కృష్ణను ఏంటి మూలన పడేశారు అన్నారు, లక్ష పెట్టి కొంటె కోట్లు పలుకుతుంది.... నరేష్ కీలక వ్యాఖ్యలు
నటుడు నరేష్ తన పేరెంట్స్ కృష్ణ, విజయ నిర్మల ఫార్మ్ హౌస్లో జీవించడం పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఊరి చివర 12 ఎకరాల పొలం కొని కృష్ణ, విజయ నిర్మల అక్కడకు వచ్చేశారట. అదేంటి కృష్ణను మూలన పడేశారనే విమర్శలు వినిపించాయట.
Naresh
పరిశ్రమలో పుట్టి పెరిగాడు నరేష్. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి హీరో అయ్యాడు. కామెడీ చిత్రాల హీరోగా ఫేమస్ అయ్యాడు. కొన్ని సీరియస్ రోల్స్ కూడా చేశారు. ఫేడ్ అవుట్ అయ్యాక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారారు. తెలుగులో నరేష్ బిజీ ఆర్టిస్ట్. ఆయన నటనకు ఎవరైనా ఫిదా కావాల్సిందే.
Naresh
విజయ నిర్మల ఆయన తల్లి కాగా, కృష్ణ స్టెప్ ఫాదర్. విజయ నిర్మల-కృష్ణ మరణించే వరకు కలిసే ఉన్నారు. నరేష్ వాళ్ళతోనే ఉండేవాడు. కాగా ఫిల్మ్ నగర్ లో ఉండే కృష్ణ, విజయ నిర్మల నగర శివారుకు వెళ్లిపోయారట. విజయ నిర్మల ఓ 12 ఎకరాల పొలం హైదరాబాద్ శివారులో కొన్నారట. దాన్ని ఎంత కొన్నారో? ఇప్పుడు ఎంత ధర పలుకుతుందో నరేష్ వెల్లడించారు.
అమ్మ రైతు. వ్యవసాయం చేయాలని 12 ఎకరాల పొలం కొన్నది. అప్పుడు ఎకరం ధర రూ. 1.3 లక్షలు. అసలు అంత ధర పెట్టి ఎందుకు కొన్నారని అప్పట్లో అన్నారు. ఆ పొలంలో ఇల్లు కట్టి ఫిల్మ్ నగర్ నుండి ఇక్కడకు వచ్చేశారు. నాకు కూడా ఏంటి నగరానికి దూరంగా తీసుకొచ్చేశారన్న భావన కలిగింది. కొందరైతే కృష్ణను మూలన పడేశారు అన్నారు.
ఈ పొలం లో నాటిన ప్రతి మొక్క అమ్మ నాటినదే. ఒక తమలపాకు తోట, ఆర్గానిక్ పద్దతిలో పళ్ళు, కూరగాయలు పండించేది. చేలో పండిన కూరగాయలు అమ్మితే రూ. 300 వచ్చాయి. అందుకు కూడా ఆమె మురిసిపోయేది. నాకు ఆశ్చర్యం వేసేది. ఒకప్పుడు ఇది నగర శివారు. కానీ ఇప్పుడు నగర నడిబొడ్డు అయ్యింది.
కృష్ణ-విజయ నిర్మల అంతటి దూర దృష్టి కలిగి ఉండేవారు. అప్పుడు కేవలం లక్ష రూపాయలతో కొన్న ఎకరం పొలం ధర.. నేడు ఎన్ని కోట్లో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని నరేష్ చెప్పుకొచ్చాడు. తాను కూడా చిలుకూరులో రూ. 50 లక్షలతో పొలం కొంటే దాని ప్రస్తుత ధర కోట్ల రూపాయలు అని నరేష్ అన్నారు.
Naresh pavitra
కాగా నరేష్ ఆస్తి విలువ 1000 కోట్లు అనే ఓ వాదన ఉంది. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ఒప్పుకున్నారు. తన తల్లి విజయ నిర్మల పెద్ద మొత్తంలో తనకు ఇచ్చారని. తన ఆస్తి విలువ ఒక అంచనా ప్రకారం వెయ్యి కోట్ల వరకు ఉంటుందని అన్నారు.
Naresh pavitra
నరేష్ కొన్నాళ్లుగా నటి పవిత్ర లోకేష్ తో సహజీవనం చేస్తున్నారు. మూడో భార్య రమ్య రఘుపతితో విడాకుల విషయంలో గొడవలు జరుగుతున్నాయి. పవిత్ర లోకేష్ తో తన రిలేషన్ ని బహిరంగంగా ప్రకటించిన నరేష్... ఆమెతో కలిసి జీవిస్తున్నారు. వీరిద్దరూ జంటగా మళ్ళీ పెళ్లి టైటిల్ తో ఓ చిత్రం చేయడం విశేషం.