కరోనా తగ్గడంతో కూతురుతో శ్వేతా తివారీ చెట్టాపట్టాల్.. తెగ ఎంజాయ్ చేస్తుందిగా!
హిందీ టీవీ స్టార్ బ్యూటీ శ్వేతా తివారీ తెగ ఎంజాయ్ చేస్తుంది. అయితే ఇటీవల కరోనాకి గురైన ఈ బ్యూటీ దాన్నుంచి బయటపడటంతో ఇప్పుడు రెచ్చిపోతుంది.
టీవీ, సినీ హాట్ స్టార్ శ్వేతా తివారి హిందీ సీరియల్స్ ఎంతో పాపులర్ అయిన విషయం తెలిసిందే. గత నెలలో తనకు కరోనా సోకింది. దీంతో వెంటనే హోం క్వారంటైన్కి వెళ్ళిపోయింది.
వైరస్ నుంచి కోలుకోవడంతో ఇక జులు విప్పిన సింహాలా రెచ్చిపోయింది. ఆదివారం తన 40వ పుట్టిన రోజుని ముద్దుల తనయ పలక్ తివారితో కలిసి సెలబ్రేట్ చేసుకుంది.
అందుకోసం బయటకు వెకేషన్ వెళ్ళింది.
తల్లీకూతుళ్లు ఇద్దరు రెడ్ డ్రెస్ ధరించి ఫోటోలకు పోజులిచ్చారు. వీరిద్దరిలో స్వేచ్ఛ పొందిన ఫీలింగ్ స్పష్టంగా కనిపిస్తుంది.
దీంతో రెచ్చిపోయి ఎంజాయ్ చేశారు.
శ్వేత తివారి మొదటి భర్త రాజా చౌదరికి పలక్ జన్మించారు. ప్రస్తుతం శ్వేత బాలీవుడ్ నటుడు అభినవ్ కోహ్లీని వివాహం చేసుకుంది. వీరికి రేయాన్స్ అనే మూడేళ్ళ కుమారుడు ఉన్నాడు.
`కాహిన్ కిస్సి రాజ్`, `కాసంతి జిందగీ కాయ్`, `నచ్ బలియే2`, `దోస్త్`, `నాగిన్`, `జానే క్యా బాత్ హుయ్`, `ఇస్ జంగిల్ సే ముజ్సే బచావో`, `జలక్ దిఖ్లా జా 3`, `రంగోలి`, `మేతి`, `బాల్ వీర్`, `బేగుసరై`, `మేరే డాడ్ కి దుల్హన్` వంటి సీరియల్స్ లో నటించింది.
సీరియల్స్ తోపాటు `మదోషి`, `ఆబ్రా కా దాబ్రా`, `బెన్నీ అండ్ బబ్లో`, `బిన్ బులాయే బరాతి`, `మెలే నా మిలే హమ్`, `మ్యారీడ్ 2 అమెరికా`, `యేడ్యాచి జత్రా`, `సుల్తనాట్`, `సిక్స్ ఎక్స్` వంటి సినిమాల్లోనూ నటించింది.
శ్వేతా తివారి గ్లామర్ ఫోటోస్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.