MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Sports
  • Cricket
  • 8 నెలల తర్వాత తిరిగొస్తున్న కోహ్లీ.. బంగ్లాదేశ్ సిరీస్ కు భారత జట్టులోని 15 మంది ప్లేయర్లు ఎవరు?

8 నెలల తర్వాత తిరిగొస్తున్న కోహ్లీ.. బంగ్లాదేశ్ సిరీస్ కు భారత జట్టులోని 15 మంది ప్లేయర్లు ఎవరు?

IND vs BAN : దాదాపు 6 నెలల విరామం తర్వాత బంగ్లాదేశ్‌తో జరిగే టెస్ట్ సిరీస్‌తో భారత జట్టు బరిలోకి దిగుతోంది. దులీప్ ట్రోఫీలో పాల్గొన్న తర్వాత, సెప్టెంబర్ 19న ప్రారంభమయ్యే 2 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో పాల్గొనడానికి ఆటగాళ్ళు సిద్ధంగా ఉంటారు.  

3 Min read
Author : Mahesh Rajamoni
Published : Sep 01 2024, 10:05 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

india vs bangladesh : ఇంగ్లాండ్‌తో జరిగిన 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ తర్వాత భారత జట్టు మళ్లీ గ్రౌండ్ లోకి దిగడానికి సిద్ధమవుతోంది. దాదాపు 6 నెలల విరామం తర్వాత టెస్ట్ సిరీస్‌ కోసం భారత జట్టు ప్రాక్టీస్ మొదలుపెట్టింది. భారత జట్టు 2 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో తలపడనుంది. 

వచ్చే నెల 19న బంగ్లాదేశ్ టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. ఇప్పటికే పాకిస్తాన్‌ను సొంతగడ్డపై ఓడించి చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసిన బంగ్లాదేశ్, భారత్‌లోనూ అదే చరిత్రను సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే, ఇది అనుకున్నంత సులభం కాదు బంగ్లాదేశ్ టీమ్ కు. 

ఎందుకంటే భారత్ జట్టు ఇప్పుడు చాలా బలంగా కనిస్తోంది. యంగ్ ప్లేయర్లతో పాటు సీనియర్ ప్లేయర్లతో కూడిన జట్టు బంగ్లాదేశ్ తో టెస్టు సిరీస్ ఆడనుంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
భారత టెస్ట్ జట్టు

భారత టెస్ట్ జట్టు

ఈ టెస్ట్ సిరీస్‌కు ముందు భారత జట్టు ఆటగాళ్లు దులీప్ ట్రోఫీలో పాల్గొంటారు. ఈ టోర్నమెంట్ వచ్చే నెల 5న ప్రారంభమై 19వ తేదీ వరకు జరుగుతుంది. ఇందులో భారత జట్టు ఆటగాళ్లు ఇండియా A, B, C, D అనే 4 విభాగాలుగా విభజించింది. 

శ్రీలంక ప‌ర్య‌ట‌న‌లో వైస్ కెప్టెన్ గా వ్య‌వ‌హ‌రించిన శుభ్ మ‌న్ గిల్ సారథ్యంలోని 'ఏ' టీమ్‌లో ర్యాన్ పరాగ్, కేఎల్ రాహుల్, శివమ్ దూబే, కుల్దీప్ యాదవ్ వంటి ఆటగాళ్లు ఉన్నారు. ఈశ్వరన్ సారథ్యంలోని టీమ్ 'బీ' టీమ్ లో యశస్వి జైస్వాల్, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, రిషబ్ పంత్‌లకు చోటు దక్కింది. 

రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలోని 'సీ' టీమ్‌లో సూర్యకుమార్ యాదవ్, సాయి సుదర్శన్, రజత్ పటీదార్ వంటి బ్యాట్స్‌మెన్ ఉన్నారు. శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీలో ఉన్న 'డీ' టీమ్ లో  వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ ఇషాన్ కిషన్ తో పాటు దేవదత్ పడిక్కల్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్ లు ఉన్నారు.

36

దులీప్ ట్రోఫీలో మొత్తం నాలుగు జట్లకు క‌లిపి 61 మంది ఆటగాళ్లను బీసీసీఐ ఎంపిక చేసింది. శుభ్ మన్ గిల్, కేఎల్ రాహుల్, రియాన్ పరాగ్, ద్రువ్ జురెల్, దిలీప్ వర్మ, శివమ్ దూబే, కలీల్ అహ్మద్, ఆవేష్ ఖాన్, కుల్దీప్ యాదవ్, యశస్వి జైస్వాల్, సర్ఫరాజ్ ఖాన్, రవీంద్ర జడేజా, రిషబ్ పంత్, మహమ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్, రుతురాజ్ గైక్వాడ్, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్ వంటి ఆటగాళ్లు దులీప్ ట్రోఫీలో ఆడుతున్నారు.

