స్వర్గంలో విహరిస్తున్నట్టుందిః మాల్దీవుల్లో హనీమూన్ ఎంజాయ్ చేస్తున్న హీరోయిన్ దియా మీర్జా..
నాగార్జున `వైల్డ్ డాగ్` హీరోయిన్ దియా మీర్జా తన భర్తతో కలిసి మాల్దీవుల్లో హనీమూన్ ఎంజాయ్ చేస్తుంది. అక్కడి అందాలను ఆస్వాదిస్తూ కొత్తగా పెళ్ళి చేసుకున్న దియా రొమాంటిక్ లైఫ్ని ఎంజాయ్ చేస్తుంది. తాజాగా ఆయా ఫోటోలను పంచుకోగా అవి హల్చల్ చేస్తున్నాయి.
బాలీవుడ్ నటిగా గుర్తింపు తెచ్చుకున్న దియా మీర్జా ముంబయికి చెందిన వ్యాపారవేత్త వైభవ్ రేఖీతో ఇటీవల రెండో వివాహం చేసుకుంది.
అతికొద్ది మంది సన్నిహితులు, బంధుమిత్రులు ఈ వేడుకకి హాజరయ్యారు. గ్రాండ్గా వీరి మ్యారేజ్ వేడుక జరిగింది.
ఇదిలా ఉంటే తాజాగా ఈ కొత్త జంటగా హనీమూన్ ఎంజాయ్ చేస్తుంది. ఈ ఫోటోలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంది నటి.
ఇందులో `ప్రతీ క్షణాన్ని ఎంజాయ్ చేస్తున్నాం. స్వర్గంలో ఉన్నట్టుంది` అని పేర్కొంది దియా మీర్జా.
మాల్దీవులు తనకు స్వర్గంలా ఉందని చెప్పింది. ఆ నీలి సముద్రాన్ని తిలకిస్తూ సేద తీరుతుంది. కొత్త రొమాంటిక్ లైఫ్ని సరికొత్తగా ప్రారంభించింది.
అదేసమయంలో మాల్దీవ్ అందాలను కెమెరాల్లో బంధించి అభిమానులతో పంచుకుంది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.
2014లో నిర్మాత సాహిల్ సంఘాను పెళ్లి చేసుకున్న దియా మీర్జా కొన్ని వ్యక్తిగత కారణాలతో అతని నుంచి విడిపోయారు.
అనంతరం వైభవ్ రేఖీ అనే వ్యాపారవేత్తను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వైభవ్కి కూడా ఇది రెండో పెళ్లి కాగా, దియా కంటే అతను నాలుగేళ్లు చిన్నవాడు కావడం విశేషం.
దియా మీర్జా నటిస్తున్న `వైల్డ్ డాగ్` ఏప్రిల్ 2న విడుదల కానున్న విషయం తెలిసిందే. దీంతో ఇప్పటికే నాగార్జున ప్రమోషన్ కార్యక్రమాలు షురూ చేశారు.
మాల్దీవ్స్ అందాలను కెమెరాలో బంధించిన దియా.