికట్టిస్తున్నారు.
ఈవారం గెస్ట్గా నటి హేమ స్పెషల్ ఎంట్రీ ఇచ్చింది. పెళ్లి చూపులు నేపథ్యంలో వర్ష, ఇమ్మానుయేల్లు పంచ్లు బాగానే పేల్చేరు. ఆ తరువాత ఢీ కొరియోగ్రాఫర్ పండు రాకతో అసలు రచ్చ మొదలైంది.
జల జల జలపాతం నువ్వూ అంటూ రొమాంటిక్ సాంగ్తో ఎంట్రీ ఇచ్చిన సుదర్శన్, కిరణ్ మై జంట మితిమీరి రొమాన్స్ చేస్తూ రెచ్చిపోయారు. ఎక్కడపడితే అక్కడ పట్టుకుని ఇద్దరూ మైమరిచిపోయి రొమాన్స్లో జీవించారు. ఎ సర్టిఫికెట్ ని తలపించేలా వీరు డ్యాన్స్ చేయడం గమనార్హం.
తర్వాత అదే పాటకు పండు, భాను కూడా డ్యాన్స్ వేశారు. ఆ తర్వాత ఇమ్యాన్యుయేల్, వర్ష కూడా ఏ మాత్రం తగ్గకుండా రొమాన్స్ చేయడం విశేషం.
ఆదివారం మధ్యాహ్నం 1 గంటలకు ప్రసారం కాబోతున్న ఈ కార్యక్రమం ప్రోమో చూస్తే పెద్దలకు మాత్రమే అనేట్టుగా ఉంది. ఇంత వల్గర్ గా తీస్తే.. ఫ్యామిలీలు ఇలాంటి టీవీ షోలో ఎలా చూస్తారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.