పుష్ప హిట్ కాదు, ఫ్లాప్ మూవీ.. షాకింగ్ ఫ్యాక్ట్స్ బయట పెట్టిన డైరెక్టర్ తేజ
ముక్కుసూటిగా మాట్లాడే దర్శకుడు తేజ పుష్ప చిత్రంపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు.
పుష్ప మొదటి భాగం హిందీలో ఊహించని విధంగా సక్సెస్ అయింది. పుష్ప 2పై నార్త్ లో విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కలసి చేసిన మ్యాజిక్ కి ఇండియా మొత్తం ఫిదా అయింది. పుష్ప మొదటి భాగం హిట్ కావడంతో పుష్ప 2 కోసం దేశం మొత్తం ఎదురుచూస్తోంది.
ప్రస్తుతం పుష్ప పార్ట్ 2 షూటింగ్ కి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ముక్కుసూటిగా మాట్లాడే దర్శకుడు తేజ పుష్ప చిత్రంపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతా చెప్పుకుంటున్నట్లు పుష్ప చిత్రం హిట్ కాదు అని తేల్చేశారు. తెలుగులో చాలా ఏరియాల్లో బయ్యర్లకి పుష్ప చిత్రం భారీ లాస్ మిగిల్చింది అని అన్నారు.
కానీ ఈ చిత్రం నార్త్ లో బాగా ఆడడం వల్ల హిట్ అని అంటున్నారు. వాస్తవానికి ఈ చిత్రం తెలుగు ఫ్లాప్ అని తేజ షాకింగ్ కామెంట్స్ చేశారు. తెలుగులో ఈ చిత్రం మొత్తం డబ్బు రికవరీ చేయలేదు. నష్టాలు ఎక్కువగానే ఉన్నాయి అని అన్నారు.
పుష్ప రిజైనప్పుడు తెలుగులో నెగిటివ్ టాక్, రివ్యూలు వచ్చాయి. కానీ అల్లు అర్జున్ యాటిట్యూడ్, సాంగ్స్ తో నార్త్ లో ఈ చిత్రానికి మంచి క్రేజ్ ఏర్పడింది. అక్కడ భారీ వసూళ్లు రాబట్టింది. కానీ తెలుగులో లాభాలు తెచ్చిపెట్టలేకపోయింది.
మల్టిఫ్లెక్స్ లలో విపరీతంగా పెరిగిన ఫుడ్ ఐటమ్స్ ధరల వల్ల ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్స్ కి రావడం లేదని తేజ విమర్శించారు. దారుణంగా ధరలు పెంచడం కరెక్ట్ కాదని తేజ అన్నారు. పాప్ కార్న్, కూల్ డ్రింక్స్, ఇతర ఫుడ్ ఐటమ్స్ ధరలు పెంచితే ఇండస్టీకే నష్టం అని తేజ అన్నారు.
తేజ ప్రస్తుతం దగ్గుబాటి అభిరామ్ ని హీరోగా పరిచయం చేస్తూ.. 'అహింస' అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. నార్త్ లో విజయం సాధించడంతో పుష్ప చిత్ర యూనిట్ కి జోష్ వచ్చినట్లు ఐంది. ఆ ఉత్సాహంతో పుష్ప 2ని దర్శకుడు సుకుమార్ మరింత గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు. మొదటి భాగంలో జరిగిన పొరపాట్లు రిపీట్ కాకుండా సెకండ్ పార్ట్ కోసం జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా దేవిశ్రీ బిజియంపై అప్పట్లో దారుణంగా ట్రోలింగ్ జరిగింది.