విమర్శలు తట్టుకోలేం...ఆమెను పంపించేద్దామని డిసైడ్ అయిన బిగ్ బాస్, తర్వాత అఖిల్ ని కూడా?
కుమార్ సాయి ఎలిమినేషన్ బిగ్ బాస్ ప్రేక్షకులతో పాటు, నెటిజెన్స్ ఆగ్రహానికి కారణం అయ్యింది. ఆయన ఎలిమినేషన్ విషయంలో చీటింగ్ జరిగిందని ప్రేక్షకులు గట్టిగా నమ్ముతున్నారు. షో టీఆర్పీ కోసం కావాలనే కుమార్ సాయిని నిబంధనలకు విరుద్ధంగా బలిచేశారని అందరూ అంటున్నారు. ఇదే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తున్నారు. బిగ్ బాస్ నిర్వాహకులతో పాటు, హోస్ట్ నాగార్జునను వారు తిట్టిపోస్తున్నారు.
గత వారం ఎలిమినేట్ కావాల్సింది మోనాల్ కాగా...కుమార్ సాయిని బయటికి పంపించేశారని అందరూ అభిప్రాయపడుతున్నారు. టాస్క్ ల పరంగా కూడా మంచి ప్రదర్శన కనబరిచిన సాయి కంటే మోనాల్ కి ఎక్కువ ఓట్లు రావడం అసంభవం అంటున్నారు.
ఇంటిలో అఖిల్ మరియు అభిజిత్ లతో రొమాన్స్ నడుపుతూ...గ్లామర్ షో చేస్తున్న మోనాల్ ని బిగ్ బాస్ కావాలనే సేవ్ చేశాడని, ఇది పక్కా ఫేక్ ఎలిమినేషన్ అంటున్నారు.
ఓ వైపు సరైన టీఆర్పీ రాక ఇబ్బందిపడుతున్న బిగ్ బాస్ షోని తాజా ఆరోపణలు మరింత దెబ్బతీసే అవకాశం కలదు. ప్రజాదరణ కలిగిన తెలుగు సీరియల్స్ కంటే కూడా బిగ్ బాస్ షో తక్కువ టీఆర్పీ తెచ్చుకుంటుంది. స్టార్ మాలో కార్తీక దీపం సీరియల్ 18 ప్లస్ టీఆర్పీ తెచుకుంటుంటే, బిగ్ బాస్ షో టీఆర్పీ కేవలం 8 ప్లస్ కి పరిమితం అయ్యింది.
దీనితో బిగ్ బాస్ నిర్వాహకులు నష్ట నివారణ చర్యలు చేపట్టే పనిలో ఉన్నారట. దీనిలో భాగంగా వచ్చే వారం మోనాల్ ఇంటిని వీడడం ఖాయం అంటున్నారు.
ఈ వారం కొరకు నోయల్, ఆరియానా, అభిజిత్, అవినాష్, దివి మరియు మోనాల్ నామినేట్ కావడం జరిగింది. ఈ ఆరుగురిలో వీక్ కంటెస్టెంట్ మోనాల్ అని చెప్పాలి. కాబట్టి వచ్చే వారం మోనాల్ ఇంటి నుండి బయటికి వెళ్లిపోయే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.
ఈ వారం కొరకు నోయల్, ఆరియానా, అభిజిత్, అవినాష్, దివి మరియు మోనాల్ నామినేట్ కావడం జరిగింది. ఈ ఆరుగురిలో వీక్ కంటెస్టెంట్ మోనాల్ అని చెప్పాలి. కాబట్టి వచ్చే వారం మోనాల్ ఇంటి నుండి బయటికి వెళ్లిపోయే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.