షాక్:అనుపమ పరమేశ్వరన్ ఇలా అయ్యిపోయిందేంటి?
First Published Sep 17, 2020, 7:38 PM IST
మల్లూ బేబీ అనుపమ పరమేశ్వరన్ అందం, అభినయం కలిగిన నటి. అయితే, తెలుగులో ఏవో కొన్ని సినిమాలలో నటించినప్పటికీ ఆమె కెరీర్ పెద్దగా ఊపందుకోలేదు. స్టార్ హీరోల సినిమాలలో నటించే ఛాన్సులు సరిగా రాలేదు. అప్పుడప్పుడు ఒక్కో సినిమా.. అన్నట్టుగా తెలుగులో ఆమె ప్రస్థానం కొనసాగుతోంది. ఈ క్రమంలో కరోనా వచ్చి ఆమెకు పెద్ద బ్రేక్ ఇచ్చింది. సర్లే ఎలాగో ఇంట్లో ఉంటున్నా కదా..స్లిమ్ అయ్యే పోగ్రాం పెట్టుకుంది. అయితే ఇప్పుడు చాలా మంది ఆమె ఫొటోలు చూసి గుర్తు పట్టలేకపోతున్నారు. ఇదేంటి ఇంతలా మారిపోయిందేంటి అంటున్నారు. ఆ ఫొటోలు మీరు ఇక్కడ చూడవచ్చు.
తెలుగు .. తమిళ .. మలయాళ భాషల్లో కథానాయికగా అనుపమ పరమేశ్వరన్ కి మంచి క్రేజ్ వుంది. ఇక్కడి యంగ్ హీరోల జోడీగా ఆడిపాడే పాత్రలను చేస్తూ ఆమె మంచి ఫాలోయింగ్ తెచ్చుకుంది.
అయితే ఇటీవల కాలంలో తెలుగులో ఆమెకి అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. దాంతో ఆమె తమిళ .. మలయాళ సినిమాలపై ఎక్కువ దృష్టి పెట్టింది.
ఈ నేపథ్యంలోనే తెలుగు నుంచి ఆమెకి ఒక అవకాశం వెళ్లినట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాలో కథ అంతా కూడా ఆమె చుట్టూనే తిరుగుతుందట. ఇది పక్కా లేడీ ఓరియెంటెడ్ మూవీ.
ఇది పక్కా లేడీ ఓరియెంటెడ్ మూవీ. ఈ సినిమా ద్వారా దర్శకుడిగా హనుమాన్ చౌదరి పరిచయం కానున్నాడు. గతంలో ఆయన రవిబాబు దగ్గర దర్శకత్వ శాఖలో 'అవును' సినిమాకి పనిచేశాడు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు.
ఇప్పుడు లేడీ ఓరియంటెడ్ మూవీ అంటే సవాల్ అయినా అనుపమ ఈ స్టెప్లోనూ సక్సెస్ అవుతారని చెప్పొచ్చు. పీవీపీ బేనర్లో ఈ సినిమా రూపొందనుందట.
అందం, అభినయం ఉన్నప్పటికీ కొందరికి సరైన అవకాశాలు రావు. అనుపమ పరమేశ్వరన్ పరిస్థితి కూడా అంతే. 'ప్రేమమ్' సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకి పరిచయమైన ఈ మలయాళ భామ ఈ ఐదేళ్లలోనూ ఐదు సినిమాలు మాత్రమే చేసిందంటే, ఆమెకు ఇక్కడ అవకాశాలు ఏ స్థాయిలో వున్నాయో అర్థం చేసుకోవచ్చు.
'లిస్టులో నేనూ వున్నాను..' అన్నట్టుగా అప్పుడప్పుడు ఒక్కో సినిమాలో మెరుస్తుంటుంది. ఈ క్రమంలో తాజాగా టాలీవుడ్ నుంచి అనుపమకు మరో ఆఫర్ వచ్చినట్టు తెలుస్తోంది.
