MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • కోహ్లీ ఫేక్ ఫీల్డింగ్‌పై ఫిర్యాదు చేయనున్న బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు..

కోహ్లీ ఫేక్ ఫీల్డింగ్‌పై ఫిర్యాదు చేయనున్న బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు..

T20 World Cup 2022: భారత్-బంగ్లాదేశ్ మధ్య రెండ్రోజుల క్రితం అడిలైడ్ ఓవల్ వేదికగా ముగిసిన  మ్యాచ్ లో విరాట్ కోహ్లీ ఫేక్ పీల్డింగ్ చేసినట్టు  బంగ్లా వికెట్ కీపర్ నురుల్ హసన్ ఆరోపించిన విషయం తెలిసిందే. 

2 Min read
Srinivas M
Published : Nov 04 2022, 12:15 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

రెండ్రోజుల క్రితం అడిలైడ్  వేదికగా ముగిసిన భారత్-బంగ్లాదేశ్ మ్యాచ్ లో బంగ్లా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ  ఫేక్ ఫీల్డింగ్ చేశాడని ఆ జట్టు వికెట్ కీపర్ నురుల్ హసన్ ఆరోపించాడు. ఈ వివాదం చిలికి చిలికి గాలివానగా మారుతున్నది. సందట్లో సడేమియాగా  పాకిస్తాన్ మాజీలకు ఇదే అస్త్రంగా మారి.. ఐసీసీ బీసీసీఐకి అనుకూలంగా వ్యవహరిస్తున్నదని అవాకులు చెవాకులు పేలుతున్నారు. 

26

కోహ్లీ ఫేక్ ఫీల్డింగ్ అంశం పై చర్చ జోరుగా సాగుతున్న నేపథ్యంలో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) స్పందించింది.  ఈ విషయాన్ని మేము వదిలిపెట్టదలుచుకోలేదని..  సరైన వేదికలో ఫిర్యాదు చేస్తామని  తెలిపింది. 

36

ఇదే విషయమై బీసీబీ క్రికెట్ ఆపరేషన్ చైర్మెన్ జలాల్ యూనుస్  క్రిక్ బజ్ తో మాట్లాడుతూ.. ‘మేం దీని గురించి మాట్లాడుకున్నాం. మ్యాచ్ లో ఏం జరిగిందో ప్రపంచమంతా చూసింది. వీడియోలు మీ కండ్ల ముందున్నాయి.  కోహ్లీ వేసింది ఫేక్ త్రో నే. దాని గురించి మేం అంపైర్లకు ఫిర్యాదు చేసినా వాళ్లు  దానిని చూడలేదని రివ్యూకు వెళ్లలేదు.  

46

అంతేగాక మ్యాచ్ మధ్యలో వర్షం పడ్డప్పుడు  ఔట్ ఫీల్డ్ తడిగా ఉందని  మా కెప్టెన్ షకిబ్ అల్ హసన్   అంపైర్ ఎరాస్మస్ తో చర్చించాడు.   తమకు ఇంకాస్త సేపు సమయం కావాలని  కోరాడు. కానీ ఆటలో అంపైర్ల నిర్ణయమే ఫైనల్ కదా. అందుకే అతడు కూడా మ్యాచ్ ను ప్రారంభించడానికి  ఓకే చెప్పాడు.  అక్కడ  అంపైర్లతో వాదులాడానికి ఏమీ లేదు. ఈ విషయాలపై మేము బీసీబీలో చర్చించాం.. సరైన ఫోరమ్ లో ఈ ఇష్యూపై ఫిర్యాదు చేస్తాం..’ అని తెలిపాడు.  

56

మ్యాచ్ లో భారత్ నిర్దేశించిన 185 పరుగుల లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్ తొలుత అదరగొట్టింది. ఓపెనర్ లిటన్ దాస్ వీరవిహారం చేయడంతో 6 ఓవర్లకే ఆ జట్టు స్కోరు 66 పరుగులు చేసింది.  పేసర్లు ధారాళంగా పరుగులివ్వడంతో రోహిత్ స్పిన్నర్ అక్షర్ పటేల్ కు బంతినిచ్చాడు. 

66

అక్షర్ వేసిన 7వ ఓవర్లో లిటన్ దాస్ కవర్ దిశగా షాట్ ఆడాడు. రెండో పరుగు తీసే క్రమంలో అర్ష్‌దీప్ సింగ్  బాల్ ను  వికెట్ కీపర్ వైపుగా విసిరాడు. అదే సమయంలో కోహ్లీ ఇన్ సైడ్ రింగ్ లో ఉన్నాడు. బంతిని అందుకోనప్పటికీ నాన్ స్ట్రైకర్ వైపుగా త్రో విసిరినట్టు యాక్షన్ ఇచ్చాడు. ఈ విషయాన్ని అంపైర్లు గుర్తించలేదని లేకుంటే తమకు పెనాల్టీ రూపంలో ఐదు పరుగులు వచ్చేవని తద్వారా విజయం తమదేనని నురుళ్ హసన్ ఆరోపించాడు. 
 

About the Author

SM
Srinivas M

Latest Videos
Recommended Stories
Recommended image1
గంభీర్ ది బెస్ట్ కోచ్.. పొగడ్తలతో ముంచెత్తిన తెలుగబ్బాయ్.. ఇంతకీ ఎవరంటే.?
Recommended image2
Google Search 2025 : టాప్ 10 క్రికెటర్స్ లో హైదరబాదీ డాషింగ్ ప్లేయర్ .. ఏ స్థానమో తెలుసా?
Recommended image3
16 ఏళ్ల తర్వాత కోహ్లీ అభిమానులకు అదిరిపోయే న్యూస్.. సొంతగడ్డపై.!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved