న్యాస్టీ యాష్ ట్యాగ్స్ తో మహేష్, బన్నీ ఫ్యాన్ వార్...మధ్యలో శ్రీరెడ్డి సెటిల్మెంట్!
స్టార్ హీరోల మధ్య ఫ్యాన్ వార్ సర్వసాధారణం. సోషల్ మీడియా ప్రభావం ఎక్కువైన తరువాత ఇది మరీ శృతి మించింది. ఒకరిని మరొకరు దూషించుకోవడానికి ఫ్యాన్స్ సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్స్ వాడుకుంటున్నారు.
తాజాగా మహేష్, అల్లు అర్జున్ ఫ్యాన్స్ ట్విట్టర్ వార్ కి దిగారు. వేళ కాని వేళ... మహేష్ ఫ్యాన్స్, అల్లు అర్జున్ న్యాస్టీ హ్యాష్ ట్యాగ్స్ ట్రెండ్ చేస్తూ.. ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటున్నారు.
మహేష్ ఫ్యాన్స్ #insecuredogalluarjun అని ట్రెండ్ చేస్తుంటే.. అల్లు అర్జున్ ఫ్యాన్స్ #insecuregaymaheshbabu అనే ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు.
ఎప్పటి నుండో మహేష్, అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్య గొడవలు ఉన్నాయి. గత ఏడాది సంక్రాంతి చిత్రాల విడుదల విషయంలో జరిగిన కొన్ని పరిణామాలు దీనిని తీవ్ర తరం చేశాయి.
సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురంలో చిత్రాలు 2020 సంక్రాంతికి విడుదల కాగా, థియేటర్స్ సర్దుబాటు విషయంలో రెండు చిత్రాల యూనిట్స్ మధ్య వివాదం తలెత్తింది.
పెద్దల జోక్యంతో రాజీపది థియేటర్స్ సర్దుబాటు చేసుకున్నారు. తాజాగా మహేష్, బన్నీ ఫ్యాన్స్ తిట్ల వర్షం కురిపించుకుంటున్నారు.
వీళ్ళ గొడవ ఇలా ఉంటే మధ్యలో దూరింది శ్రీ రెడ్డి. ఫ్యాన్స్ పేరుతో కొట్టుకుంటున్న నెటిజెన్స్ కి మంచి సలహా ఇచ్చింది.
మహేష్ ఫ్యాన్స్, అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఇలా ట్విట్టర్ లో కొట్టుకోకపోతే... అందరూ చక్కగా వెళ్లి జాతి రత్నాలు సినిమా చూడొచ్చుగా అని సలహా ఇచ్చింది.
ఎందుకు మీకు ఈ గొడవలు, హాయిగా కామెడీ చిత్రం జాతి రత్నాలు చూడండి అని గొడవకు ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేసింది.
మరి శ్రీ రెడ్డి సలహా ఎంత వరకు మహేష్, అల్లు అర్జున్ డై హార్డ్ ఫ్యాన్స్ పాటిస్తారో చూడాలి. రానురాను టాలీవుడ్ లో కూడా కోలీవుడ్ మాదిరి ఫ్యాన్ వార్స్ ఎక్కువైపోతున్నాయి.