విడాకుల విషయంలో నాగచైతన్య చెప్పింది అబద్దమా? సమంత అలా చెప్పిందేంటి? సరికొత్త చర్చ
నాగచైతన్య, సమంత విడిపోవడమనేది టాలీవుడ్లో పెద్ద హాట్ టాపిక్. దీనికి సంబంధించిన చర్చ ఇప్పటికీ సాగుతూనే ఉంది. ఇటీవల మరికొన్ని కొత్త విషయాలు బయటకు రావడం మరింత సంచలనంగా మారుతుంది.

నాగచైతన్య(Naga Chaitanya), సమంత(Samantha) దాదాపు ఏడేళ్లు సీక్రెట్గా ప్రేమించుకుని, ఒక్కటయ్యారు. నాలుగేళ్లకే విడిపోయిన విషయం తెలిసిందే. విడిపోవడానికి కారణాలు వెల్లడించలేదు. కానీ ఆ మధ్య `బంగార్రాజు` సినిమా ప్రమోషన్ లో భాగంగా మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగచైతన్య కి ఈ ప్రశ్న ఎదురైనప్పుడు ఆయన చాలా కాజ్వల్ గా రియాక్ట్ అయ్యారు. సమంత, తాను అనుకునే విడిపోయామని, ఇద్దరం ఓ అండర్ స్టాండింగ్తోనే విడిపోయామని చెప్పారు. ఆ విషయంలో ఇద్దరం హ్యాపీగానే ఉన్నామని తెలిపారు.
సమంత, తాను డిస్కస్ చేసుకుని, ఇద్దరు అంగీకారంతోనే తమ విడాకులు వ్యవహారం జరిగిందని, విడిపోవడమే బెటర్ అనుకుని డైవర్స్ తీసుకున్నామని, విడిపోయాక ఇద్దరం ఎవరికి వారు హ్యాపీగానే ఉన్నామని చెప్పారు చైతూ. విడాకులు చాలా సింపుల్గానే జరిగినట్టు చెప్పారు నాగచైతన్య. #samantha Naga chaitanya Divorce)
కానీ ఇటీవల సమంత మాత్రం ఈ విషయంలో పూర్తిగా విరుద్ధంగా రియాక్ట్ అయ్యింది. విడాకులు తీసుకోవడమనేది ఈజీగా జరగలేదని చెప్పింది. ఇటీవల సమంత హిందీలో ప్రసారమయ్యే `కాఫీ విత్ కరణ్` షోలో పాల్గొన్న విషయం తెలిసిందే. ఇందులో మ్యారేజ్ లైఫ్ గురించి, చైతూతో విడిపోవడం గురించి ఓపెన్ అయ్యింది. నాగచైతన్య తన మాజీ భర్త అని చెప్పిన సమంత, ఇద్దరం ఒకే గదిలో ఉంటే ఆయుధాలు, ఎలాంటి వస్తువులు లేకుండా చూసుకోవాలని చెప్పింది. ఇద్దరి మధ్య ఆ స్థాయిలో కోపం ఉన్నట్టు పరోక్షంగా తెలిపింది. ఈ లెక్కన విడిపోవడానికి ముందు ఇద్దరి మధ్య చాలా గొడవలు జరిగాయనే విషయం అర్థమవుతుంది.
దీనిపై సమంత ఇంకా చెబుతూ, తమ విడాకులు అంత సులభంగా రాలేదని, డైవర్స్ తీసుకోవడమనేది సామరస్యంగా జరగలేదని చెప్పింది. విడాకులు తీసుకునే సమయంలో తాను ఎంతో బాధ అనుభవించినట్టు పేర్కొంది. ఆ సమయంలో తన జీవితం ఎంతో కష్టంగా మారిపోయిందని సమంత ఎమోషనల్ అయ్యింది. అయితే ప్రస్తుతం వాటిని దాటుకుని మానసికంగా ధైర్యంగా ఉన్నానని, చాలా స్ట్రాంగ్గా మారినట్టు తెలిపింది సమంత.
ఈ లెక్కన నాగచైతన్య మీడియాతో చెప్పింది అబద్ధమా? అనే చర్చ మొదలైంది. నాగచైతన్య చెప్పినదానికి పూర్తి అపోజిట్గా సమంత చెప్పడంతో ఇప్పుడు సరికొత్త చర్చ తెరపైకి వస్తుంది. విడిపోవడానికి ముందు వీరిద్దరి మధ్య ఏం జరిగిందనేది హాట్ టాపిక్గా మారింది. నాగచైతన్య ఎందుకు అలా చెప్పాడనేది చర్చనీయాంశం అవుతుంది. ఆ మ్యాటర్ చాలా సింపుల్ అనేది మీడియాకి తెలియడం కోసం అలా చెప్పాడా? లేక అందులో మరేమైనా ఉందా? అనే సరికొత్త చర్చ తెరపైకి వస్తుంది. మరి ఈ ఇద్దరి మధ్య ఏం జరిగిందనేది స్టిల్ సస్పెన్స్.
`ఏం మాయ చేసావె` టైమ్లో ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం స్నేహంగా,ఆ తర్వాత ప్రేమగా మారింది. అయితే మ్యారేజ్కి రెండేళ్ల ముందు ఈ ఇద్దరు ప్రేమలో ఉన్నట్టు వార్తలు బయటకు వచ్చాయి. ఇద్దరూ తమ పెద్దలను ఒప్పించి 2017 అక్టోబర్ 6,7 తేదీల్లో హిందూ, క్రిస్టియన్ సాంప్రదాయాల ప్రకారం సమంత, నాగచైతన్య గ్రాండ్గా మ్యారేజ్ చేసుకున్నారు. వీరి మ్యారేజ్కి ఏకంగా పది కోట్లు ఖర్చు అయినట్టు వార్తలొచ్చాయి. కానీ కరెక్ట్ గా నాలుగేండ్లకే 2021లో అక్టోబర్ 2న ఈ ఇద్దరు విడిపోతున్నట్టు సోషల్ మీడియా ద్వారా ప్రకటించి అభిమానులకు, ఇండస్ట్రీకి షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఎవరికి వారు తమ కెరీర్లో బిజీగా ఉన్నారు. స్వేచ్చగా సినిమాలు చేసుకుంటున్నారు.