- Home
- Entertainment
- క్రిమినల్స్ గా మారిన బన్నీ, మహేష్, తారక్, పవన్, కమల్, యష్.. సక్సెస్ కి కొత్త మంత్రం..రికార్డుల తంత్రం..
క్రిమినల్స్ గా మారిన బన్నీ, మహేష్, తారక్, పవన్, కమల్, యష్.. సక్సెస్ కి కొత్త మంత్రం..రికార్డుల తంత్రం..
ఒకప్పుడు సినిమాల్లో హీరోలు రాముడు మంచి బాలుడిగా ఉండేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మార్చేశారు. రాముడు క్రిమినల్.. అన్ని రకాల ఆగడాలు చేస్తారు. ఇప్పుడు ఇదే సక్సెస్ మంత్రం కావడం విశేషం.

సినిమాలో హీరో మంచి వాడు, అందరికి సహాయం చేస్తాడు, మంచి పనులే చేస్తాడు, చెడుపై పోరాటం చేస్తాడనేది పాత నానుడి. ఒకప్పటి ఇలాంటి కథలతో వచ్చిన సినిమాలు విజయాలు సాధించాయి. మంచి వసూళ్లని రాబట్టాయి. కానీ నేడు అవి బోర్ కొడుతున్నాయి. అయితే ఇప్పుడు హీరో విలన్ అయితే, ఓ క్రిమినల్ అయితే మాత్రం ఎగబడి చూస్తున్నారు. అలాంటి సినిమాలే ఇప్పుడు సంచలనాలు క్రియేట్ చేస్తున్నారు. బన్నీ, యష్, కమల్ హాసన్, మహేష్, పవన్ వంటి స్టార్లు నెగటివ్గా కనిపించిన సినిమాలు బాక్సాఫీస్ని షేక్ చేస్తున్నాయి.
ప్రస్తుతం వరల్డ్ వైడ్గా కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్న చిత్రం `విక్రమ్`. కమల్ హాసన్ నటించిన చిత్రమిది. విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రంలో కమల్ హాసన్ విలన్. ఓ క్రిమినల్గా మారి వరుసగా హత్యలు చేస్తుంటారు. అదే ఇప్పుడు నచ్చింది. దీంతో బాగా ఆదరిస్తున్నారు. ఈ సినిమా ఆల్టైమ్ రికార్డ్ లు క్రియేట్ చేయడం విశేషం. కమల్ సరికొత్త పాత్రలో విశ్వరూపం చూపించారు.
మరోవైపు ఇటీవల ఇండియన్ సినిమా కలెక్షన్లని షేక్ చేసిన సినిమా `కేజీఎఫ్2`, `బాహుబలి 2` కలెక్షన్లే టార్గెట్గా బాక్సాఫీసుపై దండయాత్రం చేసింది. సుమారు రూ.1200వందల కోట్లు కలెక్ట్ చేసింది. ఈ చిత్రంలో హీరో యష్ క్రిమినల్. అక్రమంగా గోల్డ్ వ్యాపారం చేస్తుంటాడు. దేశ వ్యాప్తంగా ఓ పెద్ద చీకటి సామ్రాజ్యాన్నే స్థాపిస్తారు. తన ప్రత్యర్థులను అంతం చేస్తూ చివరికి ప్రభుత్వం చేతిలో అంతమవుతాడు. ఈ చిత్రం సృష్టించిన సంచలనాలు ఏంటో అందరికి తెలిసిందే.
బన్నీ సైతం విలన్గా మారాడు. `పుష్ప` చిత్రంలో అల్లు అర్జున్ క్రిమినలే. చిన్నకూలోడు నుంచి ఎర్రచందనం స్మగ్లర్గా ఎదిగిన భారీ హత్యలు చేస్తాడు. సిండికేట్గా అవతరిస్తున్నారు. తనని అడ్డుకోబోయిన పోలీస్ అధికారికి చుక్కలు చూపిస్తాడు. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా దుమారం రేపింది. రూ.350కోట్లు వసూళ్లు చేసి బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఇందులో బన్నీది ఆల్మోస్ట్ క్రిమినల్ పాత్రే.
ప్రభాస్ నటించిన `సాహో` చిత్రంలో ఆయన పాత్ర క్రిమినల్ రోలే. కాకపోతే ఈ చిత్రం పరాజయం చెందినా, భారీగా వసూలు చేసింది. హీరో నెగటివ్ రోల్ చేయడం, యాక్షన్ సినిమా కావడంతో ఇది మూడువందలకుపైగా కోట్లు రాబట్టింది.
అలాగే `టెంపర్`, `జై లవకుశ` చిత్రంలో ఎన్టీఆర్ నెగటివ్ రోలే చేశాడు. హిట్ కొట్టాడు. `గబ్బర్ సింగ్`లో పవన్ని చివరి వరకు నెగటివ్గానే సాగుతుంది.ఈ సినిమా ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసిన విసయం తెలిసిందే. మరోవైపు `పోకిరి`, `బిజినెస్మ్యాన్`,`అతడు` చిత్రాల్లో మహేష్ క్రిమినల్గానే నటించాడు. హిట్లు కొట్టారు. ఇలా ఇప్పుడు హీరోలు నెగటివ్ రోల్స్, క్రిమినల్ పాత్రలు చేస్తే బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపిస్తుంది. హిట్కి కొత్త మంత్రంగా మారుతుంది. అయితే ఏ సినిమాలో అయినా అంతిమంగా క్లైమాక్స్ లో హీరో హీరోనేగానే కనిపించడం కొసమెరుపు.