దులీప్ ట్రోఫీ సిరీస్‌లో సీనియర్ ఆటగాళ్లైన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇద్దరూ చోటు దక్కించుకోలేదు. చివరిసారిగా ఈ ఏడాది జనవరిలో విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్‌లో ఆడాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో తొలి 2 మ్యాచ్‌ల్లో మాత్రమే ఆడాడు. ఆ తర్వాత వ్యక్తిగత కారణాల వల్ల మిగిలిన మ్యాచ్‌లకు దూరంగా ఉన్నాడు.

భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగే 2 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ వచ్చే నెల 19న చెన్నైలో ప్రారంభం కానుంది. దీని తర్వాత రెండో టెస్ట్ 27న కాన్పూర్‌లో జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈ సిరీస్‌లో పాల్గొనే 15 మంది భారత జట్టు ఆటగాళ్లు ఎవరో చూద్దాం.

46

ఓపెనింగ్ :

రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ ఓపెనర్లుగా బరిలోకి దిగుతారు. అత్యుత్తమ ఓపెనింగ్ జోడిగా ఇద్దరూ అద్భుత ప్రదర్శన కనబరిచారు. దీంతో వీరిద్దరూ ఓపెనర్లుగా బరిలోకి దిగుతారని భావిస్తున్నారు. 

మిడిల్ ఆర్డర్:

శుభ్ మన్ గిల్ 3వ స్థానంలో బరిలోకి దిగే అవకాశం ఉంది. ఆ తర్వాత విరాట్ కోహ్లీ వస్తారు. సర్ఫరాజ్ ఖాన్, దేవదత్ పడిక్కల్ ఇద్దరూ తమ స్థానాలను నిలబెట్టుకుంటారు. వన్డే క్రికెట్‌లో  వైస్ కెప్టెన్‌గా ఉన్న శుభ్ మన్ గిల్‌కు టెస్ట్ క్రికెట్‌లోనూ అదే బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది.

స్పిన్నర్లు ఎవరు? :

రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా ముగ్గురూ స్పిన్నర్లుగా బరిలోకి దిగుతారు. ఇందులో ఏదైనా మార్పు ఉంటే కుల్దీప్ యాదవ్ చోటు దక్కించుకునే అవకాశం ఉంది.

 

56

వికెట్ కీపర్:

టెస్ట్ క్రికెట్ సిరీస్‌కు రిషబ్ పంత్ తిరిగి వస్తారని భావిస్తున్నారు. ఇప్పటికే ద్రువ్ జురెల్ వికెట్ కీపర్‌గా ఉన్న నేపథ్యంలో రిషబ్ పంత్‌కే అధిక ప్రాధాన్యత లభిస్తుంది. అంతేకాదు అతడే ప్లేయింగ్ 11లో చోటు దక్కించుకుంటాడని భావిస్తున్నారు. 

బౌలర్లు:

కుల్దీప్ యాదవ్ తన స్థానాన్ని నిలబెట్టుకునే అవకాశం ఉంది. అదేవిధంగా మహమ్మద్ సిరాజ్ జట్టులో చోటు దక్కించుకుంటాడు. కానీ, జస్ప్రీత్ బుమ్రా చోటు దక్కించుకునే అవకాశం లేదు. బుమ్రా స్థానంలో మహేష్ కుమార్ చోటు దక్కించుకుంటాడని భావిస్తున్నారు. వీరితో పాటు ఆకాష్ దీప్, అర్ష్‌దీప్ సింగ్ జట్టులో చోటు దక్కించుకుంటారని భావిస్తున్నారు.

66

బంగ్లాదేశ్‌తో జరిగే టెస్ట్ సిరీస్‌కు భారత జట్టు అంచనాలు.. :

రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్ మన్ గిల్, విరాట్ కోహ్లీ, సర్ఫరాజ్ ఖాన్, దేవదత్ పడిక్కల్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, రిషబ్ పంత్, ద్రువ్ జురెల్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, మహేష్ కుమార్, ఆకాష్ దీప్ లేదా అర్ష్‌దీప్ సింగ్.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
రిషబ్ పంత్
రోహిత్ శర్మ
శుభ్‌మన్ గిల్
విరాట్ కోహ్లీ

Latest Videos
Recommended Stories
Recommended image1
ICC Rankings: నెం.1 ర్యాంక్ ఖేల్ ఖతం.. బుమ్రాకు ఊహించని షాక్ ఇచ్చిన ఆసీస్ దిగ్గజం
Recommended image2
IND vs SL: 5వ రోజు క్లైమాక్స్ మామూలుగా ఉండదు.. శ్రీలంక 16 రన్స్ లీడ్, భారత్‌కు 4 వికెట్లే బాకీ
Recommended image3
Dhruv Jure: 9 ఏళ్ల హార్దిక్ పాండ్యా రికార్డు ఖేల్ ఖతం.. శ్రీలంకలో ధ్రువ్ జురెల్ రచ్చ రచ్చ !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved