ఎన్టీఆర్ గతంపై నటి వివాదాస్పద ట్వీట్.. వైరల్
టాలీవుడ్లో వివాదాస్పద నటీమణులు ఎక్కువతున్నారు. ఇప్పటికే శ్రీరెడ్డి, మాధవీ లత లాంటి వారు తరుచూ కాంట్రవర్సీలకు కేంద్ర బింధువుగా మారుతున్నారు. వీరి లిస్ట్లో తరుచూ కనిపించే మరో కాంట్రవర్సియల్ బ్యూటీ పూనమ్ కౌర్.
ప్రత్యక్ష్యంగా ఎలాంటి కామెంట్స్ చేయకపోయినా.. ఇన్ డైరెక్ట్గా ట్వీట్లు చేస్తూ మీడియా అటెన్షన్ను తన వైపు తిప్పుకోవటం పూనమ్ కౌర్కు అలవాటు. గతంలో పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ లపై పూనమ్ ట్వీట్ లు చేసిందటూ వార్తలు వైరల్ అయ్యాయి.
అంతేకాదు పవన్, పూనమ్ల మధ్య ఏదో జరిగిదంటూ అప్పట్లో వార్తలు హల్చల్ చేశాయి. అయితే ఈ వార్తలపై పూనమ్ స్పందించకపోయినా ఖండించకపోవటంతో ఆ వార్తలు నిజమే అన్న ప్రచారం జరిగింది.
ఆ తరువాత కూడా పలు వివాదాల్లో పూనమ్ కౌర్ పేరు ప్రముఖంగా వినిపించింది. ఈ వివాదాల కారణంగా సినిమాలకు దూరమై చాలా కాలం అవుతున్నా పూనమ్ పేరు ఇంకా టాలీవుడ్ లో వినిపిస్తూనే ఉంది.
తాజాగా ఈ బ్యూటీ మరో వివాదాస్పద ట్వీట్ చేసింది. ఈ నెల 20న ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఓ కాంట్రవర్షియల్ ట్వీట్ చేసింది పూనమ్. ఎన్టీఆర్ పేరు మెన్షన్ చేయకుండా పూనమ్ చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారింది.
`ఎదుగుతున్న వయసులో అకారణంగా ప్రేమ నిరాదరణకు గురయ్యాడు.. చిన్నప్పటి నుంచి పెద్దయ్యేంత వరకు.. అతని ప్రయాణాన్ని నేను ఎంతో గౌరవిస్తున్నా. స్వర్గంలో ఉన్న అతని తాత ఆశీర్వాదాలు అతనికి ఎప్పుడూ ఉంటాయి. బెస్ట్ విషెస్ అంటూ ట్వీట్ చేసింది పూనమ్.
ఎన్టీఆర్ హీరోగా ఎదుగుతున్న సమయంలో నందమూరి కుటుంబం అతన్ని దగ్గరకు రానివ్వలేదన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే ఎన్టీఆర్ ఎదిగిన తరువాత అందరూ ఆయన్ను మా వాడు అని చెప్పుకోవటం మొదలు పెట్టారు. ఇదే విషయాన్ని ప్రస్తావించింది పూనమ్. మరి ట్వీట్ వివాదం ఎక్కడి వరకు వెళుతుందో చూడాలి.