బాలయ్యతో రొమాన్స్ కి త్రిష గ్రీన్ సిగ్నల్.. ట్రోల్స్ తో విరుచుకుపడుతున్న మెగా ఫ్యాన్స్?
సౌత్ స్టార్ హీరోయిన్ త్రిష ఇప్పుడు సరికొత్త వివాదంలో ఇరుక్కుంది. బాలయ్యతో రొమాన్స్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి.. మెగా అభిమానుల ఆగ్రహానికి కారణమైంది. బాలయ్య, చిరు అభిమానుల మధ్య చిచ్చు పెట్టింది.
త్రిష.. ఇటీవల లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు, పాత్రకి ప్రాధాన్యత కలిగిన సినిమాల్లోనే నటిస్తుంది. పూర్తిగా తన పంథాని మార్చుకుంది. గ్లామర్ రోల్స్ కాకుండా శక్తివంతమైన రోల్స్ చేస్తూ తానేంటో నిరూపించుకుంటోంది.
తాజాగా త్రిష.. తెలుగులో ఓ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం. బాలకృష్ణతో నటించేందుకు ఓకే చెప్పింది. బాలయ్యతో మరోసారి రొమాన్స్ కి ఓకే చెప్పిందని టాక్. గతంలో `లయన్` చిత్రంలో నటించిన విషయం తెలిసిందే.
బాలకృష్ణ నెక్ట్స్ గోపీచంద్ మలినేనితో ఓ పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ని తీయబోతున్నారు. ఇందులో బాలకృష్ణ పోలీస్ ఆఫీసర్గా కనిపిస్తారని సమాచారం. ఈ సినిమాలో హీరోయిన్గా త్రిషని ఫైనల్ చేశారని టాక్. ఆమె కూడా ఓకే చెప్పిందని సమాచారం. ఇప్పటికే మీనాని ఓకే చేశారని, ఇప్పుడ త్రిషని అనుకుంటున్నారని సమాచారం.
అయితే ఇక్కడే త్రిష.. మెగా ఫ్యాన్స్ ఆగ్రహానికి ఆస్కారమిచ్చింది. త్రిష.. చిరంజీవితో `ఆచార్య`లో హీరోయిన్గా నటించాల్సి ఉంది. ఫస్ట్ ఓకే కూడా చెప్పింది. కానీ ఏమైందో ఏమో తాను నటించడం లేదని తెలిపింది. దీంతో ఆ స్థానంలో కాజల్ని ఎంపిక చేశారు.
ఇప్పుడు బాలకృష్ణతో నటించేందుకు త్రిష గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనే వార్తతో మెగా ఫ్యాన్స్ ఆగ్రహంతో ఊగిపోతున్నారు. చిరంజీవికి నో చెప్పి బాలయ్యతో చేయడమేంటని సోషల్ మీడియా వేదికగా నిలదీస్తున్నారు. వరుసగా ట్రోల్స్ తో రెచ్చిపోతున్నారు.
దీంతో ఇప్పుడు అటు చిరంజీవి, ఇటు బాలయ్య అభిమానుల మధ్య త్రిష చిచ్చుపెట్టినట్టయ్యింది. బాలయ్య ఫ్యాన్స్, చిరు ఫ్యాన్స్ ఇటీవల గొడవ పడింది లేదు. కానీ ఇప్పుడు త్రిష రూపంలో వారి మధ్య లేనిపోని ఇష్యూ క్రియేట్ చేసినట్టయ్యిందంటున్నారు క్రిటిక్స్.
త్రిష ప్రస్తుతం తమిళంలో `పొన్నియిన్ సెల్వన్`, `గర్జణై`, `సతురంగ వెట్టై 2`, `రాంగి`, `రామ్` చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. ఇదిలా ఉంటే చిరంజీవితో గతంలో త్రిష `స్టాలిన్` చిత్రంలో నటించిన విషయం తెలిసిందే.