అబద్దం చెప్పి రహస్యంగా అతన్ని కలిసే దాన్ని...అది తెలిసి పేరెంట్స్ కోప్పడ్డారు
బాలీవుడ్ లో కియారా అద్వానీ కెరీర్ జెట్ స్పీడ్ తో వెళుతుంది. ఈ అమ్మడు క్రేజీ ఆఫర్స్ దక్కించుకుంటూ స్టార్ హీరోయిన్ హోదా వైపు అడుగులు వేస్తుంది. అక్కడ బిజీ కావడంతో కియారా టాలీవుడ్ వైపు కన్నెత్తి చూడడం లేదు.
తెలుగులో కియారా అద్వానీ మహేష్ కి జంటగా భరత్ అనే నేను మూవీలో నటించారు. ఆ చిత్రం సూపర్ హిట్ కావడంతో పాటు మహేష్- కియారా పెయిర్ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచింది. ఆ తరువాత వినయ విధేయ రామ చిత్రంలో రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా నటించింది.
గత ఏడాది కియారా కబీర్ సింగ్, గుడ్ న్యూస్ చిత్రాలలో నటించింది. అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ గా వచ్చిన ఆ మూవీ అక్కడ ఇండస్ట్రీ హిట్ అందుకుంది. అలాగే రొమాంటిక్ కామెడీ గుడ్ న్యూస్ సైతం మంచి హిట్ కొట్టింది.
లస్ట్ స్టోరీస్ లో బోల్డ్ రోల్ చేసి సంచలనం రేపిన కియారా పై ఎఫైర్స్ వార్తలు పెద్దగా వచ్చిన దాఖలాలు లేవు. హీరో సిద్దార్థ్ మల్హోత్రాతో ఈమె ప్రేమాయణం నడిపినట్లు వార్తలు వచ్చాయి.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో కియారా అద్వాని తన ఫస్ట్ క్రష్ గురించి చెప్పి అందరినీ షాక్ కి గురి చేసింది. కియారా ఇంటర్ చదువుతున్నప్పుడు ఓ అబ్బాయిని ఎంతగానో ఇష్టపడిందట. సమయం దొరికితే చాలు అతడితో గడపాలని అనుకునేదట.
కాలేజ్ కి సెలవులు ఇచ్చినప్పుడల్లా ఇంట్లో అబద్దం చెప్పి అతన్ని రహస్యంగా కలిసేదట. అతని కోసం చదువు కూడా నెగ్లెట్ చేసిందట. విషయం తెలుసుకున్న కియారా పేరెంట్స్ ఆమెను మందలించారట. చదువా...ప్రేమా అనే సందిగ్ధంలో చదువు కోసం ప్రేమను వదిలేసిందట కియారా.
కియారా అంతగా ఇష్టపడిన ఆ అదృష్టవంతుడు ఎవరని అందరూ చర్చించుకుంటున్నారు. ఇక అక్షయ్ కుమార్ కి జంటగా కియారా లక్ష్మీ బాంబ్ మూవీలో నటించగా విడుదలకు సిద్ధం అయ్యింది. మరో రెండు హిందీ చిత్రాలలో కియారా నటిస్తున్నారు.