భారత్ని మళ్లీ చూస్తానో లేదో భయంగా ఉంది.. హీరోయిన్ శ్రియ ఆందోళన
First Published Apr 14, 2020, 3:44 PM IST
ప్రస్తుతం స్పెయిన్లో ఉన్న శ్రియ తన భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేస్తోంది. స్పెయిన్ లో ఇంత ప్రభావం లేని సమయంలోనే శ్రియ భర్త ఆండ్రీ కొశ్చీవ్కు కరోనా లక్షణాలు కనిపించాయి. అయితే పరిస్థితి ఆందోళన కరంగా లేకపోవటంతో కేవలం హోం క్వారెంటైన్లో ఉండాలని సూచించి వారిని ఇంటికి పంపేశారు డాక్టర్లు. తరువాత ఆండ్రీ ఆరోగ్య కుదుట పడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ప్రస్తుతం కరోనా విజృభిస్తున్న దేశాల్లో స్పెయిన్ కూడా ఉంది. అయితే ఒకప్పటి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రియ కూడా ప్రస్తుతం అక్కడే బార్సిలోనాలో ఉంటుంది. ప్రస్తుతం స్పెయిన్లో లక్షా 70 లకు పైగా పాజిటివ్ కేసులు ఉన్నాయి. దాదాపు 17 వేల మందికి పైగా మరణించారు.
కరోనా కారణంగా అత్యంత దారుణంగా ఎఫెక్ట్ అయిన దేశాల్లో స్పెయిన్ రెండో స్థానంలో ఉందంటేనే అక్కడ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం అక్కడే ఉన్న శ్రియ తన భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేస్తోంది.
అయితే స్పెయిన్ లో ఇంత ప్రభావం లేని సమయంలోనే శ్రియ భర్త ఆండ్రీ కొశ్చీవ్కు కరోనా లక్షణాలు కనిపించాయి. అయితే పరిస్థితి ఆందోళన కరంగా లేకపోవటంతో కేవలం హోం క్వారెంటైన్లో ఉండాలని సూచించి వారిని ఇంటికి పంపేశారు డాక్టర్లు.
తరువాత ఆండ్రీ ఆరోగ్య కుదుట పడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. తాజాగా ఆమె తన అనుభవాలను మీడియాతో పంచుకుంది. ప్రస్తుతం తన భర్త, తాను వేరు వేరు గదుల్లో ఉంటున్నామని తెలిపింది శ్రియ.
`నెల రోజులుగా లాక్ డౌన్లో ఉన్నాను. ప్రస్తుతం ఇక్కడ పరిస్థితులు తలచుకుంటేనే భయమేస్తోంది. కొద్ది రోజుల్లోనే జీవితాలు పూర్తిగా మారిపోయాయి. మార్చి 13 నా పెళ్లి రోజు సెలబ్రేట్ చేసుకోవడానికి రెస్టారెంట్కు వెళ్లాం. కానీ సడన్గా రెస్పారెంట్ మూసేశారు. దీంతో పరిస్థితి చేయిదాటుతుందని అర్ధమైంది.
అప్పుడే ఇంటి నుంచి ఒక్కరు మాత్రమే బయటకు రావాలని నిబంధనలు విధించారు. మేం ఇంటి వెళుతుండగా పోలీసులు ఆపారు. కానీ మా ఇద్దరి రంగులు వేరు కావటంతో వేరు వేరు వ్యక్తులం అనుకొని వదిలేశారు. మా పేరెంట్స్ ముంబైలో ఉన్నారు. తిరిగి వారిని చూస్తానో లేదో అని భయమేస్తోంది` అంటూ ఆవేదన వ్యక్తం చేసింది శ్రియ.
ఒకప్పుడు స్టార్ హీరోల సరసన వరుస సినిమాలు చేసిన శ్రీయ తరువాత కొత్త తరం హీరోయిన్ల రాకతో కాస్త స్లో అయ్యింది. కేవలం సీనియర్ హీరోల సరసన మాత్రమే నటిస్తున్న ఈ బ్యూటీ 2018లో సీక్రెట్గా మ్యారేజ్ చేసుకుంది.
రష్యాకు చెందిన వ్యాపార వేత్త ఆండ్రూ తో సుదీర్ఘ కాలం ప్రేమ తరువాత ఉదయ్పూర్లో అత్యంత సన్నిహితులు కుటుంబ సభ్యుల మధ్య ఈ పెళ్లి జరిగింది.