కేవలం ఆ కారణం వల్లే 2011 వన్డే వరల్డ్కప్లో రోహిత్ శర్మకు చోటు ఇవ్వలేదు... మాజీ సెలక్టర్...
టీమిండియా ఫ్యాన్స్ను వెంటాడే ప్రశ్నల్లో ఒకటి... 2011 వన్డే వరల్డ్కప్ గెలిచిన జట్టులో రోహిత్ శర్మ ఎందుకు లేడు? టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కంటే జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన రోహిత్ శర్మ, 2007 టీ20 వరల్డ్కప్ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్నాడు...
2007 టీ20 వరల్డ్కప్ ఫైనల్లో పాకిస్తాన్పై 16 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్తో 30 పరుగులు చేసిన రోహిత్ శర్మ, జట్టు విజయంలో తనవంతు పాత్ర పోషించాడు. అయితే ఆ తర్వాత నాలుగేళ్లకి జరిగిన 2011 వన్డే వరల్డ్కప్లో మాత్రం రోహిత్ శర్మకు చోటు దక్కలేదు.
1983 తర్వాత 28 ఏళ్లకు వరల్డ్ కప్ గెలవాలనే భారత క్రికెట్ ఫ్యాన్స్ ఆశను నెరవేర్చింది మహేంద్ర సింగ్ ధోనీ కెప్టన్సీలోని టీమిండియా. సచిన్, సెహ్వాగ్, గంభీర్, యువరాజ్, ధోనీలతో పాటు విరాట్ కోహ్లీ కూడా ఈ వరల్డ్కప్లో పాల్గొన్నాడు...
అయితే అప్పటికే టీమిండియాలో చోటు దక్కించుకున్న రోహిత్ శర్మకు 2011 వన్డే వరల్డ్కప్లో ఎందుకు చోటు ఇవ్వలేదనే ప్రశ్నకు తాజాగా సమాధానం ఇచ్చాడు ఆనాటి బీసీసీఐ సెలక్షన్ కమిటీలో సభ్యుడైన క్రిష్ణమాచారి శ్రీకాంత్...
‘వన్డే వరల్డ్కప్ 2011 కోసం మేం 15 మందితో కూడిన జట్టును ఎంపిక చేశాం. సీనియర్లతో పాటు జూనియర్లతో నిండి సమతూకంతో ఉండేలా జట్టు కూర్పు ఉండాలని భావించాం... అయితే రోహిత్ శర్మ అప్పటికి బ్యాట్స్మెన్గా పెద్దగా నిరూపించుకోలేదు.
14 మంది ప్లేయర్లను వారి పర్ఫామెన్స్, అనుభవం కారణంగా తీయలేని,పెట్టలేని పరిస్థితి. ఇక మిగిలిన ఒక్క స్పాట్. 15వ ప్లేయర్గా రోహిత్ శర్మ, పియూష్ చావ్లా మధ్య పోటీ నడిచింది...
మేం (సెలక్టర్లు) రోహిత్ శర్మ కావాలని అన్నాం, అయితే జట్టు మేనేజ్మెంట్ మాత్రం పియూష్ చావ్లాకే ఓటు వేసింది. అప్పటికే మంచి అనుభవం ఉన్న స్పిన్నర్ మాత్రమే కాకుండా చావ్లా కీలక సమయాల్లో బ్యాటింగ్లోనూ రాణించగలడు.
రోహిత్ శర్మలో చాలా టాలెంట్ ఉంది. అతనో క్లాస్ ప్లేయర్. అయితే అప్పటిదాకా టీమిండియా తరుపున అతను నమోదుచేసిన రికార్డులు మిగిలిన ప్లేయర్లతో పోలిస్తే, మెరుగ్గా లేవు. దీంతో మేం రోహిత్ శర్మ కావాలని గట్టిగా డిమాండ్ చేయలేకపోయాం...
టీమ్ మేనేజ్మెంట్ కోరినట్టుగా పియూష్ చావ్లానే ఆడించాం... 2011 వన్డే వరల్డ్కప్ మిస్ అయిన తర్వాతే రోహిత్ శర్మలోని అసలైన బ్యాట్స్మెన్ బయటికి వచ్చాడు’ అంటూ చెప్పుకొచ్చాడు కృష్ణమాచారి శ్రీకాంత్...
2011 వన్డే వరల్డ్కప్ తుది 15 మంది జట్టులో ఎంపిక కానందుకు తెగ ఫీలైన రోహిత్ శర్మ , 2019 వన్డే వరల్డ్కప్లో వరుసగా ఐదు సెంచరీలు చేసి సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు..
227 వన్డేల్లో 29 సెంచరీలు చేసిన రోహిత్ శర్మ, 9205 పరుగులు సాధించాడు. ఇందులో రికార్డు స్థాయిలో మూడు డబుల్ సెంచరీలు ఉన్నాయి. 111 టీ20ల్లో నాలుగు సెంచరీలతో 2864 పరుగులు చేశాడు రోహిత్ శర్మ..
రోహిత్ శర్మ స్థానంలో 2011 వన్డే వరల్డ్కప్ జట్టులో 15వ సభ్యుడిగా చోటు దక్కించుకున్న పియూష్ చావ్లా, ఆ టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోవడం విశేషం... 25 వన్డేలాడి 32 వికెట్లు తీసిన చావ్లా, 2011 వన్డే వరల్డ్కప్కి ముందే టీమిండియా తరుపున తన చివర వన్డే ఆడాడు.