ప్రశాంత్ వర్మ మహాభారతంలో ఎన్టీఆర్, మహేష్, చరణ్, పవన్ పాత్రలు ఇవే! బన్నీ, ప్రభాస్ ని వదిలేశాడేంటి!
దర్శకుడు ప్రశాంత్ వర్మకు పరిశ్రమలో ఓ ఇమేజ్ ఉంది. విభిన్నమైన చిత్రాలతో ఆయన మార్క్ క్రియేట్ చేశాడు. ఆయన లేటెస్ట్ మూవీ హనుమాన్. ఈ చిత్ర ప్రమోషన్స్ లో పాల్గొంటున్న ప్రశాంత్ వర్మ మహాభారతం ప్రాజెక్ట్ పై ఆసక్తికర కామెంట్స్ చేశాడు.
భారతీయ ఇతిహాసాలైన రామాయణ, మహాభారతాలు సినిమాటిక్ సబ్జక్ట్స్. అందుకే వీటిపై వివిధ భాషల్లో వందల చిత్రాలు తెరకెక్కాయి. ముఖ్యంగా మహాభారతం కథ, అందులోని పాత్రలు ఆసక్తిగొలిపేలా ఉంటాయి.
![article_image2](https://static-ai.asianetnews.com/images/01hkbq05ma90peefk2bp47scr7/gdamjdcxyaaxa-y-jpg_300x160xt.jpg)
Mahesh Babu
చాలా మంది ఫిలిం మేకర్స్ కి మహాభారతం డ్రీం ప్రాజెక్ట్. అందులో కర్ణుడు, అర్జునుడు, భీష్ముడు, భీముడు, దుర్యోధనుడు పాత్రలకు కావాల్సినంత హీరోయిజం దట్టించి చూపించవచ్చు.
దర్శకధీరుడు రాజమౌళి మహాభారతం తనన కలల ప్రాజెక్ట్ అని చాలా ఏళ్ల క్రితమే చెప్పాడు. ఎప్పటికైనా మహాభారతం తీస్తాను. కాకపోతే ఆ సబ్జెక్టు ని సిల్వర్ స్క్రీన్ పై డీల్ చేసేంత అనుభవం, పరిపక్వత ఇంకా రాలేదని చెప్పాడు.
Prasanth Varma
కాగా యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సైతం తన డ్రీం ప్రాజెక్ట్ మహాభారతం అన్నారు. ఆయన లేటెస్ట్ మూవీ హనుమాన్ సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఈ క్రమంలో ఆయన చిత్ర ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు.
మహాభారతం తాను తెరకెక్కిస్తే ఏ పాత్రకు ఏ హీరోని ఎంచుకుంటాడో వివరించాడు. ప్రశాంత్ వర్మ మహాభారతంలో శ్రీకృష్ణుడిగా మహేష్ బాబును ఎంపిక చేశారు. ఇక అర్జునుడు పాత్రకు రామ్ చరణ్ ని ఎంచుకున్నారు. భీముడు పాత్రకు ఎన్టీఆర్ అన్నారు.
కర్ణుడు పాత్రకు కర్ణుడు పాత్రకు పవన్ కళ్యాణ్, ధర్మరాజు పాత్రకు చిరంజీవిని తీసుకుంటాను అన్నారు. నకులుడు పాత్రకు నాని, సహదేవుడిగా విజయ్ దేవరకొండ, దుర్యోధనుడు పాత్రకు మోహన్ బాబును ఎంపిక చేస్తానని ప్రశాంత్ వర్మ చెప్పుకొచ్చాడు.
అయితే టాలీవుడ్ టాప్ హీరోల్లో మరో ఇద్దరు అల్లు అర్జున్, ప్రభాస్ లకు ప్రశాంత్ వర్మ మహాభారతం క్యాస్టింగ్ లో చోటు దక్కలేదు. ఆ ఇద్దరు స్టార్స్ ని ఆయన ఎందుకు ఎంచుకోలేదో అర్థం కాలేదు. ఆయన స్టేట్మెంట్ వైరల్ అవుతుంది.
ఇక తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన హనుమాన్ సూపర్ హీరో యాక్షన్ డ్రామా అని తెలుస్తుంది. జనవరి 12న హనుమాన్ విడుదలవుతుంది. వరలక్ష్మి శరత్ కుమార్ హనుమాన్ చిత్రంలో కీలక రోల్ చేస్తున్నారు.