అంజన్న సేవలో బలగం డైరెక్టర్ వేణు.. కొండగట్టులో ప్రత్యేక పూజలు, ఫొటోస్ వైరల్
జబర్దస్త్ కమెడియన్ గా కెరీర్ మొదలు పెట్టిన వేణు ఎల్దండి ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తం మాట్లాడుకునే దర్శకుడిగా మారాడు. వేణు డెబ్యూ దర్శకుడిగా తెరకెక్కించిన బలగం చిత్రం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తూ ఘనవిజయం సాధించింది.
జబర్దస్త్ కమెడియన్ గా కెరీర్ మొదలు పెట్టిన వేణు ఎల్దండి ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తం మాట్లాడుకునే దర్శకుడిగా మారాడు. వేణు డెబ్యూ దర్శకుడిగా తెరకెక్కించిన బలగం చిత్రం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తూ ఘనవిజయం సాధించింది. వేణు దర్శకత్వ ప్రతిభకి విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి. ఈ చిత్రంలో నటుడు ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ జంటగా నటించారు.
ప్రస్తుతం వేణు బలగం చిత్ర విజయాన్ని ఆస్వాదిస్తున్నారు. తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో మనసుని హత్తుకునే భావోద్వేగాలతో వేణు ఈ చిత్రాన్ని ఎంతో చక్కగా తెరకెక్కించారు. జబర్దస్త్ లో టీం లీడర్ గా స్కిట్ లు చేస్తూ అలరించిన వేణు.. సినిమాల్లో కూడా కమెడియన్ గా అప్పుడప్పుడూ మెరిశాడు.
ఇదిలా ఉండగా నేడు వేణు కొండగట్టులో ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. బలగం చిత్రం విజయం సాధించిన కారణంగా వేణు అక్కడ కొండగట్టు అంజన్నకి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ మేరకు ఆ దృశ్యాలని వేణు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
కొండగట్టు అంజన్న ఆశీర్వాదంతో బలగం సినిమా మొదలు పెట్టాను..అంజన్న దయతో బలగం మీ అందరిని మెప్పించింది..అంజన్న దర్శనం అద్భుతంగా జరిగింది అని పోస్ట్ చేశారు. వేణు ఆంజనేయస్వామికి పూజలు నిర్వహిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
మార్చి 3న రిలీజైన ఈ చిత్రం అద్భుతమైన మౌత్ టాక్ తో ప్రేక్షకులని అలరించింది. మెగాస్టార్ చిరంజీవి సైతం వేణుని, బలగం చిత్ర యూనిట్ ని అభినందించారు. బలగం చిత్రం అందించిన ఉత్సాహంతో తన రెండవ చిత్రాన్ని మరింత బాధ్యతగా రూపొందింస్తానని వేణు తెలిపారు.
బలగం చిత్రం రీసెంట్ గా ఓటిటిలోకి కూడా విడుదలై దుమ్మురేపుతోంది. ప్రైమ్ వీడియోలో ఈ చిత్రాన్ని తీసుకువచ్చారు. ఇటీవల వేణు వేములవాడని కూడా సందర్శించారు. ఆంజనేయస్వామి దీక్ష చేసినట్లు సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేశారు. చూస్తుంటే వేణుకి ఆంజనేయ స్వామిపై భక్తి ఎక్కువగా ఉన్నట్లు ఉంది.