వాడు నన్ను మోసంచేసి ముఖ్యమంత్రి అయ్యాడు... మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు
మోహన్ బాబు అంటేనే సంచలనాలకు కేర్ ఆఫ్ అడ్రెస్స్. మోహన్ బాబు మైకు ముందుకు వచ్చి ఏది మాట్లాడినా సంచలమే అవుతుంది. ఏ విషయాన్నైనా కుండబద్దలు కొట్టి మాట్లాడే మోహన్ బాబు తాజా ఇంటర్వ్యూలో కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు.
పరిశ్రమలో మోహన్ బాబుపై ముక్కోపి అనే పేరుంది. ఈ సీనియర్ హీరో సెట్స్ లో హీరోయిన్స్ పై చేయిచేసుకున్నారనే అపవాదు కూడా ఉంది. ముక్కుసూటిగా మాట్లాడే మోహన్ బాబు వ్యాఖ్యలు అనేకమార్లు వివాదాలకు దారితీశాయి. పబ్లిక్ వేదికలపై కూడా మోహన్ బాబు మనసులోది ఉన్నది ఉన్నట్లు కుండబద్దలు కొడతాడు. వినాయక చవితి సంధర్భంగా మోహన్ బాబు ఓ ఇంటర్వ్యూలో పాల్గొనడం జరిగింది. ఆ ఇంటర్వ్యూలో ఆయన అనేక విషయాలపై స్పందించారు.
ఆయన రాజకీయ నాయకులపై చేసిన కొన్ని వ్యాఖ్యలు సంచలంగా మారాయి. మోహన్ బాబు మాట్లాడుతూ...నేను రాజకీయాలలో ఉన్నప్పుడు ఒకడు మోసం చేసి ముఖ్యమంత్రి అయ్యాడు. ఇప్పుడు నేను వాడి పేరు చెప్పాలని అనుకోవడం లేదు అన్నారు. పరోక్షంగా మోహన్ బాబు మాజీ సీఎం చంద్రబాబుని ఉద్దేశించి అన్నారని అందరూ అనుకుంటున్నారు.
ఇక ఏపి సీఎం జగన్ పాలన బాగుంది అన్న ఆయన, తన మద్దతు వైసీపీ పార్టీకి ఉంటుంది అన్నారు. తన విద్యాసంస్థకు రావలసిన బకాయిల విషయంలో జగన్ స్పందించడంతో పాటు, త్వరలోనే నిధులు విడుదల చేస్తాం అని హామీ ఇచ్చారు అన్నారు.
సినిమా హీరోలు రాజకీయాలలో సక్సెస్ కావడం కష్టమే అని ఆయన తేల్చివేశారు. వాళ్ళ జాతకంలో సీఎం అవ్వాలని రాసిపెట్టి ఉంటే ఏమైనా అవుతారేమో కానీ, ఇప్పటి ట్రెండ్ కి స్టార్స్ రాజకీయాలలో రాణించడం కష్టమే అని ఆయన చెప్పారు.
తాజాగా మోహన్ బాబు సన్ ఆఫ్ ఇండియా అనే ఓ నూతన చిత్రాన్ని ప్రకటించడం జరిగింది. అలాగే హీరో సూర్య నటిస్తున్న సురారై పోట్రు మూవీలో ఆయన ఓ కీలక పాత్ర చేయడం జరిగింది. ఆకాశం నీహద్దరా అనే టైటిల్ తో తెలుగులో వస్తుండగా ప్రైమ్ లో అక్టోబర్ 30న విడుదల కానుంది.