ముఖం చాటేసిన త్రివిక్రమ్, మహేష్ నిర్ణయం ఇదే... అవి క్యాన్సిల్!
గుంటూరు కారం మూవీ అనుకున్న స్థాయిలో విజయం సాధించలేదు. దర్శకుడు త్రివిక్రమ్ తన మార్క్ కోల్పోయాడనే మాట వినిపిస్తుండగా ఆయన మీడియా ముందుకు రావడం లేదు. ఈ క్రమంలో మహేష్ బాబు ఓ నిర్ణయం తీసుకున్నాడట.
త్రివిక్రమ్-మహేష్ బాబు కాంబోలో వచ్చిన అతడు క్లాసిక్ గా నిలిచింది. ముఖ్యంగా ఈ సినిమాలో కామెడీ ఏళ్ల తరబడి గుర్తుండిపోతుంది. త్రివిక్రమ్ రాసిన డైలాగ్స్ లో బెస్ట్ అని చెప్పొచ్చు. యాక్షన్, కామెడీ, ఎమోషన్, రొమాన్స్ కలగలిపి అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించేలా అతడు మూవీ తెరకెక్కింది.
![article_image2](https://static-ai.asianetnews.com/images/01hmbv5xvvqyy30kp1hzcz4eg8/Mahesh-Babu6-1705499621243_300x399xt.jpg)
రెండో చిత్రం ఖలేజా కూడా చాలా బాగుంటుంది. అయితే కమర్షియల్ గా ఆడలేదు. త్రివిక్రమ్ సినిమాలు కొంచెం ప్రత్యేకంగా ఉంటాయి. పదునైన డైలాగ్స్ తో కూడిన ఎమోషనల్ సన్నివేశాలు తెరకెక్కించడంలో త్రివిక్రమ్ ఒక మార్క్ క్రియేట్ చేశాడు. గుంటూరు కారంలో ఇవేమీ లేవు. ఇది అసలు త్రివిక్రమ్ మూవీనేనా అనే సందేహం కలుగుతుంది.
ఒక రెగ్యులర్ కమర్షియల్ మూవీ. ఎలాంటి కొత్తదనం లేని కథ, కథనాలు. మహేష్ తన స్టార్ డమ్ తో సినిమాను సేవ్ చేశాడు. కనీసం గౌరవప్రదమైన వసూళ్లు రాబట్టాడు. బహుశా మరో హీరో అయితే భారీగా నష్టాలు చూడాల్సి వచ్చేదేమో. గుంటూరు కారం విషయంలో త్రివిక్రమ్ విమర్శలపాలు అవుతున్నాడు.
Mahesh Babu
ఈ క్రమంలో త్రివిక్రమ్ మీడియా ముందుకు వచ్చేందుకు ఇష్టపడటం లేదట. ప్లాన్ చేసిన సక్సెస్ మీట్స్, ప్రమోషనల్ ఈవెంట్స్ క్యాన్సిల్ చేశారట. ఇక మహేష్ కూడా చేసేది లేక కుటుంబంతో విదేశాలకు వెళుతున్నాడట.
ప్రతి సినిమా విడుదల అనంతరం ఫ్యామిలీతో టూర్ కి వెళ్లడం మహేష్ కి అలవాటు. అలాగే కొత్త సినిమా మొదలయ్యే ముందు కూడా ఒక టూర్ ఖచ్చితంగా ప్లాన్ చేస్తున్నారు. మహేష్ బాబు ఫ్యామిలీతో జర్మనీ వెళుతున్నట్లు సమాచారం. అక్కడ కొన్ని వారాలు గడపనున్నారట. ఈ మేరకు ఓ న్యూస్ చక్కర్లు కొడుతుంది.
నెక్స్ట్ మహేష్ బాబు దర్శకుడు రాజమౌళితో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇది పాన్ వరల్డ్ మూవీ అని చెప్పొచ్చు. రాజమౌళి కెరీర్లోనే అత్యధిక బడ్జెట్ మూవీ. దాదాపు రూ. 1000 కోట్ల బడ్జెట్ అంటున్నారు. ఈ ఏడాది చివర్లో సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది.