ఒకప్పటి అనసూయ కష్టాలు తెలిస్తే కన్నీళ్లు ఆగవు..!
హాట్ యాంకర్ అనసూయ కెరీర్ లో దూసుకుపోతుంది. అటు యాంకర్ గా ఇటు నటిగా ఆమె కెరీర్ ఫుల్ పీక్స్ లో ఉంది. ఐతే సక్సెస్ తో లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్న అనసూయ జీవితంలో ఓ కష్టాల ఎపిసోడ్ కూడా ఉందట. ఓ టాక్ షోలో ఇవన్నీ చెప్పుకొని అనసూయ కన్నీరు పెట్టుకున్నారు.
కామెడీ షో జబర్దస్త్ తెలియనివారంటూ ఎవరూ ఉండరు. తెలుగు ప్రేక్షకుల వినోద సాధనాలలో జబర్దస్త్ ఒకటిగా ఉంది. నాన్ స్టాప్ గా కామెడీ పంచే ఈ షోలో యాంకర్స్ అందాల విందు కూడా మరో ఆకర్షణ. జబర్దస్త్ యాంకర్స్ గా ఉన్న రష్మీ మరియు అనసూయలకు భారీ క్రేజ్ ఉంది. ఆ క్రేజ్ తో ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు హీరోయిన్స్ గా కూడా చేయడం జరిగింది.
జబర్దస్త్ అరంగేట్రం నుండి ఉంది యాంకర్ అనసూయ. టాప్ యాంకర్స్ లో ఒకరిగా ఉన్న ఈమె అనేక టాక్ షోలకు వ్యాఖ్యాతగా ఉన్నారు. లోకల్ గ్యాంగ్స్, తల్లా పెళ్ళామా, రంగస్థలం, ప్రతిరోజూ పండగే వంటి అనేక షోలలో వ్యాఖ్యాతగా మరియు జడ్జిగా ఉన్నారు. ఇప్పుడు ఆమె కెరీర్ జెట్ స్పీడ్ లో పోతుంది.
మరో వైపు సినిమాలలో క్రేజీ ఆఫర్స్ దక్కించుకుంటున్నారు. 2018లో వచ్చిన రంగస్థలం మూవీలో ఆమె చేసిన రంగమత్త పాత్రకు మంచి పేరు వచ్చింది. గత ఏడాది విడుదలైన కథనం మూవీలో హీరోయిన్ గా చేశారు. ప్రస్తుతం దర్శకుడు కృష్ణ వంశీ తెరకెక్కిస్తున్న రంగమార్తాండ మూవీలో ఓ కీలక రోల్ చేస్తున్నారు.
ప్రస్తుతం అనసూయ జీవితం ఫుల్ హ్యాపీ. చేతినిండా షోలు, లక్షల సంపాదన, మంచి ఇల్లు, భర్త పిల్లలు. ఐతే కొన్నేళ్ల క్రితం అనసూయ జీవితంలో చాలా కస్టాలు అనుభవించారట. ఆమె తల్లి వీరిని చదివించడం కోసం అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారట. కనీసం ఇంటి రెంటు కూడా కట్టలేని పరిస్థితి ఉండేదట. అర్థ రూపాయి మిగులుతుందని అనసూయ కాలినడకన రెండు బస్ స్టాప్స్ వరకు నడిచి వెళ్ళేదట.
కమెడియన్ అలీ టాక్ షోలో పాల్గొన్న అనసూయ ఈ విషయాలన్నీ చెప్పి కన్నీటి పర్యంతం అయ్యింది. ఈటీవి విడుదల చేసిన ప్రోమోలో ఈ విషయాలన్నీ ఉన్నాయి. కొద్దిరోజులలో అలీ తో సరదాగా టాక్ షోలో ఈ విషయాలపై పూర్తి అవగాహన రానుంది. అనేక ఆసక్తికర విషయాలతో సాగిన ఈ ప్రోమో షోపై ఆసక్తిరేపింది.