పూట గడవని స్థితిలో ఎస్పీ బాలు వద్ద వంద అప్పు చేశా, తీర్చలేదు.. మోహన్ బాబు
గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం కరోనా తో ఆసుపత్రి బెడ్ పై పోరాటం చేస్తున్న వేళ ఆయన సన్నిహితుడు అయిన నటుడు మోహన్ బాబు ఆయనతో గల అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ సంధర్భంగా మోహన్ బాబు ఓ అరుదైన సంఘటన తెలియజేశారు.
నేడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యంపై గుడ్ న్యూస్ రావడం జరిగింది. బాలుగారికి కరోనా టెస్టులలో నెగెటివ్ వచ్చినట్లు ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ తెలియజేశారు. ఈ న్యూస్ కి చిత్ర పరిశ్రమ మరియు ఆయన ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా బాలు కొద్దిరోజులుగా ఆస్పత్రిలో విషమ పరిస్థితిలో కరోనాతో పోరాడుతున్నారు. ఈ నేపథ్యంలో విలక్షణ నటుడు మోహన్ బాబు ఆయనతో గల అనుబంధాన్ని పంచుకున్నారు.
![article_image2](https://static-ai.asianetnews.com/images/01eet0yaq3d09gy8vxvd9ytaay/mohan-babu--1--jpg_300x171xt.jpg)
మోహన్ బాబు, బాల సుబ్రహ్మణ్యం చిన్నప్పటి నుండి మితృలు అట. ఒకరితో మరొకరు చాలా అన్యోన్యంగా ఉండేవారట. మోహన్ బాబు ఆయనను బాలు అని పిలిస్తే, బాలు ఆయనను శిశుపాల, భక్త అని పిలిచేవారట. అరుదుగా మోహన్ బాబు అనేవారట.
ఇక మోహన్ బాబు నటుడిగా స్థిరపడక ముందే బాలు స్టార్ సింగర్ గా సౌత్ ఇండియాలో ఫేమస్ అయ్యారు. నటుడిగా అవకాశాల కోసం మోహన్ బాబు ప్రయత్నాలలో ఉన్నప్పుడు మోహన్ బాబు బాలు గారిదగ్గర అప్పు చేశారట. భోజనానికి ఇబ్బందిగా ఉన్న పరిస్థితులలో 100 రూపాయలు అప్పుగా తీసుకున్నారట.
బాలు దగ్గర తీసుకున్న ఆ అప్పు మోహన్ బాబు ఇంత వరకు తీర్చలేదట. అది జరిగిన చాలాకాలం కాగా మోహన్ బాబు ఆ వంద రూపాయలు ఇంకా బాలుకు తిరిగి ఇవ్వలేదట. బాలు మోహన్ బాబుతో ' ఏమయ్యా నా వంద రూపాయలు ఇంకా ఇవ్వలేదుగా, ఇప్పటికి అది కోటి దాటిపోయి ఉంటుంది' అని సరదాగా అంటుంటారట.
ఇక బాలుగారు సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని మోహన్ బాబు తన ఇష్టదైవం సాయి బాబును కోరుకున్నారు. ఆయన తప్పకుండా కోలుకొని తిరిగివస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. మోహన్ బాబు నటించిన అనేక సినిమాలకు బాలు సింగర్ గా పనిచేశారు.