మాస్టర్కి సారీ చెప్పిన సోహైల్.. మెహబూబ్కి సుజాత పెద్ద బొక్కే పెట్టిందిగా?
బిగ్బాస్ నాల్గో సీజన్ 4 25వ రోజు కిల్లర్ కాయిన్స్ గేమ్తోనే సాగుతుంది. ఇంటిసభ్యులకు టాస్క్ ఏమోగానీ, ఆడియెన్స్ కి మాత్రం షో చూడాలంటే పెద్ద టాస్క్ లాగా మారింది. గురువారం జరిగిన షోలో హైలైట్స్ పై ఓ లుక్కేద్దాం.
24వ రోజు జరిగిన గొడవ కారణంగా అమ్మ రాజశేఖర్కి సోహైల్ సారీ చెప్పాడు. వచ్చి మాస్టర్ చేతులు పట్టుకున్నాడు. ఇంటి సభ్యులంతా టాస్క్ ని కొనసాగించాలని బిగ్బాస్ చెప్పాడు. కిల్లర్ కాయిన్స్ గేమ్లో నోయల్, అరియానా, కుమార్ సాయి, అమ్మ రాజశేఖర్, సుజాత ఔట్ అవడంతో తప్పుకున్నారు.
రెండవ లెవల్ పూర్తయ్యే సమయంలో అరియానా, సుజాత మధ్య వాగ్వాదం జరిగింది. ఓడిపోయిన ఇంటి సభ్యులు వారి ఇంటికి కాయిన్స్ ని తిరిగి ఇవ్వడం జరిగింది.
బిగ్ బాస్..టాస్క్ లో చివరి, ఆఖరి లెవల్.. ఎండ్బజ్ మొగేలోపు.. సామ,దాన భేద దండోపాయాలతో తమ వద్ద ఉన్న కాయిన్స్ విలువని పెంచుకునే అవకాశం ఉందని బిగ్బాస్ చెప్పారు. దీంతో కాయిన్స్ ని దొంగిలించేందుకు, లాక్కునేందుకు పోటీ పడ్డారు.
తమ వద్ద ఉన్న కాయిన్స్ ఉన్న విలువ చెప్పారు. మెహబూబ్ వద్ద అత్యధికంగా 10050 ఉన్నాయి. స్పెషల్ పవర్ కలిగిన స్విచ్ కాయిన్స్ సుజాత వద్ద ఉంది. ఆ కాయిన్ ఉపయోగించి ఇతర సభ్యులతో స్విచ్ చేసుకోవచ్చు. మెహబూబ్ కాయిన్స్ వద్ద స్విచ్ చేసుకుంది సుజాత. దీంతో ఎక్కువ కాయిన్స్ ఉన్న సుజాత, అమ్మ రాజేశేఖర్, కుమార్, హారిక.. కెప్టెన్ పోటీదారులుగా ఎంపికయ్యారు.
మోనాల్, మెహబూబ్, అఖిల్ మధ్య కిల్లర్ కాయిన్స్ లోని న్యాయం, అన్యాయాలపై డిస్కస్ చేసుకున్నారు. అలాగే అభిజిత్, హారిక కలిసి షోలోని డేస్ గురించి, వారి మధ్య సంబంధాల గురించి డిస్కస్ చేసుకున్నారు.
25వ రోజు మార్నింగ్ అమ్మ రాజశేఖర్, సోహైల్ మధ్య మరోసారి వివాదం జరిగింది. ఛాన్స్ ఇచ్చా.. దొంగిలించినవి ఇవ్వమని చెప్పా, కానీ ఇవ్వలేదు. క్షమించలేను. నీతో మాట్లాడనని సోహైల్కి చెప్పాడు.
కెప్టెన్ పోటీదారులు కుమార్ సాయి, అమ్మ రాజశేఖర్, సుజాత, హారిక మధ్య బురద మట్టిలో ఉన్న కాయిన్స్ వెతికే గేమ్ పెట్టాడు.
బురదలో ఈ నలుగురు బాగా వెతికి గేమ్కి, షోకి కిక్ తీసుకొచ్చాడు. ఈలలు, గోలలు, కేకల మధ్య బురదలో కాయిన్స్ వెతికే గేమ్ ఆద్యంతం ఆకట్టుకుంది.
ఈ ఉత్కంఠభరిత పోటీలో అత్యధికంగా 3500కాయిన్స్ ని సాధించిన కారణంగా కుమార్ సాయి కెప్టెన్గా ఎంపియ్యాడు. అంతేకాదు నాల్గో వారం ఎలిమినేషన్ నుంచి సేఫ్ అయ్యాడు.