గుబురు గడ్డం, పొడవాటి జట్టు... షాక్ ఇస్తున్న కోహ్లీ న్యూ లుక్... ‘రౌడీ’ని గుర్తుకుతెస్తున్న విరాట్...
సోషల్ మీడియాలో విరాట్ కోహ్లీ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేలేదు. ప్రధాని నరేంద్ర మోదీ, బాలీవుడ్ స్టార్ల కంటే కోట్ల మంది ఎక్కువగా కలిగిన విరాట్ కోహ్లీ, ఆసియా ఖండంలోనే అత్యధిక ఫాలోవర్లు కలిగిన సెలబ్రిటీ. దీనికి కారణం అతని స్టైల్ కూడా.
ఎప్పటికప్పుడూ సరికొత్త ట్రెండ్ని క్రియేట్ చేస్తూ స్టైల్ ఐకాన్లా మెరిసిపోయే విరాట్ కోహ్లీ... తాజాగా మరో కొత్త లుక్లో కనిపిస్తున్నాడు. కొన్నాళ్లుగా ఫ్రెంచ్ కట్ స్టైల్లో బియర్డ్ స్టైల్ మెయింటైన్ చేస్తున్న విరాట్ కోహ్లీ.. ఐపీఎల్ 2021 సీజన్కి బ్రేక్ పడిన తర్వాత గడ్డాన్ని పూర్తిగా పెంచేశాడు.
గబురు గడ్డం, పొడవాటి జట్టుతో అచ్చం ‘టాలీవుడ్ రౌడీ’ స్టార్ విజయ్ దేవరకొండ లుక్లో మెరిసిపోతున్నాడు విరాట్ కోహ్లీ. ఈ లుక్ చూసినవారందరూ విరాట్ కోహ్లీ, వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ముగిసేవరకూ దీన్ని ఇలాగే కొనసాగించాలని కోరుతున్నారు.
అయితే క్వారంటైన్ ముగిసిన తర్వాత ఇంగ్లాండ్ టూర్కి వెళ్లే ముందు విరాట్ కోహ్లీ లుక్ మార్చే అవకాశం ఎక్కువగా ఉంది. లేదా సెంటిమెంట్స్ ఎక్కువగా ఉన్న కోహ్లీ, ఫైనల్లో టైటిల్ కోసం గడ్డాన్ని కొనసాగించే అవకాశం కూడా ఉందంటున్నారు కొందరు అభిమానులు...
ప్రస్తుతం హోం క్వారంటైన్లో గడుపుతున్న విరాట్ కోహ్లీ, ముంబైలో బీసీసీఐ ఏర్పాటుచేసిన బయో బబుల్లోకి త్వరలోనే రానున్నాడు. అక్కడి నుంచి జూన్ 2న ఇంగ్లాండ్ టూర్కి బయలుదేరనుంది బీసీసీఐ.
ఇప్పటిదాకా ఒక్క ఐసీసీ టోర్నీ టైటిల్ కూడా గెలవలేకపోయిన విరాట్ కోహ్లీ, ఈ సారి ఆ లోటు తీర్చుకోవాలని చూస్తున్నాడు. మరోవైపు న్యూజిలాండ్ కూడా కెరీర్లో రెండో ఐసీసీ టోర్నీ గెలవాలని గట్టి పట్టుదలతో ఉంది.
జూన్ 18 నుంచి 22 వరకూ ఇంగ్లాండ్లోని సౌంతిప్టన్ వేదికగా ఐసీసీ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. 87 ఏళ్ల భారత టెస్టు క్రికెట్ చరిత్రలో ఓ తటస్థ వేదికపై టెస్టు మ్యాచ్ ఆడడం ఇదే తొలిసారి....
చివరిసారిగా 2019లో సెంచరీ చేసిన విరాట్ కోహ్లీ నుంచి 71వ శతకం ఎప్పుడు వస్తుందా అని ఆశగా ఎదురుచూస్తున్నారు ఆయన అభిమానులు. టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లోనే విరాట్ కోహ్లీ సెంచరీ చేస్తే బాగుంటుందని ఆశపడుతున్నారు.