క్వారెంటైన్ కష్టాలు... బోరున ఏడ్చేసిన పాయల్ రాజ్పుత్
ఒక్క సినిమాతోనే సెన్సేషన్ సృష్టించిన టాలీవుడ్ హాట్ బ్యూటీ పాయల్ రాజ్పుత్. తొలి సినిమా ఆర్ ఎక్స్ 100లోనే బోల్డ్ యాక్టింగ్తో ఆకట్టుకున్న ఈ బ్యూటీ తరువాత ఆశించిన స్థాయిలో అవకాశాలు అందుకోలేకపోయింది.
తొలి సినిమాతోనే బోల్డ్ యాక్ట్రస్ అన్న ముద్రపడిపోవటంతో తరువాత ఎక్కువగా అలాంటి క్యారెక్టర్సే వచ్చాయి. దీంతో ఆ ముద్ర చెరిపేసుకునేందుకు చాలా కష్టపడింది పాయల్ రాజ్.
కానీ అది కుదరకపోగా అవకాశాలు తగ్గిపోయాయి. దీంతో తప్పనిసరి పరిస్థితి తిరిగి బోల్డ్ క్యారెక్టర్స్ కు ఓకే చెప్పింది.
ఈ మధ్యే ఈ ముద్దుగుమ్మ కెరీర్ కాస్త గాడిలో పడుతుంది. ఆర్డీఎక్స్ లవ్ సినిమా తరువాత స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు సాధించింది.
వెంకీ మామ సినిమాలో సీనియర్ హీరో వెంకటేష్కు జోడిగా నటించిన ఈ బ్యూటీ తరువాత డిస్కోరాజా సినిమాలో రవితేజ సినిమాలో నటించింది.
ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తోంది ఈ భామ. ఏంజెల్ పేరుతో తెరకెక్కుతున్న లేడీ ఓరియంటెడ్ సినిమాతో పాటు నరేంద్ర అనే కమర్షియల్ సినిమాలోనూ నటిస్తోంది.
అయితే ప్రస్తుతం కరోనా లాక్ డౌన్ కారణంగా షూటింగ్ లు ఆగిపోయాయి. దీంతో తారలంతా ఇళ్లకే పరిమితమయ్యారు.
ముంబై నివాసం ఉంటున్నవారి కష్టాలు అంతా ఇంతా కాదు. మహారాష్ట్రలో రోజు రోజుకు పరిస్థితి చేయిదాటుతుండటంతో ప్రజలు గడప దాటడానికి కూడా ఇష్టపడటం లేదు.
దీంతో సెలబ్రిటీల ఇళ్లకు పని మనుషులు రావటంలో లేదు. దీంతో ఎండ కన్నెరగని సుందరాంగులు కూడా ఇంటి పనుల్లో నిమగ్నమయ్యారు. ఈ విషయాన్నే హాట్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ అభిమానులతో షేర్ చేసుకుంది.
తన పని మనిషి రాకపోవటంతో ఇంటలో బండలు తూడుస్తున్న ఫోటోను తన ఇన్స్టాగ్రామ్ స్టోరిలో షేర్ చేసిన పాయల్, మా పని మనిషిని చాలా మిస్ అవుతున్నా అంటూ కామెంట్ చేసింది.