ఈ క్రమంలో తాజాగా ఆమెకు టాలీవుడ్ నుంచి మరో ఆఫర్ వచ్చింది. యంగ్ హీరో నిఖిల్ సరసన ఆమె నటించనుంది. ప్రస్తుతం నిఖిల్ హీరో గా పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. '18 పేజెస్' పేరుతో రూపొందుతున్న ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు సుకుమార్ కథను అందించారు.
బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ లాక్ డౌన్ కి ముందు లాంఛనంగా మొదలైంది కూడా. ఇక ఈ చిత్రంలోని హీరోయిన్ పాత్ర కోసం పలువుర్ని పరిశీలించిన తర్వాత అనుపమ పరమేశ్వరన్ ని ఎంచుకున్నట్టు తెలుస్తోంది. 9ప్రస్తుతం ఈ విషయంలో ఆమెతో సంప్రదింపులు జరుగుతున్నాయి. ప్రస్తుత పరిస్థితులు చక్కబడిన వెంటనే ఈ చిత్రం షూటింగును నిర్వహిస్తారు.
అనుపమ ఇప్పుడు తరచూ సోషల్ మీడియాలో కనిపించడానికి తాపత్రయ పడుతోంది. అలా ఒక లైవ్ లో మాట్లాడుతూ సంప్రదాయ, అలవాట్లు, ఆచార వ్యవహారాల గురించి పెద్ద లెక్చరే ఇచ్చింది.
ఈ తరం, భావితరం కంటే నాటి తరం సంప్రదాయమే మేలని ఒక ఉచిత సలహాను కూడా ఇచ్చేసింది. ఇంతకీ అనుపమ పరమేశ్వరన్ ఏం చేప్పిందంటే.. ఈ తరం యువత జీవన సరళి విభిన్నంగా ఉంది. ఫ్యాషన్ ప్రపంచంలో జీవిస్తున్నాం అంది.
పాత తరం జీవన విధానం గురించి అస్సలు అలోచించడానికే సమయం సరిపోవడం లేదు. మన ముందు తరాల ఆచార వ్యవహారాలను ఆచరించడానికి ఇష్ట పడడం లేదు.
నేను ఆ రకం కాదు. పాత సంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను నమ్ముతాను. పెద్దల మాటలకు గౌరవం ఇస్తాను. ప్రజలు ఇలానే జీవించాలని పెద్దలు కొన్ని పద్ధతులను నియమించారు.
ఒక్కో పద్ధతి వెనుక ఒక కారణం ఉంటుంది. దాన్ని నాగరీకం పేరుతో ఈ తరం విస్మరించడం సరైన విధానం కాదు. నవతరం ఆధునిక పోకడలతో సంప్రదాయబద్ధమైన విషయాలను పక్కన పెట్టడం కరెక్ట్ కాదు. నేను నటి అయిన తరువాత కూడా వ్యక్తిగత జీవితంలో ఎలాంటి మార్పు రాలేదు.
సినిమారంగంలోకి రాక ముందు ఎలా ఉండేదాన్నో, ఇప్పుడూ ఇంట్లో అలానే ఉంటున్నాను. నేను రాహు కాలం, అష్టమి, నవమి, మంచి గడియలు వంటి వాటిని నమ్ముతాను.
వాటి గురించి పెద్దలు ఊరికే చెప్పలేదు. వాటిని ఆచరిస్తే సంప్రదాయబద్ధమైన జీవినాన్ని సాగించవచ్చు. నమ్మకాలతోనే జీవితం సాగుతోంది అని అనుపమ పరమేశ్వరన్ చెప్పుకొచ్చింది.
నా యాక్షన్ టాలెంట్ - నా లుక్స్ నచ్చి తెలుగు అభిమానులు నన్ను ఆదరించారు. వారి అభిమానాన్ని మరింతగా పెంచుకోవడానికే నాకొచ్చే కథల పట్ల సెలెక్టీవ్ గా ఉంటున్నా.
