అందుకే చార్మీ పెళ్లి ఆగిపోయిందా.. వైరల్ అవుతున్న న్యూస్
టాలీవుడ్ లో స్టార్ హీరోలదంరితో జత కట్టిన పంజాబీ భామ చార్మీ. హీరోయిన్ కెరీర్ మంచి ఫాంలో ఉండగానే నిర్మాణ రంగంవైపు అడుగులేసిన ఈ బ్యూటీ ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలకు నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తోంది. తాజా ఈ భామకు సంబంధించి ఓ ఆసక్తికర వార్త మీడియాలో చక్కర్లు కొడుతోంది.
అంతేకాదు ఇటీవలే ఇక నటనకు గుడ్ బై చెప్పేస్తున్నా అంటూ సంచలన ప్రకటన చేసి అందరి దృష్టిని ఆకర్షించింది ఈ బ్యూటీ. తాజాగా చార్మీకి సంబంధించిన మరో ఇంట్రస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
చార్మి సినిమాలు చేస్తున్న రోజుల్లో కంటే ఆమె నిర్మాణ రంగంలో అడుగుపెట్టిన తరువాత ఎక్కవుగా గాసిప్స్ వినిపించాయి. ముఖ్యంగా పూరి జగన్నాథ్, చార్మిల రిలేషన్ షిప్ గురించి పెద్ద ఎత్తున గాసిప్స్ వినిపించాయి. తాజాగా చార్మీ పెళ్లికి సంబంధించి కూడా ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ వైరల్ అయ్యింది.
ఇటీవల కుటుంబ సభ్యుల ఒత్తిడి మేరకు చార్మి పెళ్లి ఓకే చెప్పిందట. అయితే ఆమె సన్నిహితులు లాక్ డౌన్ కాలంలో పెళ్లి ఎందుకు పరిస్థితులు చక్కబడిన తరువాత గ్రాండ్ పెళ్లి చేసుకోమని చెప్పటంతో ఆమె పెళ్లి వాయిదా వేసుకుందని తెలుస్తోంది.
అమృత్సర్కు చెందిన ఓ వ్యక్తిని పెళ్లి చేసుకునేందుకు చార్మీ అంగీకరించిందట. ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఉద్దేశం ఆమెకు లేకపోయినా కుటుంబ సభ్యుల ఒత్తిడి మేరకు చార్మీ ఈ పెళ్లికి అంగీకరించినట్టుగా వార్తలు వైరల్ అయ్యాయి.
దీంతో ప్రస్తుతానికి వాయిదా పడినా త్వరలోనే చార్మి పెళ్లి కబురు చెప్పటం ఖాయమని భావిస్తున్నారు అభిమానులు. ఇప్పటికే ఛార్మీ వయసు కూడా మూడు పదులు దాటేయంతో పెళ్లికి ఇంకా ఆలస్యం చేయకూడాదని భావిస్తున్నారట అభిమానులు.