SSMB29 : గుడ్ న్యూస్.. మహేశ్ బాబు - రాజమౌళి మూవీ షూటింగ్ ఎప్పుడో తెలుసా? లేటెస్ట్ అప్డేట్స్ ఇవే!
మహేశ్ బాబు - రాజమౌళి Raja Mouli సినిమాపై గుడ్ న్యూస్ వినిపిస్తోంది. ప్రస్తుతం బాబు జర్మనీకి వెళ్లడంతో SSMB29పై ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అందాయి. షూటింగ్ ప్రారంభం, రిలీజ్, తదితర విషయాలు ఆసక్తికరంగా మారాయి.
సూపర్ స్టార్ మహేశ్ బాబు Mahesh Babu అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం ‘ఎస్ఎస్ఎంబీ29’ SSMB29. ఈ చిత్రానికి మాస్టర్ మైండ్, దర్శకధీరుడు రాజమౌళి Rajamouli దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే.
![article_image2](https://static-ai.asianetnews.com/images/01h553zxz8h0a8ftdncmbdrxj5/mahesh-babu--5--jpg_300x174xt.jpg)
రెండేళ్ల కిందనే ఈ కాంబో సెట్ అయినా.. ఇప్పటికీ వరకు మాత్రం అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాలేదు. ఇలోగా మహేశ్ బాబు ‘గుంటూరుకారం’ Guntur Kaaramతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ మూవీ ప్రమోషన్స్, రిలీజ్ పూర్తవడంతో ప్రస్తుతం ‘ఎస్ఎస్ఎంబీ29’పై ఫోకస్ పెట్టారు.
ఈ సినిమా కోసమే మహేశ్ బాబు రీసెంట్ గా జర్మనీకి వెళ్లినట్టు తెలుస్తోంది. అక్కడ ప్రీ ప్రొడక్షన్ పనులు షురూ అయ్యాయని అంటున్నారు. ఆఫ్రికా అడవుల్లో ఈ యాక్షన్-అడ్వెంచర్ ఉంటుందన్న విషయం తెలిసిందే. ఇక ఈ చిత్రాన్ని రూ.1000 కోట్లతో నిర్మించబోతున్నారనే మాటే గూస్ బంప్స్ తెప్పిస్తోంది.
ప్రముఖ నిర్మాత కెఎల్ నారాయణ నిర్మాతగా దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మించనున్నారని తెలుస్తోంది. ఈ విషయంలో ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే... SSMB29 Movie గురించి తాజాగా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అందాయి.
ఇండియాలోనే అత్యధిక బడ్జెట్ తో నిర్మించబోతున్న చిత్రంగా ‘ఎస్ఎస్ఎంబీ29’ ఉండబోతోంది. అందుకే ఈ భారీ ప్రాజెక్ట్ ను ఇండియాస్ ఇండియానా జోన్స్ గా పిలుస్తున్నారు. ఇక త్వరలోనే అధికారికంగా కూడా సినిమాను అనౌన్స్ చేయబోతున్నారంట.
అనౌన్స్ మెంట్ సమయంలో నిర్వహించే ప్రెస్ మీట్ లో ఎస్ఎస్ రాజమౌళి సినిమా స్టోరీ, సినాప్సిస్ గురించి రివీల్ చేయనున్నారు. ఇక ఈ చిత్రం పీరియాడిక్ ఫిల్మ్ కాదంట.. ప్రస్తుతం కాలంలోనే కథ నడుస్తుందని అంటున్నారు.
2024 ఉగాది సందర్భంగా SSMB29 Shooting ప్రారంభం కానుందని బజ్. ఆ తర్వాత రెండేళ్లకు అంటే 2026 ఉగాదికే రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారంట మేకర్స్. ఈ మూవీతో మహేశ్ బాబు ఇండియాలోనే సరికొత్త రికార్డులను సెట్ చేయబోతున్నారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇక ఈ చిత్రంలో మహేశ్ బాబు సరసన బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె, ఇండోనేషియా నటి చెల్సియా ఇస్లాన్ నటించబోతున్నారని తెలుస్తోంది. త్వరలోనే అన్ని వివరాలను అధికారికంగా వెల్లడించబోతున్నారు.