అందరికిది పదో నెల.. కానీ మహేష్ హీరోయిన్కి మాత్రం తొమ్మిదో నెల
మహేష్ హీరోయిన్ అమృతా రావు ప్రెగ్నెంట్ అయ్యింది. త్వరలో ఆమె పండంటి బిడ్డకి జన్మనివ్వబోతుంది. అయితే ఆమెకి ఇప్పుడు ఎన్నో నెలో తెలిస్తే మాత్రం అంతా షాక్ అవుతారు.
బాలీవుడ్లో కమర్షియల్ సినిమాలు, భిన్న కథా నేపథ్యంతో కూడిన చిత్రాల్లో నటనకు ప్రయారిటీ ఉన్న పాత్రలు పోషిస్తూ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు పొందింది అమృతా రావు. `మస్తీ`, `దీవార్, `షికార్`, `ప్యారే మోహన్`, `వివాహ్` చిత్రాలతో మెప్పించింది.
తెలుగులో ఎంట్రీ ఇస్తూ `అతిథి` చిత్రంలో నటించింది. ఇందులో మహేష్ సరసన రొమాన్స్ చేసి తొలి చిత్రంతోనే తెలుగు ఆడియెన్స్ కి దగ్గరైంది. సురేందర్రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అల్లరితో కూడిన విలక్షణ పాత్రలో మెప్పిందీ హాట్ బ్యూటీ.
ఇన్నాళ్ళు బాలీవుడ్లో వరుసగా సినిమాలు చేస్తూ రాణిస్తున్న ఈ అమ్మడు ఉన్నట్టుండి ప్రెగ్నెంట్ అని చెప్పింది. అంతేకాదు తాను బేబి బంప్తో కూడిన ఫోటోని ఇన్స్టాగ్రామ్ ద్వారా పంచుకుంది. ఇందులో తన భర్త ఆర్జే అన్మోల్ కూడా ఉన్నారు.
ఇదిలా ఉంటే ఈ సందర్భంగా ఓ షాకింగ్ విషయాన్ని వెల్లడించింది అమృతా రావు. ఇప్పుడు అందరికి పదో నెల అని, తనకి మాత్రం తొమ్మిదో నెల అని చెప్పి అభిమానులకు షాక్ని, సర్ప్రైజ్ని ఓకేసారి ఇచ్చింది. ఇన్నాళ్ళు తెలియకుండా దాచినందుకు సారీ చెప్పిందీ బ్యూటీ.
తొమ్మిదో నెల కాబట్టి త్వరలోనే తాను డెలివర్ కాబోతుంది. దీంతో చాలా ఎగ్జైట్మెంట్తో ఉన్నట్టు పేర్కొంది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైలర్ అవుతుంది. అభిమానులు విశెష్ చెబుతున్నారు. అర్జే అన్మోల్తో అమృతా రావు వివాహం 2016లో జరిగింది. కొన్నేళ్లపాటు డేటింగ్ చేసి వివాహం చేసుకున్నారు.
దాదాపు ఆరేళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చిన ఈ క్యూట్ ముద్దుగుమ్మ గతేడాది `ఠాక్రే` చిత్రంలో నటించింది. ప్రస్తుతం `ది లెజెండ్ ఉఫ్ కునల్`, `సాత్సాంగ్` చిత్రాల్లో నటిస్తుంది.