స్టార్స్ అంతా షురూ చేశారు.. బన్నీ మాత్రం వెయిటింగ్లో పెట్టాడు?
అల్లు అర్జున్ నటించిన `అలావైకుంఠపురములో` చిత్రంలోని సాంగ్స్ రికార్డులు సృష్టిస్తున్నాయి. మరోవైపు కొత్త సినిమా విషయంలో బన్నీ ఇంకా వెయిటింగ్లోనే పెట్టాడు. మరి ఆ కథేంటీ?
అల్లు అర్జున్ ఈ ఏడాది సంక్రాంతిలో `అలా వైకుంఠపురములో`తో ఇండస్ట్రీ రికార్డ్ లను బద్దలు కొట్టారు. `బాహుబలి` తర్వాత అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా ఇది నిలిచింది. ఈ ఊపులోనే క్రేజీ సినిమాలు చేస్తున్నాడు బన్నీ.
ఇందులోని పాటలు రికార్డులను సృష్టిస్తున్నాయి. ఇప్పటికే ఆల్బమ్ రెండు వందల మిలియన్స్ దాటింది. ఇక తాజాగా ఇందులోని `బుట్టబొమ్మ` వీడియో సాంగ్ ఏకంగా నాలుగువందల మిలియన్స్ కి చేరింది. అంటే నలభై కోట్ల మంది ఈ పాటని వీక్షించారు.
ప్రస్తుతం ఆయన సుకుమార్ దర్శకత్వంలో `పుష్ప` చిత్రంలో నటిస్తున్నారు. `ఆర్య`, `ఆర్య 2` తర్వాత ముచ్చటగా మూడోసారి వీరి కాంబినేషన్లో వస్తున్న చిత్రమిది. ఇందులో రష్మిక మందన్నా కథానాయికగా నటిస్తుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా కరోనా వల్ల షూటింగ్ నిలిచిపోయిన విషయం తెలిసిందే. ఇప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు షూటింగ్లకు అనుమతులు ఇచ్చినా `పుష్ప`ని మాత్రం ముందుకు తీసుకెళ్లడం లేదు చిత్ర బృందం.
అందుకు కారణంగా బన్నీనే అని తెలుస్తుంది. డిసెంబర్ వరకు షూటింగ్ మొదలు పెట్టవద్దని తేల్చి చెప్పినట్టు సమాచారం. అయితే ఇటీవల స్టార్ హీరోల సినిమాలన్నీ ప్రారంభమవుతున్నాయి. నాగార్జున షురూ చేశారు. నాగచైతన్య, అఖిల్, నితిన్, ఎన్టీఆర్, రామ్చరణ్, శర్వానంద్, తాజాగా రవితేజ సైతం షూటింగ్ మొదలు పెట్టారు. కానీ బన్నీ మాత్రం ఇంకా వెయిటింగ్లోనే ఉండటం పట్ల విమర్శలు వస్తున్నాయి.
దీంతో కాస్త కనికరించినట్టు తెలుస్తుంది. డిసెంబర్లో కాకుండా నెల రోజుల ముందు, అంటే నవంబర్లోనే షూటింగ్లో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నారట. కేరళలోని అడవుల్లో షూటింగ్ చేసేందుకు ప్లాన్ చేసినట్టు సమాచారం. ఇక మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రం ఎర్రచందన స్మగ్లింగ్ బ్యాక్డ్రాప్లో సాగనుంది. ఇందులో బన్నీ, రష్మిక మందన్నా చిత్తూరు యాసలో మాట్లాడుతారని సమాచారం.