ఆమేనా...అమలాపాల్ ఇంత హాట్ గానా? అనేస్తారు
ఆ మధ్య కాలంలో తెలుగులో వరస సినిమాలు చేసి ఆ తర్వాత పూర్తిగా దూరమైపోయిన బ్యూటీ అమలా పాల్. తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా, జనాలు గుర్తు పెట్టుకునేటంత క్రేజ్ మాత్రం వచ్చింది. కానీ తెలుగులో చెప్పుకోదగ్గ ఆఫర్స్ రాకపోవడంతో తమిళ, మళయాల ఇండస్ట్రీలకు వెళ్లిపోయింది. ఇక కెరీర్ మంచి స్టేజీలో ఉన్నపుడే పాతికేళ్లు కూడా నిండకుండా దర్శకుడు ఏ.ఎల్.విజయ్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత ఎక్కువకాలం కాకుండానే బంధం విచ్చిన్నం అయిపోయింది. విడిపోయిన తర్వాత సినిమాలతో బిజీ అయిపోయింది ఈ బ్యూటీ. అదే సమయంలో తన అభిమానులను అలరించటానికి ఎప్పటికప్పుడు కొత్త ఫోటో షూట్లను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. అందాలతో అదరగొడుతోంది..
ఆన్ స్క్రీన్.. ఆఫ్ ద స్క్రీన్ ఒకే రకంగా ఉంటూ, డేర్ చూపించే హీరోయిన్స్ చాలా అరుదు. అయితే అలాంటి వాళ్ల లిస్ట్ చేస్తే.. అమలాపాల్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంటుంది.
వెండితెరపై వేడెక్కించే పాత్రలతో రక్తి కట్టించే ఈ అమ్మడు నిజ జీవితంలలోనూ వేడెక్కించే కామెంట్లతో తనేంటో చూపెడుతుంది.
అమలాపాల్ లోని స్త్రీ వాది గురించి ఎంత చెప్పినా తక్కువే. తనలోని రెబలియన్ యాటిట్యూడ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు అంటారు ఆమె ఫ్యాన్స్.
మధ్య మధ్యలో అమలాపాల్ రేంజ్ కి తగ్గట్టుగా ఆమె ఫోటో షూట్లు చేస్తూ ఉంటుంది. వేసవి ఉష్ణోగ్రతలను వీలైనంత పెంచుతూనే ఉంటుంది.
సాధారణంగా అమలాపాల్ ఫోటోలు వైరల్ అవుతూనే ఉంటాయి. ఇక్కడ చూసే ఫోటోలు కూడా అలాంటిదే. ఈ ఫోటో రెగ్యులర్ సంప్రదాయ ప్రేక్షకులకు పెద్దగా నచ్చకపోవచ్చు.. ఎందుకంటే అల్ట్రా మోడరన్ గా ఉంది.. ఓ ఇంటర్నేషనల్ మోడల్ లాగా కనిపిస్తోంది.
ఇక అమలాపాల్ ఇచ్చే ఎక్స్ ప్రెషన్ ఎప్పటిలాగే అదరకొడుతూంటాయి. డ్రెస్ ను క్యారీ చేసే విధానం.. క్యాజువల్ భంగిమ అదరహో అని ఫ్యాన్స్ తెగ మెచ్చేసుకుంటూంటారు.
ఇటీవల అమలాపాల్ నటించిన ఆమె (ఆడై) చిత్రంలో నగ్నంగా నటించి సంచలనం సృష్టించింది. సినిమా కమర్షియల్ గా వర్కవుట్ కాకపోయినా ఆమె ధైర్యానికి అందరూ మెచ్చుకున్నారు.
అంతకుముందు మృగం చిత్రంలో మామతో శృంగారం చేసే కోడలి పాత్రలో రక్తి కట్టించింది. అమలా పాల్ కెరీర్ లో ఇలాంటి ఎడ్వంచర్ పాత్రలు ఎన్నో ఉన్నాయి.
వైవాహిక జీవితం తప్పించి,కెరీర్ పరంగా పూర్తి సంతృప్తితో ఉంది. ఎవరూ ఊహించని విధంగా నాన్న ఫేం దర్శకుడు ఏ.ఎల్.విజయ్ ని పెళ్లాడి వైవాహిక జీవితంలో అడుగు పెట్టాక పాల్ ఆ నిర్భంధ జీవితాన్ని కొనసాగించలేకపోయింది.
నటవృత్తిని కొనసాగించేందుకు కుదరదనే భర్త- అత్త మామలు ఆంక్షలు విధించడంతో అందుకు ససేమిరా అంటూ వ్యతిరేకించిన అమలా పాల్.. అనంతరం విజయ్ నుంచి విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే.
