పందిలా ఉన్నావు నువ్వు హీరోయిన్ వా అన్నారు, ప్రియమణికి జరిగిన అవమానాలు అన్నీఇన్నీ కావు!
హీరోయిన్ ప్రియమణి మోస్ట్ వాంటెడ్ యాక్ట్రెస్ గా ఉన్నారు. సీనియర్ హీరోలకు జంటగా, అలాగే కథలో కీలకమైన క్యారెక్టర్ రోల్స్ కి ప్రియమణి బెస్ట్ ఛాయిస్ అయ్యారు. నటిగా జాతీయ అవార్డు అందుకున్న ప్రియమణి అనేక వేధింపులకు గురయ్యారట.
ప్రియమణి సోషల్ మీడియాలో బాడీ షేమింగ్ కి గురయ్యారు. నెటిజెన్స్ ఆమె శరీర ఆకృతిపై దారుణమైన కామెంట్స్ చేసేవారట. పందిలా ఉన్నావు నువ్వు హీరోయిన్ వా, అసలు హీరోయిన్ అంటే ఎలా ఉండాలి. ఆ లక్షణాలు నీకు ఉన్నాయా అని కామెంట్స్ పెట్టేవారట.
ఆ కామెంట్స్ చూసినప్పుడల్లా ప్రియమణి చాలా అవమానంగా, బాధగా ఫీల్ అయ్యేవారట. ఒక దశలో బరువు తగ్గగా, బొద్దుగా ఉన్నప్పుడే బాగున్నారు. సన్నబడ్డాక మీ గ్లామర్ పోయింది అని ఎదురు దాడి చేశారట.
అసలు ఒక అమ్మాయి ఎలా ఉండాలో చెప్పడానికి మీరెవరు అంటూ కామెంట్స్ చేసిన నెటిజెన్స్ కి వార్నింగ్ ఇచ్చింది ప్రియమణి. హీరోయిన్ గా ఎదగాలంటే ఒక్క అందం మాత్రమే చాలదని, నటించే టాలెంట్ ఉంటే స్టార్ హీరోయిన్ కావచ్చని ప్రియమణి నిరూపించారు.
మరి ఇన్ని అవమానాలను ఎదుర్కొని గొప్ప నటిగా తనను తాను నిరూపించుకున్నారు ప్రియమణి. ప్రస్తుతం తెలుగులో నారప్ప మూవీలో వెంకటేష్ భార్యగా చేస్తున్నారు. అలాగే విరాట పర్వం మూవీలో లేడీ నక్సల్ రోల్ చేస్తున్నారు.
హిందీ, తమిళ్, కన్నడ భాషలలో కలిపి అరడజనుకు పైగా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు ప్రియమణి. వీటితో పాటు టీవీ షోలు, వెబ్ సిరీస్లు చేస్తూ ప్రియమణి కెరీర్ ని జెట్ స్పీడ్ తో సవారీ చేయిస్తుంది.
ఇక 2017లో ప్రియమణి ఈవెంట్ మేనేజర్ అయిన ముస్తఫా రాజ్ ని ప్రేమ వివాహం చేసుకున్నారు. ప్రియమణి నటించిన ది ఫ్యామిలీ మాన్ సిరీస్ సక్సెస్ ఫుల్ గా నడుస్తుంది.