మహేష్ బాబు అక్క మంజుల గురించి షాకింగ్ నిజాలు బయట పెట్టిన నమ్రత
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్ ఓ స్పెషల్ పర్సెన్. మహేష్ బాబుకు అన్నీ తానై ముందుకు నటిస్తున్న వ్యక్తి. ఒక రంగంగా మహేష్ కు స్ట్రిక్ట్ హోమ్ మినిష్టర్. ఘట్టమనేని ఫ్యామిలీకి అన్నీ తానై చూసుకుంటున్న ఈ సూపర్ లేడీ.. రీసెంట్ గాకొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.
వంశీ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది నమ్రత శిరోద్కర్... ఈ సినిమా షూటింగ్ సమయంలోనే మహేష్ బాబుతో ప్రేమలో పడింది. ఆతరువాత ఎన్నో పరిణామాలు.. పెద్దల అంగీకారంతో 2005, ఫిబ్రవరి 10న ముంబైలో ఈ స్టార్స్ ఇద్దరి పెళ్ళి ఘనంగా జరిగింది. అయితే వీరి పెళ్ళి జరగడంలో.. మహేష్ బాబు అక్క మంజుల ముఖ్య పాత్ర పోషించారట.
ఈ విషయాన్ని స్వయంగా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు నమ్రత. ఇంతకీ ఆమె ఏమన్నారంటే.. ఓ పార్టీలో అనుకోకుండా మంజులను కలిశాను. అప్పుడు నేను మహేశ్ను ప్రేమిస్తున్నట్లు మంజులకు తెలియదు. ఆ తర్వాత మేము మంచి ఫ్రెండ్స్ అయ్యారు.. ఆతరువాత ఇద్దరు ఒకటే ఫ్యామిలీ అయ్యాం అన్నారు.
అంతేకాదు మంజుల గురించి మరికొన్ని విషయాలు ఆమె షేర్ చేసుకున్నారు నమ్రత. అనుకోకుండా మేమిద్దరం ఒకేసారి ప్రెగ్నెన్స్ అయ్యాం.. ఇది యాధృచ్చికంగా జరిగింది అన్నారు. అంతే కాదు నిజానికి మంజులకు అప్పుడే పిల్లలను కనడం ఇష్టమే లేదు. కానీ తరువాత తరువాత మాతృత్వాన్ని ఆనందించింది. ఇప్పుడుతనకో కూతురు... అంటూ వివరించింది మంజుల.
ఇక తనకు ఫ్యామిలీని చూసుకోండం అంటే చాలా ఇష్టం అంటోంది నమ్రత. అందుకే పెళ్లి తర్వాత సినిమాలు వదులకున్నా తనకెలాంటి బాధ లేదని అంటోంది. ప్రస్తుతం తన ఫ్యామిలీని చూసుకోవడంలో బిజీగా ఉన్నానంటంది నమ్రత.అందుకే సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చే అవకాశం కూడా లేదంటోంది.
1993లో మిస్ ఇండియా టైటిల్ గెలుచుకుంది నమ్రత. జబ్ ప్యార్ కిసీసే హోతాహై అనే హిందీ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. వాస్తవ్ మూవీతో సూపర్ హిట్ అందుకుంది నమ్రత. అలా సినిమాల చేసుకుంటూ.. కెరీర్లో దాదాపు 20 సినిమాల వరకూ చేసింది.