రోజా నా అదృష్టం అన్న శేఖర్ మాస్టర్, ముసలోళ్ళు అంటూ ఆది పంచ్...షాక్ లో రోజా..!
భారతీయులందరూ కులమతాలకు అతీతంగా జరుపుకొనే దివాళి పండగ సందడే వేరు. కుటుంబ సభ్యులందరూ ఓ చోట చేరి జరుపుకునే దీపావళి, అందరి జీవితాలలో కొత్త కాంతులు నింపే పండుగగా అందరూ భావిస్తారు.
దీపావళి నాడు కొత్త బట్టలు, పిండి వంటలతో ఇంటిల్లపాది ఓ చోట చేరి బుల్లితెర కార్యక్రమాలు వీక్షించడం అనేది అనవాయితీగా ఉంది. అందుకే సరికొత్త కార్యక్రమాలతో ప్రతి ఛానల్ సిద్ధం అవుతుంది. కాగా దీపావళి సంధర్భంగా కనకమహాలక్ష్మీ లక్కీ డ్రా పేరుతో ఈటీవి ఓ కార్యక్రమం రూపొందించింది.
రోజా, శేఖర్ మాస్టర్ డాన్స్ పెరఫార్మెన్సుతో పాటు జబర్ధస్త్ ఆర్టిస్ట్స్ స్కిట్స్ ఈ వేడుకలో హైలెట్ గా నిలిచాయి. కాగా ఈ ఈవెంట్ లో శేఖర్ మాస్టర్ ని శ్రీముఖి అడిగిన ప్రశ్నకు ఆయన ఆసక్తికర సమాధానం చెప్పగా, ఆది తన మార్క్ పంచ్ తో దుమ్ము రేపాడు.
'లక్కీ డ్రా అంటే అదృష్టం కదా... మీ అదృష్టం ఏమిటని' శ్రీముఖి అడిగారు. దానికి శేఖర్ మాస్టర్ ' రోజా గారు నా ఎదుట ఉండడమే నా అదృష్టం' అని సమాధానం చెప్పాడు. పక్కనే ఉన్న హైపర్ ఆది 'ముసల్లోళ్ళకి దసరా పండగని విన్నాం...ఈ దీపావళి ఏంట్రా బాబూ' అని పంచ్ విసిరారు.
రోజా, శేఖర్ మాస్టర్ పై ఆది వేసిన పంచ్ కి షోలోని వారందరూ గట్టిగా నవ్వారు. ఆది పంచ్ కి రోజా, శేఖర్ మాస్టర్ షాక్ తిన్నారు. ఇక సుధీర్ పైన కూడా ఆది పంచ్ ల వర్షం కురిపించారు.
గెటప్ శ్రీను, రాకెట్ రాఘవ చేసిన స్కిట్స్ ప్రేక్షకులను అలరించడం ఖాయంగా కనిపిస్తుంది. దివాలి కానుకగా నేడు సాయంత్రం ప్రసారం కానున్న కనకమహాలక్ష్మీ లక్కీ డ్రా ఈవెంట్ ప్రోమో ఆసక్తి రేపుతోంది.