కార్వా చౌత్లో కొత్త జంట.. కాజల్-గౌతమ్ కిర్రాక్ ఫోటోస్
కొత్త పెళ్ళి జంట కాజల్, గౌతమ్ కిచ్లు వారం రోజుల క్రితమే మూడుముళ్ళ బంధంతో ఒక్కటయ్యారు. తాజాగా తన భర్త బాగుండాలని పూజలు చేస్తోంది కాజల్. కార్వా చౌత్ పూజా కార్యక్రమంలో పాల్గొని సందడి చేసింది. ఈ సందర్భంగా ఈ కొత్త జంట ఫోటోలకు పోజులిస్తూ రెచ్చిపోయారు.
కాజల్ అక్టోబర్ 30న ముంబయికి చెందిన వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లుని పెళ్ళి చేసుకుంది.
మ్యారేజ్ జరిగిన రోజు నుంచి రోజుకో కొత్త ఫోటోలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ అభిమానులను ఖుషీ చేస్తుందీ జంట.
తమ మ్యారేజ్ డిజైనింగ్ వేర్స్ ని ధరించి ఫోటో షూట్లతో రెచ్చిపోతున్నారు. కిర్రాక్ పుట్టిస్తున్నారు.
తాజాగా ఉత్తరాధిలో ప్రముఖంగా జరుపుకునే కార్వా చౌత్ పూజలోనూ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా దిగిన ఫోటోలను ఇన్ స్టాగ్రామ్ ద్వారా కాజల్ పంచుకుంది.
రెండ్ శారీలో కనువిందుగా ఉంది కాల్. మరోవైపు పింక్ శారీలో భర్తతో కలిసి పురాతన కట్టడం బ్యాక్డ్రాప్లో పోజులిచ్చారు.
ఒకరినొకరు చూసుకుంటూ, ఒకరిపై ఒకరు తమ ప్రేమని చాటుకుంటున్నారు కాజల్, కిచ్లు
ఈ కొత్త జంట ఆదర్శ జంటగా కనిపిస్తుంది.
ప్రస్తుతం ఈ ఫోటోలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.