కీర్తి బేబీ నువ్వు రాకింగ్.. స్టయిలీష్ శారీలో కేక పెట్టిస్తున్న కీర్తిసురేష్
కీర్తిసురేష్ ట్రెడిషనల్ లుక్కి పెట్టింది పేరు. గ్లామర్ విషయంలో ఆమడ దూరంలో ఉండే ఈ అమ్మడు సాంప్రదాయ లుక్లోనూ మెస్మరైజ్ చేస్తుంది. తాజాగా మోడ్రన్, ట్రెడిషనల్ మేళవింపుగా రెడీ అయ్యింది. తాజాగా స్టయిలీష్ లుక్లో కేక పెట్టిస్తుందీ `మహానటి` భామ. ప్రస్తుతం కీర్తి లేటెస్ట్ ఫోటోస్ ట్రెండ్ అవుతున్నాయి.
కీర్తిసురేష్ యాష్ కలర్ శారీలో వైట్ జాకెట్ ధరించి కీర్తి నువ్వు రాక్ అనిపించేలా ముస్తాబైంది.
ప్రస్తుతం ఈ ఫోటోలను పంచుకుని ఆనందం వ్యక్తం చేసింది కీర్తి. తనకు శారీ అంటే ఇష్టమని చెప్పింది కీర్తి.
ఇదిలా ఉంటే ఇవన్నీ థ్రో బ్యాక్ శారీ ఫోటోస్ అట. వాటిని పంచుకుని ఉబ్బితబ్బిబ్బవుతుంది.
ప్రస్తుతం కీర్తిసురేష్.. మహేష్బాబు హీరోగా రూపొందుతున్న `సర్కారు వారి పాట` చిత్రంలో నటిస్తుంది. ఈ సినిమా దుబాయ్లో ప్రారంభం కానుంది.
ఈ నేపథ్యంలో కీర్తిసురేష్ దుబాయ్ చెక్కేసింది. ఈ సందర్భంగా ఫ్లైట్లో దిగిన ఫోటోలను షేర్ చేసుకుంది కీర్తి.
ప్రస్తుతం ఆయా ఫోటోలు సైతం విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
గతేడాది `పెంగ్విన్`, `మిస్ ఇండియా` చిత్రాలతో ఆడియెన్స్ ముందుకు వచ్చింది. ఓటీటీల్లో విడుదలైన ఈ సినిమాలు పరాజయం చెందాయి.
ప్రస్తుతం కీర్తి `గుడ్ లక్సఖీ`, `రంగ్ దే`, రజనీతో `అన్నాత్తే`, `సాని కాయిధమ్`, `మరక్కర్` చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.
ఫ్లైట్లో స్టయిలీగా పోజులిస్తున్న కీర్తి.