అసూయ పుట్టించే అనసూయ అందాలు.. హరీష్ శంకర్ నోట తనికెళ్ల భరణి మాట..ఈవెంట్లో రచ్చ
అనసూయ అందమంటే మామూలు కాదు. ఆమె హాట్ అందాలకు లక్షలాది మంది అభిమానులున్నారు. సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఆమె సొంతం. అయితే ఇప్పుడు హరీష్ శంకర్ ఆమె అందంపై చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి.
Anasuya Bharadwaj
`జబర్దస్త్`(Jabardasth) యాంకర్గా పాపులర్ అయిన అనసూయ(Anasuya)కి సోషల్ మీడియాలో భారీ క్రేజ్ ఉంది. ఆమె హాట్ ఫోటోల కోసం లక్షలాది మంది ఫాలోవర్స్ ఈగర్గా వెయిట్ చేస్తుంటారు. గ్లామర్ ఫోటో షూట్లతో నెట్టింట దుమారం రేపే ఈ భామ సినిమాల్లోనూ అడపాదడపా తన అందాలను ఆరబోస్తుంది. ఐటెమ్ సాంగ్ల్లో రెచ్చిపోయి హాట్ షో చేస్తుంది.
Anasuya
ప్రస్తుతం ఆమె `వాంటెడ్ పండుగాడ్` (Wanted PanduGod)అనే చిత్రంలో నటిస్తుంది. కె.రాఘవేంద్రరావు సమర్పణలో రూపొందిన చిత్రమిది. శ్రీధర్ సీపాన దర్శకత్వం వహించారు. అనసూయతోపాటు సుడిగాలి సుధీర్, దీపికా పిల్లి, సునీల్, శ్రీనివాస్రెడ్డి వంటి కమెడియన్లు చాలా మంది నటించారు. మంచి కామెడీ చిత్రంగా రూపొందిన ఈ సినిమా ఆగస్ట్ 19న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
ఇందులో హరీష్ శంకర్, తనికెళ్ల భరణి, అనసూయ, సుధీర్, సునీల్తోపాటు చిత్ర బృందం పాల్గొంది. హరీష్ శంకర్ మాట్లాడుతూ అనసూయపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆమె అందం అసూయ పుట్టించేలా ఉందని చెప్పారు. ఏవీ చూసిన ఆయన అనసూయ అసూయ పుట్టించేలా ఉందని చెప్పడం విశేషం. అయితే అది తన మాటలు కాదు, తన ఫీలింగ్.
ఈవెంట్లో అనసూయ ఏవీ ప్రదర్శించగా అది చూసిన సీనియర్నటుడు, రైటర్ తనికెళ్ల భరణి ముగ్దుడయ్యారు. అనసూయ అసూయ పుట్టించేలా ఉందని హరీష్ శంకర్(Harish Shankar)తో అన్నాడట. అదే విషయాన్ని స్టేజ్పైన అనమని చెప్పగా, తాను నామాలు పెట్టుకున్న ఆ మాట అనలేనని హరీష్ శంకర్తో చెప్పాడట. దీంతో తాను మాట్లాడే సమయంలో దర్శకుడు హరీష్ శంకర్ ఆ విషయాన్ని వెల్లడించారు. అనసూయ అందం అసూయ పుట్టించేలా ఉందన్నారు.
నిజానికి అనసూయ అందం ఏజ్ పెరిగే కొద్ది పెరిగింది. ఆమె మరింత హాట్గా, సెక్సీగా మారిపోతుంది. అందుకే ఆమెకి సోషల్ మీడియోలోనే కాదు, జనరల్ ఆడియెన్స్ లోనూ భారీ ఫాలోయింగ్, క్రేజ్ ఏర్పడుతుంది.ఆమె అందాల ఫోటోల కోసం లక్షలాది నెటిజన్లు ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఆమె పంచుకునే ఫోటోలతో మంత్రముగ్దులవుతున్నారు. తాజాగా `వాంటెడ్ పండుగాడ్` ఈవెంట్లో ఆమె అందం ప్రస్తావన ఓ స్టార్ డైరెక్టర్ నుంచి రావడం ఆమె రేంజ్ని మరింతగా పెంచిందని చెప్పొచ్చు.
ఇంకా హరీశ్ శంకర్ చెబుతూ, తనకు కమెడియన్లు అంటే ఇష్టమని తెలిపారు. వారిని గౌరవిస్తానని బ్రహ్మానందం, అలీ, ధర్మవరపు సుబ్రమణ్యం, ఎమ్మెస్ నారాయణ ఇప్పటి అప్ కమింగ్ హాస్యనటుల వరకు వారంటే తనకిష్టమని, వారిని రెస్పెక్ట్ చేస్తానని తెలిపారు. అలాంటి కమెడియన్లు కలిసి నటిస్తున్న ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలన్నారు. `పండుగాడిని పట్టుకుంటే కోటి` అనే సినిమా క్యాప్షన్లో ఉన్నట్టు సినిమా విజయం సాధించి కోట్లు వసూలు చేయాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.
ఈ కార్యక్రమానికి చివర్లో అటెండ్ అయిన అనసూయని చూసి ఆడియెన్స్ హోరెత్తించారు. ఆమె క్రేజ్ని తెలిపారు. స్టేజ్కి వచ్చిన వెంటనే ఎంతో చలాకీగా, జోష్ఫుల్గా మాట్లాడే ప్రయత్నం చేసింది అనసూయ. కానీ అదే సమయంలో సుడిగాలి సుధీర్ వచ్చారు. దీంతో మరోసారి మారుమోగింది ప్రాంగణం. చాలా సేపు హోరెత్తించింది. అనసూయ ఎంత వారించినా వాళ్లు ఆపలేదు. దీంతో మధ్యలోనే మానేసి రాఘవేంద్రరావుకి మైక్ ఇవ్వగా, ఆయన సైలెంట్ చేయాలని చూసినా వర్కౌట్ కాలేదు. దీంతో సుడిగాలి సుధీర్ రంగంలోకి దిగడంతో అరుపులు తగ్గాయి.
హరీష్ శంకర్.. దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు గురించి చెబుతూ, ఆయనతో గడిపిన క్షణాలను గుర్తు చేసుకున్నారు. జనరల్గా ఆయన రాత్రి 9 దాటితో ప్యాకప్ చెప్పేస్తారని, బయట కనిపించరని తెలిపారు. కానీ తన ఓ సినిమా టైమ్లో వి.వి.వినాయక్ ఇంట్లో కలిశామని, అప్పుడు రాత్రి రెండు గంటల వరకు తన కోసం ఉన్నారని, అది తన అదృష్టమన్నారు. ఆయన దృష్టిలో పండు అంటే గాడ్ అని తెలిపారు. రాఘవేంద్రరావు అంటే పండ్లు గుర్తొస్తాయని ఈ చిత్రంలో అనసూయపై వాటర్ మిలన్ వేశారని చెప్పారు. అదే ఆయన స్పెషాలిటీ అని, దాన్ని ఆయన దేవుడిగా భావిస్తారని వెల్లడించారు.