ఎన్టీఆర్ చేసిన పాత్రలాంటిదే 'ఆచార్య' లో నాదీను:చిరు
ఈ సినిమా గురించి రోజుకో వార్త మీడియాలో వస్తోంది. తాజాగా ఈ చిత్రం గురించి , అందులో తన పాత్ర గురించి అఫీషియల్ గా చిరంజీవి రివీల్ చేసారు. ఈ సినిమాలో తన పాత్ర ఏమిటనే విషయమై ఆయన ఓ మీడియా హౌస్ కు ఇచ్చిన ఫోన్ ఇంటర్వూలో చెప్పుకొచ్చారు. ఆ విషయాలు చాలా ఇంట్రస్టింగ్ గా ఉన్నాయి. అవేమిటో చూద్దాం.
రీసెంట్ గా ఓ న్యూస్ పేపర్ కు ఇచ్చిన ఇంటర్వూలో చిరంజీవి మాట్లాడుతూ..తన పాత్ర జనతా గ్యారేజ్ చిత్రంలో ఎన్టీఆర్ చేసిన క్యారక్టర్ ని పోలి ఉంటుందని చెప్పారు. దాంతో ఇప్పుడు ఎన్టీఆర్ అభిమానులకు సైతం ఈ సినిమాపై ఆసక్తి ఏర్పడింది.
జనతాగ్యారేజ్ సినిమాలో ఎన్టీఆర్ ...ఓ ప్రకృతి ప్రేమికుడుగా కనిపిస్తాడు. అలాగే కేవలం ఇష్టపడటమే కాక,దాన్ని రక్షించటానికి కూడా పూనుకుంటాడు. అలాంటి పోలికలతో ఉండే పాత్రను ఈ ఆచార్య సినిమాలోనూ చిరంజీవి చేస్తున్నా అని చెప్పారు.
ఆచార్య చిత్రంలో చిరంజీవి సహజ వనరులు కోసం పోరాడే ప్రొఫెసర్ గా కనిపించబోతున్నారు. అందుకోసం ఆయన ఎంత దూరమైనా వెళ్లే పాత్రలో కనిపిస్తారు.
అంతే కాకుండా ఈ సినిమాలో చిరంజీవి..గతంలో ఓ నక్సలైట్ గా కనిపిస్తారు. ఆయన్ని గైడ్ చేసే పాత్రలో రామ్ చరణ్ కనిపిస్తారు. ఆ సీన్స్ సెకండాఫ్ లో వస్తాయి.
అలాగని ఈ సినిమా మెసేజ్ లు చెప్తూ సాగదని, ఎమోషన్స్, ఎంటర్టైన్మెంట్ కలిగలిసి, ఓ ఇంటిలిజెంట్ స్క్రీన్ ప్లే తో సాగుతుందని చెప్తున్నారు. ఈ విషయాన్ని స్పష్టం చేసారు.
అంతేకాకుండా చిరంజీవి ప్రత్యేకంగా కొరటాల వర్కింగ్ స్టైల్ ని పొగిడారు. కొరటాల తో పనిచేయటం చాలా మంచి ఎక్సపీరియన్స్ అని చెప్పుకొచ్చారు. ఎన్నో సినిమాలు చేసిన సీనియర్ ..ఇలా ఓ దర్శకుడు గురించి చెప్పటం అంటే మామూలు విషయం కాదు.
అయితే చిరంజీవి ఇంతకు ముందు సినిమా టైటిల్ ని, ఇప్పుడు క్యారక్టర్ ని రివీల్ చేసేయటం మాత్రం టీమ్ ని కంగారుపెడుతోంది. చిరు తన భోళాతనంతో సినిమా కథలో ఇంకేం రివీల్ చేస్తాడో అని ఆలోచనలో పడుతున్నారు. అయితే వారు తెలుసుకోవాల్సింది ఏమిటీ అంటే చిరంజివి..ఎవరికి ఎంతవరకూ ఏది చెప్పాలో స్పష్టంగా తెలిసిన వ్యక్తి.
ఇక ఈ సినిమాలో ముందుగా హీరోయిన్ త్రిషను అనుకోగా ఆమె ఈ ప్రాజెక్టు నుండి తప్పుకున్న సంగతి తెలిసిందే.. అయితే సినిమా నుంచి త్రిష తప్పుకోవడంతో సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వచ్చాయి. తన పాత్రకి తగ్గ ప్రాధాన్యతను తగ్గించారని అందుకే ఆమె తప్పుకుందనే ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది. అయితే ఈ విషయాలపైన చిరంజీవి స్పందించారు.
త్రిషకి చిత్ర యూనిట్ కి మధ్య ఎలాంటి గొడవలు లేవని స్పష్టం చేశారు. మణిరత్నం సినిమా కోసం ఆమె ఎక్కువ డేట్లు కేటాయించవలసి రావడంతో ఆమె ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లుగా చిరంజీవి వెల్లడించారు. ఇందులో ఎలాంటి వివాదాస్పదమైన అంశం లేదని చిరు అన్నారు.
త్రిష స్థానంలో హీరోయిన్ గా కాజల్ ని ఎంపిక చేసింది చిత్రయూనిట్.. ఈ సినిమాలో రెజీనా ఒక ప్రత్యేక పాటలో కనిపించనుంది. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని దసరా సందర్భంగా విడుదల చేయాలని చిత్ర నిర్మాతలు భావిస్తున్నారు. సినిమాపైన భారీ అంచనాలు నెలకొన్నాయి.
అలాగే గతేడాది చిరంజీవి హీరోగా నటించిన ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాలో అడవి పిల్ల పాత్రలో నటించిన నిహారిక ఇపుడు ఈ చిత్రంలోనూ ఓ విభిన్నమైన పాత్రలో కనిపించబోతోందిట.
ఇక ఓ పాత్రకు ముందునుంచి రామ్ చరణ్ అయితే బాగుంటుందని దర్శకుడు కొరటాల అనుకుంటున్నాడని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం చరణ్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్లో నటిస్తున్నాడని, దీంతో తమ సినిమాకు డేట్స్ ఇవ్వడం కష్టమే అన్నారు. ఈ విషయమై దర్శకులు రాజమౌళి, కొరటాల కలిసి చర్చించి ఒక ఒప్పందానికి వస్తే 'ఆచార్య'లో చరణ్ ఉండొచ్చుని చిరు వెల్లడించాడు.