MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఆ మూవీ ఎందుకు ఒప్పుకోలేదు అని చరణ్ ని తిట్టిన చిరంజీవి, కట్ చేస్తే బిగ్ డిజాస్టర్.. ప్రభాస్, ఎన్టీఆర్ కలిసి

ఆ మూవీ ఎందుకు ఒప్పుకోలేదు అని చరణ్ ని తిట్టిన చిరంజీవి, కట్ చేస్తే బిగ్ డిజాస్టర్.. ప్రభాస్, ఎన్టీఆర్ కలిసి

మెగా పవర్ స్టార్ రాంచరణ్ తన కెరీర్ లో ఒక భారీ డిజాస్టర్ నుంచి తెలివిగా ఎస్కేప్ అయ్యాడు. మగధీర తర్వాత రాంచరణ్ కి ఎలాంటి సినిమా చేయాలనే డైలమా ఉండేది. 

2 Min read
Tirumala Dornala
Published : Nov 14 2024, 09:46 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

మెగా పవర్ స్టార్ రాంచరణ్ తన కెరీర్ లో ఒక భారీ డిజాస్టర్ నుంచి తెలివిగా ఎస్కేప్ అయ్యాడు. మగధీర తర్వాత రాంచరణ్ కి ఎలాంటి సినిమా చేయాలనే డైలమా ఉండేది. అనేక కథలు పరిశీలించి ఆరెంజ్ మూవీ చేయాలని డిసైడ్ అయ్యాడు. ఆరెంజ్ చిత్రం అప్పటికి ఫ్లాప్ అయినప్పటికీ ఆ తర్వాత కల్ట్ మూవీ అనే ప్రశంసలు దక్కించుకుంది. ఇప్పటికీ ఈ చిత్రంపై క్రేజ్ ఉంది. రీరిలీజ్ లో కూడా రికార్డులు సృష్టించింది. 

 

25

ఆరెంజ్ మూవీ చేస్తున్నపుడు చరణ్ కి చరణ్ కి మగధీర తరహాలో భారీ బడ్జెట్ చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. డైరెక్టర్ తన ఫ్రెండ్ అయినప్పటికీ చరణ్ ఆ చిత్రాన్ని రిజెక్ట్ చేశాడు. తన ఫ్రెండ్ ని నొప్పించకుండా తర్వాత మరో చిత్రం చేద్దాం అని తెలివిగా తప్పించుకున్నాడట. 

 

35

ఆ మూవీ మరేదో కాదు.. అనగనగా ఓ ధీరుడు. ఈ చిత్రానికి దర్శకుడు రాఘవేంద్ర రావు తనయుడు ప్రకాష్. రాంచరణ్, ప్రకాష్ ఇద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్. చిరంజీవి ఇంట్లో చరణ్, ప్రకాష్ గంటలు గంటలు గడిపేవారట. అనగనగా ఓ ధీరుడు చిత్ర టీజర్ ట్రైలర్ విడుదలయ్యాక చిరంజీవి రాంచరణ్ ని తిట్టారట. డైరెక్టర్ నీ ఫ్రెండ్.. ఇంత మంచి సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని నువ్వు ఎందుకు ఒప్పుకోలేదు అని తిట్టారట. 

 

45

కట్ చేస్తే సినిమా రిలీజ్ అయ్యాక దారుణమైన పరాజయంగా నిలిచింది. ప్రకాష్ అనుభవలేమి ఈ చిత్రంలో కొట్టొచ్చినట్లు కనిపించింది. తీవ్రమైన విమర్శలు ఎదురయ్యాయి. ఈ సినిమా ఒప్పుకోలేదని నాన్న గారు తనని తిట్టినట్లు చరణ్ ఆడియో వేడుకలో రివీల్ చేశారు. ఈ చిత్ర ట్రైలర్ చూస్తుంటే జగదేక వీరుడు అతిలోక సుందరి, మగధీర రెండు చిత్రాలు కలిపితే ఎలా ఉంటుందో అంత అద్భుతంగా ఉంది అని చరణ్ హైప్ ఇచ్చాడు. ఇక తాను జగదేక వీరుడు అతిలోక సుందరి 2 చేయాల్సిన అవసరం లేదని చెప్పాడు. 

 

55

ఆడియో వేడుకకి ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, రానా దగ్గుబాటి లాంటి వారంతా హాజరై ఈ చిత్రానికి హైప్ ఇచ్చారు. కానీ ఎవ్వరూ ఈ మూవీని కాపాడలేడు. సిద్దార్థ్ హీరోగా, శృతి హాసన్ హీరోనే గా నటించారు. మంచు లక్ష్మి కీలక పాత్రలో నటించింది. సిల్లీగా అనిపించే గ్రాఫిక్స్, కథ కథనాలు ఏమాత్రం ఆడియన్స్ కి నచ్చలేదు. మొత్తంగా చరణ్ తండ్రి దగ్గర తిట్లు తిన్నా తెలివైన నిర్ణయం తీసుకున్నాడు. 

 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
ప్రభాస్
Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved