మెగా ఫ్యామిలీ కమ్ బ్యాక్.. చిరు, బన్నీ, చరణ్, ఉపాసన, స్నేహారెడ్డి ఎయిర్పోర్ట్ లో మెరుపులు..
మెగా ఫ్యామిలీ సంక్రాంతి పండగ ఈ సారి బెంగుళూరులోని చిరంజీవి గెస్ట్ హౌజ్లో సెలబ్రేట్ చేసుకున్న విషయం తెలిసింది. ఇప్పుడు రిటర్స్ అవుతున్నారు. ఎయిర్ పోర్ట్ లో సందడి చేశారు.
ఈ సంక్రాంతి పండగని మెగా ఫ్యామిలీ బెంగుళూరులో ప్లాన్ చేసింది. అల్లు ఫ్యామిలీతోపాటు చిరంజీవి ఫ్యామిలీ మొత్తం అక్కడికే చేరుకుంది. మూడు రోజులు సందడి చేశారు. ఇప్పుడు కమ్ బ్యాక్ అవుతున్నారు. బెంగుళూరు నుంచి హైదరాబాద్కి చేరుకుంటున్నారు.
![article_image2](https://static-ai.asianetnews.com/images/01hm9a2sq94mnj0yyjbgcpfg4v/gd915klbsaanloo-jpg_300x664xt.jpg)
ఈ సందర్భంగా హైదరాబాద్లో మెరిశారు. మెగాస్టార్ చిరంజీవి, రామ్చరణ్, అలాగే అల్లు అర్జున్, ఉపసాన, స్నేహారెడ్డి ఎయిర్పోర్ట్ లో సందడి చేశారు. వీరిని బంధించేందుకు ఫోటోగ్రాఫర్లు వెంటబడ్డారు.
ఇందులో ఉపాసన తన కూతురు క్లీంకారని ఎత్తుకుని రావడం విశేషం. అయితే ఏమాత్రం కనిపించకుండా ఆమె పాపని కవర్ చేస్తూ తీసుకొచ్చింది ఉపాసన. చిన్నారిని చూసేందుకు అభిమానులు ఉవ్విళ్లూరుతున్నా, ఏమాత్రం ఛాన్స్ ఇవ్వలేదు.
మరోవైపు రామ్చరణ్ తన పెట్ డాగ్ని తీసుకుని ఎయిర్ పోర్ట్ లో మెరిసింది. అలాగే బన్నీ తన కూతురు అల్లు అర్హని ఎత్తుకుని వచ్చాడు. అంతకంటే ముందుగా అల్లు స్నేహారెడ్డి ఎంట్రీ ఇచ్చింది. ఆమెతోపాటు కొడుకు అల్లు అయాన్ ఉన్నాడు.
ఇలా ఒక్కొక్కరుగా మెగా ఫ్యామిలీ బెంగుళూరు నుంచి హైదరాబాద్కి చేరుకుంటున్నారు. సంక్రాంతి ఫెస్టివల్ ముగియడంతో తిరిగి కమ్ బ్యాక్ అయ్యారు. ఎయిర్ పోర్ట్ లో మెరుస్తూ సందడి చేస్తున్నారు.
ఈ సారి సంక్రాంతిని చాలా స్పెషల్గా జరుపుకున్నారు మెగా ఫ్యామిలీ చిరంజీవి, సురేఖ, అల్లు అరవింద్, ఆయన భార్య, నాగబాబు, ఆయన సతీమణి, చిరంజీవి ఇద్దరు చెళ్లుళ్లు వారి ఫ్యామిలీ, సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, అలాగే వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి, నిహారిక, శ్రీజ, సుస్మిత పాల్గొన్నారు.
వీరితోపాటు అల్లు అర్జున్, అల్లు స్నేహారెడ్డి, శిరీష్, బాబీ, పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా నందన్, కూతురు ఆద్యలు, వారి ఫ్యామిలీ పిల్లలు కూడా పాల్గొన్నారు. ఈ మేరకు ఫ్యామిలీ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది.