డిఫరెంట్ ఎక్స్ పీరియెన్స్ అన్న స్వాతి.. ఇక్కడ ఉన్నవాళ్ళంతా దొంగలే.. నాగ్ షాకింగ్ కామెంట్..
27వ రోజు బిగ్బాస్4 షో ఆద్యంతం రసవత్తరంగా సాగింది.నాగార్జున రాకతో, అవినాష్,అరియానా మధ్య ఫన్నీ సీన్ని రక్తికట్టి నవ్వులు పూయించింది.
బాస్ నాగార్జున ఎంట్రీ జరిగింది. గంగవ్వ చీరకట్టులో బాగా ర్యాప్ వాక్ చేసిందని ప్రశంసించారు. కాయిన్స్ గేమ్ ఆడలేదన్నారు.
మొదటగా మోనాల్, అఖిల్ మధ్య లాస్యకి జోడి లేరని బాధపడుతున్నట్టు డిస్కర్ చేసుకున్నారు. మరోవైపు అభిజిత్, హారిక మధ్య అఖిల్కి సంబంధించిన డిస్కషన్ జరిగింది. అఖిల్ మధ్యలో ఇన్వాల్వ్ అవుతున్నాడని మండిపడ్డాడు.
దొంగ గేమ్ ఆడించారు. ఇందులో ఒకరు తమకి నచ్చని పని, తప్పు పని చేసిన వారిని దొంగగా చూపించాల్సి ఉంటుంది. వారి వాదనలు విని ఇతరులు జడ్జ్ లుగా తీర్పు చెప్పాల్సి ఉంటుంది.
మొదట అరియానా స్టేషన్ ఆఫీసర్గా ఉండి, అమ్మ రాజశేఖర్ నింధితుడిగా చూపించి ఎఫ్ఐఆర్ చేసింది. రాజశేఖర్కి అవినాష్ డిఫెన్స్ లాయర్గా వ్యవహరించారు. ఈ వాదనలో రాజశేఖర్ నిర్ధోషిగా బయటపడ్డారు.
ఆ తర్వాత సుజాత స్టేషన్ ఆఫీసర్గా, సోహైల్ దొంగగా, మెహబూబ్ డిఫెన్స్ లాయర్గా కేసుని వాధించాడు. సోహైల్ నిర్ధోషిగా బయటపడ్డారు. ఇక అమ్మ రాజశేఖర్ స్టేషన్ ఆఫీసర్గా, సోహైల్ దొంగగా, కాయిన్స్ కొట్టేసిన దానిపై సోహైల్ తన కేసుని వాధించుకున్నాడు. నిర్ధోషిగా బయటపడ్డాడు.
కుమార్ సాయి స్టేషన్ ఆఫీసర్గా, అమ్మ రాజశేఖర్ దొంగగా, దివి లాయర్గా వాధించాడు. అమ్మ రాజశేఖర్ నిర్ధోషిగా బయటపడ్డారు.
సోహైల్ స్టేషన్ ఆఫీసర్.. దివి దొంగగా జరిగిన కేసులో దివి నిర్ధోషిగా బయటపడ్డారు. అలాగే అఖిల్ స్టేషన్ మాస్టర్గా, అమ్మరాజశేఖర్ దొంగగా వాదనలో అమ్మ దోషిగా నిలిచారు. ఆ తర్వాత అవినాష్ స్టేషన్ మాస్టర్గా, దివి దొంగగా జరిగిన వాదనలో దివి బాగా ఆడలేదన్నారు.
లాస్య స్టేషన్ మాస్టర్గా, స్వాతి దీక్షిత్ దొంగగా జరిగిన వాదనలో స్వాతి దొంగ. నోయల్ స్టేషన్ మాస్టర్గా, సుజాత దొంగగా జరిగిన వాదనలో తనే దొంగగా సుజాత తెలిపింది. మెహబూబ్ స్టేషన్ మాస్టర్గా, లాస్య దొంగగా, జరిగిన గేమ్లో సేఫ్ గేమ్ ఆడినట్టు తేలింది.మోనాల్ స్టేషన్ మాస్టర్గా, మోనాల్ నింధితుడిగా జరిగిన వాదనలో మోనాల్కి సారీ చెప్పలేకపోయాడు.
ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారని అభిజిత్, హారికలకు బిగ్బాస్ నాగ్ క్లాస్ పీకాడు. వారికి నిల్చునే శిక్ష వేశాడు. ఇక మోనాల్ తెలుగులో మాట్లాడినందుకు ఆమెని ప్రత్యేకంగా అభినందించాడు. అయితే మోనాల్ తెలుగులో ఓ పాట పాడి ఆకట్టుకుంది.
ఎలిమినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఎలిమినేషన్కి నామినేట్ అయిన స్వాతి దీక్షిత్, అభిజిత్, లాస్య, కుమార్ సాయి, మెహబూబ్, సోహైల్, హారికలకు ఎలిమినేషన్ టాస్క్ ప్రారంభించారు. గన్ షాట్ వస్తే వారు ఎలిమినేట్ అని చెప్పాడు నాగ్. ఈ ప్రక్రియ చాలా టెన్షన్గా సాగింది.
ఒక రౌండ్ అయిపోయింది. రెండో రౌండ్లో డైరెక్ట్ ఎలిమినేషన్ ఉంటుందని నాగ్ తేల్చి చెప్పేశాడు.
అభిజిత్, హారిక, కుమార్ సాయి, మెహబూబ్, సోహైల్ సేవ్ అయ్యారు. కానీ చివరి నుంచి రెండో ప్లేస్లో ఉన్న స్వాతి దీక్షిత్ రౌండ్ వచ్చేసరికి గన్ పేలింది. అంతే అంతా ఒక్కసారిగా షాక్ తిన్నారు. స్వాతి దీక్షిత్ ఎలిమినేట్ అయ్యింది. రేపు ఆమె బిగ్బాస్ వేదికపై కనిపించబోతున్నారు. ఇక ఎలిమినేట్ అయిన తర్వాత అందరు భావోద్వేగానికి గురవుతూ, స్వాతిని హౌజ్ నుంచి పంపించేశారు. ఇది తనకు డిఫరెంట్ ఎక్స్ పీరియెన్స్ అని తెలిపింది. అయితే నోయల్ ఏడవడం గమనార్హం.