నయనతార మైత్రీ మూవీ భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ..?
సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గాపేరు తెచ్చుకుంది హీరోయిన్ నయనతార. తరుస సినిమాలతో దూసుకుపోతున్న ఈ బ్యూటీ.. తాజాగా భారీ బడ్జెట్ మూవీకి సిద్దం అవుతున్నట్టు తెలుస్తోంది.
సౌత్ లో స్టార్ హీరోయిన్ గా స్టార్ డమ్ తో దూసుకుపోతోంది నయనతార. ప్రస్తుతం అగ్ర కథానాయికల్లో ఒకరిగా కొనసాగుతున్నది. నయనతారను ఫ్యాన్స్ ముద్దుగా లేడీ సూపర్స్టార్ అని బిరుదు ఇవ్వడంతో పాటు.. హీరోలను మించిన ఫాలోయింగ్ ను అందించారు. ఏజ్ పెరుగుతున్నా హీరోయిన్ గా ఇంకా కొనసాగుతూనే ఉంది నయన్.
![article_image2](https://static-ai.asianetnews.com/images/01hh68nwde0nj7sp30mgdmeqzk/ga18b0zwoaarp55_300x300xt.jpg)
nayanthara
ఇక గత కొన్నాళ్ళుగా విమెన్ సెంట్రిక్ మూవీస్ తో పాటు.. స్టార్ సీనియర్ హీరోల సరసన హీరోయిన్ గా నటిస్తూ.. తిరుగులేని ఫాలోయింగ్ను సంపాదించుకుందీ భామ. అంతే కాదు సౌత్ లో హైయ్యెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకునే హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది సీనియర్ బ్యూటీ. ఈమధ్య తనకు త్రిష పోటీ ఇచ్చినా..ఏమాత్రం తగ్గలేదు నయన్.
అంతే కాదు ఈమధ్యే నయనతార హిందీలోకి కూడా అడుగు పెట్టింది. షారఖ్ ఖాన్ తో ఆమె చేసిన జవాన్ సినిమా వెయ్యి కోట్లు పైనే సాధించి.. నయనతారను హిందీలో కూడా నిలబెట్టింది. దాంతో సీనియర్ స్టార్స్ పక్కన అక్కడ కూడా అవకాశాలు వస్తున్నట్టు తెలుస్తోంది. ఇటు తెలుగులో కూడా ఆమెకు అవకాశాలు మెండుగానే వస్తున్నాయి. కాని ఆమె కొన్ని కావాలని వదిలేసుకున్నట్టు సమాచారం.
నేపథ్యంలో ఈ భామ తెలుగులో ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. భారీ బడ్జెట్ మూవీస్ ను నిర్మించే టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ మూవీని నిర్మించబోతున్నట్లు సమాచారం. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించబోతున్న ఈ సినిమా కోసం నయనతారకు భారీ పారితోషికాన్ని ఆఫర్ చేశారని వార్తలు వినిపిస్తున్నాయి.
Nayanthara
కథలోని కొత్తదనం నచ్చడంతో నయనతార కూడా ఈ ప్రాజెక్ట్పై ఆసక్తిగా ఉందని చెబుతున్నారు. అయితే ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన రావాల్సిందే అంటున్నారు. ప్రస్తుతం నయనతార తమిళంలో వరుస సినిమాలతో బిజీగా ఉంది.