ఐశ్వర్య కూతురికి ఆ హీరో అంటే పిచ్చి!
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్ తన వ్యక్తిగత జీవితం గురించి పెద్దగా మీడియాతో మాట్లాడటానికి ఇష్టపడుదు. కానీ ఓ ఇంటర్వ్యూలో తన కూతురు ఆరాధ్య గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించింది ఐశ్వర్య.
బాలీవుడ్లో మోస్ట్ హ్యాండ్సమ్ హీరో ఎవరు అంటే టక్కున గుర్తొచ్చే పేరు రణబీర్ కపూర్. తొలి సినిమా నుంచే చాక్లెట్ భాయ్ ఇమేజ్తో దూసుకుపోతున్నాడు రణబీర్. అందుకే అందాల భామలు రణబీర్తో నటించే ఛాన్స్ కోసం క్యూ కడుతుంటారు.
ప్రస్తుతం రణబీర్తో డేటింగ్లో ఉన్నఅలియా గతంలో తనకు రణబీర్ అంటే పిచ్చని చెప్పింది. ఇప్పుడు అదే హీరోతో పీకల్లోతూ ప్రేమలో ఉంది అలియా భట్. అలియాతో పాటు మరో స్టార్ వారసురాలు ఆరాద్యకు కూడా రణబీర్ అంటే ఇష్టమట.
ఫిలింఫేర్తో మాట్లాడుతూ ఆరాధ్య గురించి ఆసక్తికర విషయాన్ని చెప్పింది ఐశ్వర్య. ఓ సందర్భంలో ఆరాధ్య రణబీర్ను అభిషేక్ అనుకొని కౌగిలించుకుందట.
రణబీర్ షూటింగ్ సమయంలో కూడా తనతో ఎంతో సన్నిహితంగా ఉండేవాడని చెప్పింది ఐశ్వర్య. అక్షయ్ ఖన్నా కూడా మంచి మిత్రుడే అయిన రణబీర్ల తను జోవియల్గా ఉండేవాడు కాదని చెప్పింది. షూటింగ్ సమయంలో నేను, ఆరాధ్యతో వీడియో కాల్ మాట్లాడుతూ రణబీర్కు ఇచ్చాను. ఆరాధ్యకు అతను బాగా తెలుసు అందుకే అతడ్ని చూసి స్మైల్ ఇచ్చింది ఆరాధ్య.
ఓ రోజు రణబీర్ అచ్చు అభిషేక్ లాగే డ్రస్ అయ్యాడు. దీంతో తాను అభి అనుకున్న ఆరాధ్య డాడీ అంటూ పరిగెత్తింది అని తెలిపింది ఐశ్వర్య.
అప్పుడు నేను ఆరాధ్యను నాన్న అనుకొని రణబీర్ను పట్టుకున్నావా అని అడిగాను. అందుకు ఆరాధ్య అవునని సమాధానం చెప్పింది. ఈ విషయంలో అభిషేక్ కూడా రణబీర్ను ఆటపట్టించేవాడు అని వెల్లడించింది ఐశ్వర్య.
అంతేకాదు ఆరాధ్య రణబీర్ను అంకుల్ అని పిలిచేందుకు కూడా నిరాకరించేదట. రణబీర్ను RK అని పిలుస్తానని ఆరాధ్య చెప్పిందని తెలిపింది ఐశ్వర్య.