ఇక దర్శకుడు సుశీ గణేషన్ పై ఆరోపిస్తూ మీటూ ఉద్యమానికి బాసటగా నిలిచింది పాల్. ఇలాంటి వివాదాలు గొడవలు తన లైఫ్ లో ఎన్నో ఉన్నాయి.
రీసెంట్ గా మరోసారి అంతకుమించిన వివాదాన్ని రాజేసింది పాల్. 1923 సంవత్సరంలో ఖలీల్ గిబ్రాన్ రాసిన `ప్రవక్త` (ది ప్రొఫెట్) గ్రంధాన్ని అభ్యసించిన అమలాపాల్ సోషల్ మీడియా పోస్టులో స్త్రీవాదాన్ని ప్రపంచానికి పరిచయం చేసే ప్రయత్నం చేసింది.
స్త్రీని అదుపులో పెట్టుకునే పురుషుడి అహంపై అమలాపాల్ చాలా సంగతులే చెప్పుకొచ్చింది. ది ప్రొఫెట్ లో స్త్రీలకు సంబంధించిన రకరకాల ప్రశ్నలు ఉన్నాయి.
స్త్రీలు-ప్రేమ గురించి.. వివాహం గురించి.. పిల్లల గురించిన ప్రశ్నలున్నాయి. గర్భధారణ ప్రసవంలోని భరించలేని నొప్పి.. స్త్రీ బానిసత్వం.. అవమానం.. ఆర్థిక అవసరాలకు స్త్రీ పురుషుడిపై ఆధారపడటం లాంటి అనేకానేక విషయాలపై ప్రశ్నల్ని సంధించింది ప్రవక్త పుస్తకం అంటూ వివరించింది. గర్భధారణ సమయంలో ఒక మహిళ ఎదుర్కొనే పోరాటాన్ని ఈ పోస్టులో వివరించింది.
పిల్లవాడు తొమ్మిది నెలలకు పెరిగేప్పుడు.. కడుపులో ఏదో పైకి విసిరేసినట్టుగా.. వాంతి అవుతున్నట్టుగా అనిపిస్తుంది. పిల్లల పుట్టుక దాదాపు స్త్రీ మరణంతో సమానం. ఒకసారి గర్భం ధరించి పిల్లాడిని కన్న తర్వాత కూడా మరోసారి గర్భవతిని చేయడం పురుషుడి పని`` అని అమలా ఆ పోస్టులో పేర్కొంది.
ఆడదాని ఏకైక పని జనసమూహాన్ని ఉత్పత్తి చేయడమే అనిపిస్తుంది. తాను అనుభవించే బాధలో పురుషుడు భాగస్వామి కానే కాదు`` అంటూ తీవ్రంగానే నిందించింది.
మగాడు తన కామదాహాన్ని.. లైంగిక కోర్కెల్ని తీర్చుకునేందుకు స్త్రీని ఒక వస్తువుగా ఉపయోగిస్తున్నాడు. స్త్రీకి పర్యవసానాలు ఎలా ఉంటాయనే దాని గురించి మగాళ్లు ఏమాత్రం ఆందోళన చెందరు`` అంటూ ఆ పోస్టులో దుయ్యబట్టింది.
ఒక పురుషుడు స్త్రీని నిజంగా ప్రేమిస్తే అసలు ప్రపంచంలో ఇంత అధిక జనాభా ఉండేది కాదని ఆమె పోస్ట్ చెప్పింది. ``అతని మాటల్లో `ప్రేమ` పూర్తిగా అబద్ధం. మగాడు స్త్రీని దాదాపు పశువులా అనుభవిస్తున్నాడు`` ఆమె తన పోస్ట్ ద్వారా చెప్పారు.
కెరీర్ పరరంగా తన సెకండ్ ఇన్నింగ్స్ అదరకొడుతోంది. విఐపి2 ఆమె చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమాలు పెద్దగా విజయం సాధించకపోయినా మంచి పేరును తెచ్చి పెట్టాయి.
తాజాగా అమలాపాల్ ఒక వెబ్ సిరీస్ లో నటించబోతోందంటూ ఈ మధ్య వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు సినిమా అంటే థియేటర్స్ లోనే చూడాలి అనే రోజులు పోయాయి. కరోనా దెబ్బతో స్మార్ట్ఫోన్ల వాడకం పెరిగింది. ఇప్పుడు అందరూ డిజిటల్ స్ట్రీమింగ్ వైపే దృష్టి పెడుతున్నారు.