అందుకే ఈవెంట్స్ కు వెళ్లడం మానేశాను.. నయనతార షాకింగ్ కామెంట్స్
ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింద నయనతార, తమను ఇండస్ట్రీలో ఎలా ట్రీట్ చేస్తారు... తాను ఎందకు ప్రమోషన్స్ కు వెళ్లను అనేదానిపై క్లారిటీ ఇచ్చింది. ఇంతకూ నయనతార ఎందుకు సినిమా ప్రమోషన్స్ కు వెళ్లదో తెలసా..?
తెలుగు, తమిళ పరిశ్రమలో దాదాపు రెండు దశాబ్ధాల పాటు హీరోయిన్ గా ఊపు ఊపేసింది నయనతార. యంగ్ హీరోల దగ్గర నుంచి సీనియర్ స్టార్ హీరోల వరకూ .. చాలా మందికి జంటగా నటించి మెప్పించింది బ్యూటీ. ఇప్పుడు విమెన్ సెంట్రిక్ మూవీస్ తో అదే ఇమేజ్ ను కంటీన్యూ చేస్తుంది నయన్.
నయనతారలో ఓ స్పెషాలిటీ ఉంది. తాను నటిచిన ఏ సినిమా ప్రమోషన్స్ కు నయన్ అటెండ్ అవ్వదు. దానిక కారణం ఏంటీ అనేది చాలా మందికి ఓ మిస్టరీగా మిగిలిపోయింది. అయితే రీసెంట్ గా నయన్ నటించిన కనెక్ట్ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఈమూవీ ప్రమోషన్స్ లో మాత్రం నయన్ సందడి చేసింది. ఈసినిమా తాను నిర్మించడంతో ఆమెకు తప్పలేదు.
అయితే ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా యాంకర్ సుమతో ఓ స్పెషల్ ఇంటర్వ్యూలో పాల్గోంది నయనతార. ఈక్రమంలో నయనతార ఇండస్ట్రీ గురించి. హీరోల గురించి చాలా విషయాల్లో క్లారటీ ఇచ్చింది. ఈక్రమంలోనే ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింద నయన్. తాను ఎందుకు సినిమా ప్రమోషన్స్ కు వెళ్ళనో క్లారిటీ ఇచ్చేసింది.
ఈ సందర్భంగా సినీపరిశ్రమలో అసమానతల గురించి మాట్లాడింది నయనతార. అక్కడ హీరోలకు ఇచ్చేంత ప్రాధాన్యతను హీరోయిన్లకు ఇవ్వరని... అందుకే తాను సినిమా ఈవెంట్స్ కు వెళ్లడం మానేశానని ఆమె తెలిపింది. ఒక వేళ హీరోయిన్లు ఏదైనా ఆడియో ఫంక్షన్ కు వెళ్ళినా.. తమను ఏ మూలనో నిలబెట్టే పరిస్థితి ఉండేదని చెప్పింది.
ఈ కారణాల వల్లే తాను సినిమా ఈవెంట్లకు,ప్రమోషం ఈవెంట్లకు వెళ్లడం మానేశానని తెలిపింది. తాను హీరోయిన్ గా 20 ఏళ్లు పూర్తి చేసుకున్న తరువాత విమెన్ ఓరియెంటెడ్ సినిమాలు చేయాలని కల ఉండేదన్నారు. కాని అప్పట్లో విమెన్ సెంట్రిక్ మూవీస్ కు ఎవరు ప్రాధాన్య ఇవ్వలేదన్నారు. ఇలా హీరోయిన్లకు ఎదుకు వాల్యూ ఇవ్వడంలేదు అంటూ తను బాధపడేదన్ని అంటూ వెల్లడించింది నయన్.
Nayanthara
ఇక నయనతార ఇచ్చిన క్లారిటీతో.. ఆమె ఎందుకు ప్రమోషన్స్ లోకనిపించరో ఒక క్లారిటీ వచ్చింది ఆడియన్స్ కు.ఇక నయనతార లీడ్ రోల్లో నటించిన సినిమా కనెక్ట్. అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో హర్రర్ థ్రిల్లర్స్ జోనర్లో తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 22న గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. అయితే సూపర్ హిట్ అనిచెప్పలేం కాని ఓ మోస్తర్ లో నడుస్తోంది మూవీ.
చాలా రోజుల తర్వాత ఇంటర్వ్యూ ఇచ్చిన నయనతార టాలీవుడ్ స్టార్స్ పై ఫన్నీ కామెంట్స్ చేయడం ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఇక ‘కనెక్ట్’ సినిమా పై ధీమా కూడా వ్యక్తం చేసింది నయన్. అయితే ఈమూవీ అనుకున్నంతగా హిట్ అవ్వలేదు. ఇక ఈమూవీకి అశ్విన్ సరవరన్ దర్శకత్వం వహించారు. విఘ్నేశ్ శివన్ నిర్మించారు. ఈ చిత్రంలో నయనతార, సత్యరాజ్, అనుపమ్ ఖేర్ ప్రధాన పాత్రలను పోషించారు.