లీక్: బన్ని ‘అల వైకుంఠపురములో’కథ ఇదే
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కలయికలో రూపొందుతోన్న ప్రతిష్టాత్మక చిత్రం ‘అల వైకుంఠపురములో’. ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.రీసెంట్ గా ఈ సినిమా టీమ్ వదిలిన ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. 2020 సంక్రాంతికి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ఈ నేపధ్యంలో ఈ చిత్రం కథ ఏమై ఉండవచ్చు అనేది చర్చనీయాంశంగా మారింది.
కారు డ్రైవర్..కోటీ శ్వరుడు: మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు... జయరాం, మురళి శర్మ లలో ఒకరిది కోటిశ్వరుడు కుటుంబం, మరొకటి లో మిడిల్ క్లాస్ కుటుంబం. వాళ్లిద్దరికి సోషల్ స్టేటస్ లో కానీ, ఎకనామిక్ స్టేటస్ లో కానీ పోలిక ఉండదు. జయరామ్ ,టబులకు అల్లు అర్జున్ పుడతాడు. పుట్టుకతోనే కోటిశ్వరుడు. మరో ప్రక్క వాళ్ల కారు డ్రైవర్ మురళి శర్మ కు సుశాంత్ పుడతాడు. వీళ్లిద్దరి పుట్టుక ఒకే సారి జరుగుతుంది. జయరాం, మురళి శర్మ ఇద్దరూ స్నేహితుల్లా మెలుగుతారు. ఈ క్రమంలో వాళ్ల పిల్లల భవిష్యత్ గురించి ఓ డిస్కషన్ వస్తుంది.
పిల్లల ఎక్సైంజ్: కారు డ్రైవర్ కొడుకు మళ్లీ కారు డ్రైవరే అవుతాడు..కోటిశ్వరుడు కొడుకు మరో కోటీశ్వరుడే అవతాడని మురళి శర్మ అంటాడు. దానికి జయరాం..అలాంటిదేం లేదు ..వాళ్ల పుట్టక కన్నా వాళ్లులో ఉండే కష్టపడే తత్వం..ఎదగాలనే కోరిక వారిని నెక్ట్స్ లెవిల్ కు తీసుకువెళ్తాయి లేదా క్రిందకు పడేస్తాయి అంటాడు. ఈ మాటల యుద్దం పెరిగి పెద్దదై ఇద్దరూ తమ బిడ్డలను ఎక్సేంజ్ చేసుకుంటారు. అయితే ఈ విషయం వాళ్ల భార్యలకు కాదు కదా మూడో కంటికి తెలియనివ్వకూడదని ఎగ్రిమెంట్ చేసుకుంటారు. పెరిగి పెద్దయ్యాక.. ఎవరు ఏమౌతారో చూద్దామని జయరాం అంటారు.
ట్విస్ట్ ఇదీ.. అలా జయరాం కొడుకు కారు డ్రైవర్ గా మురళి శర్మ దగ్గర పెరుగుతాడు. కారు డ్రైవర్ కొడుకు సుశాంత్ కోటీశ్వరుడుగా జయరాం దగ్గర పెరుగుతాడు. ఇలా వీళ్లిద్దరు పెరిగి పెద్దై చివరకు తామెవరమో ఎలా తెలుసుకుంటారు. అయితే సుశాంత్ మాత్రం తిరిగి తన ప్లేస్ లోకి వెళ్లటానికి ఒప్పుకోకపోవటంతో కథలో అసలైన ట్విస్ట్ పడుతుంది. మళ్లీ కారు డ్రైవర్ కొడుకుగా తన జీవితం మొదలెట్టనంటాడు. ఇదంతా అల వైకుంఠపురం అనే జయరాం ఇంట్లో కథ జరుగుతుంది. ఈ కథ మధ్యలో విలన్ అయిన నవదీప్ ఎంట్రీ ఇస్తాడు. అతని పాత్ర ఏమిటి..వంటి విషయాలు చుట్టూ కథ జరుగుతుంది. ఇది పూర్తిగా ఫ్యామిలీ డ్రామా.
జెమినీ టీవికే .. ఇక ఈ సినిమాకు వచ్చిన క్రేజ్ తో శాటిలైట్ రైట్స్ ను జెమిని టీవీ వారు భారీ మొత్తానికి కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్ ఎనర్జీ, కామెడీ టైమింగ్ కి, త్రివిక్రమ్ మాటలు కలిస్తే ఎలా ఉంటుందో స్పెషల్ గా చెప్పక్కర్లేదు. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి చిత్రాలే ఇందుకు ఉదాహరణ. ఇక ఇప్పుడు ముచ్చటగా మూడోసారి పర్ ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ని వీరిద్దరూ రాబోతున్నారు.