నిజంగా నేను నాకు తెలియకుండానే టిపికల్ క్యారెక్టర్స్ చేస్తున్నాను. ఏం చేస్తాం చెప్పండి అన్ని అవే వస్తున్నాయి. అలా వచ్చిన రోల్స్ అన్ని నాకు నచ్చేస్తున్నాయి. నిన్నుకోరి తమిళ రీమేక్ తరువాత మళ్లీ ప్రేమమ్ లో చేసినట్లుగా ఓ బబ్లీ క్యారెక్టర్ చేయలనిపిస్తోంది.
సెట్స్ లోకి వచ్చాక కూడా మెచ్చ్యూర్డ్ క్యారెక్టర్ లో నేను ఎలా నటిస్తున్నాను అని ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుంటూ ఉంటాను.
తెలుగులో ఇప్పుడు ఎక్కువ సినిమాలు చేస్తున్నా కాబట్టి టాలీవుడ్ కే నేను ఎక్కువ టైమ్ కేటాయించాలి. ఇక్కడ భాష వల్ల కూడా నాకు పెద్దగా ఇబ్బందేమి లేదు.
మళయాలం నా మాతృభాష కాబట్టి అక్కడ ఇంకా పేరు తెచ్చుకోవాలనే ఆశ ఉంది. తమిళంలో ఇప్పుడిప్పుడే అడుగుపెడుతున్నా - ఇంకా అక్కడ పరిస్థితుల్ని ఎనలైజ్ చేసే పరిస్థితిలో నేను లేను. సూటిగా చెప్పాలంటే తెలుగు ఇండస్ట్రీలోనే నటించడానికి నేను ఎక్కువ కంఫర్ట్ గా ఫీల్ అవుతాను..
ఈ కారణంగానే కాస్త నెమ్మదిగా సినిమాలు చేస్తున్నాను. దీని వల్ల ఆడియెన్స్ కి కాస్త దూరం అవుతున్నాననే అనిపిస్తోంది. కానీ మనసుకు నచ్చని క్యారెక్టర్స్ లో యాక్ట్ చేసి ఇబ్బంది పడలేను కదా.. నిజానికి ఫ్రొఫెషనల్ గా నేను చాలా హ్యాపీగా ఉన్నా.
హీరో నిఖిల్కు బ్రేక్ ఇచ్చిన చిత్రాల్లో ‘కార్తికేయ’ ఒకటి. చందు మొండేటి దర్శకుడిగా పరిచయమైన చిత్రమిది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్గా ‘కార్తికేయ 2’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ను హీరోయిన్గా తీసుకున్నారు.
అయితే అనుపమ పరమేశ్వరన్ ఈ సినిమా నుండి తప్పుకుందట. తన పాత్రకు అంత ప్రాధాన్యత లేకపోవడంతో అనుపమ ప్రాజెక్ట్ నుండి వెళ్లిపోయిందని వార్తలు వినపడుతున్నాయి. దర్శక నిర్మాతలిప్పుడు మరో హీరోయిన్ను వెతికే పనిలో బిజీగా ఉన్నారట.
‘అఆ’, ‘ప్రేమమ్’ చిత్రాల్లో కీలక పాత్రలు చేసి, ‘శతమానం భవతి’, ‘ఉన్నది ఒకటే జిందగీ’, ‘హలో గురూ ప్రేమ కోసమే’ వంటి హిట్ చిత్రాల్లో హీరోయిన్ గా నటించారు ఈ మలయాళ కుట్టి. గత ఏడాది హిట్ మూవీ ‘రాక్షసుడు’లో కనిపించిన అనుపమ ప్రస్తుతం ఓ మలయాళ సినిమా, ఓ తమిళ చిత్రం చేస్తున్నారు.