పెళ్ళి తరువాత ఫస్ట్ టైమ్ షూటింగ్ సెట్ లో నయనతార, శుభప్రదంగా ఏం చేసిందంటే..?
రీసెంట్ గా డైరెక్టర్ విఘ్నేష్ శివన్ ను పెళ్ళాడింది స్టార్ సీనియర్ హీరోయిన్ నయనతార. ఇక ఇప్పటికే ఆమె కమిట్ అయిన సినిమాల షూటింగ్స్ పెండింగ్ లో ఉండిపోయాయి. ఇక హనీమూన్ ట్రిప్ కంప్లీట్ చేసుకున్న ఈ బ్యూటీ... సడెన్ గా షూటింగ్ సెట్ లో ప్రత్యక్ష్యం అయ్యింది. ఇక తన సినిమాల పై దృష్టి పెట్టబోతోంది.

రీసెంట్ గా పెళ్ళి బంధంతో ఒక్కటయ్యారు తమిళ ప్రేమ జంట నయనతార, విఘ్నేశ్ శివన్. వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. జూన్ 9న తమిళనాడులోని మహాబలిపురంలో ఓ రిసార్ట్లో ఘనంగా పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత ఈ కొత్త జంట దేవుడి ఆశీర్వాదం కోసం తిరుమల తో పాటు పలు క్షేత్రాలను దర్శించుకున్నారు.ఆనంతరం థాయ్లాండ్కు హానీమూన్ వెళ్లిన ఈ కొత్త దంపతులు తిరిగి వచ్చారు.
హానీమూన్ నుంచి వచ్చిరాగే నవ వధువు నయన్ షూటింగ్ సెట్లో అడుగు పెట్టిందట. నయన్ జావాన్ మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇక పెళ్ళి తరువాత శుభప్రదంగా ముందు బాలీవుడ్ సినిమా సెట్ లోనే అడుగు పెట్టింది నయనతార. అక్కడ కలిసి రావాలనే ఇలా చేసినట్టు సమాచారం.
ఇంత వరకూ నయనతార తమిళ సినిమాలనే ఎక్కువగా చేస్తూ వచ్చింది. తెలుగు .. మలయాళ భాషల్లో అడపాదడపా చేసినా, స్టార్ హీరోల సినిమాల్లో మాత్రమే చేస్తూ వచ్చింది. తెలుగు, మలయాళ భాషల్లో కూడా నయనతారకి విపరీతమైన క్రేజ్ ఉంది. ఆమె తమ ప్రాజెక్టు ఒప్పుకుంటే చాలానే ఆలోచనలో మేకర్స్ ఉన్నారు.
బాలీవుడ్ నుంచి ఆమెకి చాలానే అవకాశాలు వచ్చినప్పటికీ ఆమె ఒప్పుకోలేదు. కానీ ఇప్పుడు కోలీవుడ్ నుంచి అట్లీ కుమార్ బాలీవుడ్ వెళ్లి, షారుక్ ఖాన్ తో జవాన్ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమాలో చేయడానికి నయనతార అంగీకరించడం విశేషం. ముంబైలో షూటింగ్ లో నయనతార పాల్గొంది.
ఇటీవలే నయనతార - విఘ్నేశ్ శివన్ ల వివాహం జరిగింది. వాళ్లు హనీమూన్ కి వెళుతున్నారనీ, నయన్ కొన్ని రోజుల వరకూ షూటింగులకు హాజరు కాకపోవచ్చని అనుకున్నారు. అంతే కాదు ఇక సినిమాలకు కూడా బ్రేక్ ఇస్తుందని, ఒప్పుకున్న ప్రాజెక్ట్స్కు కూడా నయన్ కొత్త కండిషన్స్ పెడుతుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇలా ఆమె జవాన్ షూటింగ్లో పాల్గొనడం వార్తల్లో నిలిచింది. ఇక తెలుగులో ఆమె గాడ్ ఫాదర్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.