పృథ్వీషా, ఇషాన్ మాస్... శిఖర్ ధావన్ క్లాస్... తొలి వన్డేలో టీమిండియా ఘన విజయం...
తొలి వన్డేలో భారత జట్టు అంచనాలకు తగ్గ పర్ఫామెన్స్ ఇచ్చింది. 263 పరుగుల టార్గెట్తో బరిలో దిగిన టీమిండియా... పృథ్వీషా, ఇషాన్ కిషన్ మెరుపులకి శిఖర్ ధావన్ కెప్టెన్ ఇన్నింగ్స్ తోడవడంతో ఈజీ విక్టరీ అందుకుంది.
రెండో బాల్కే బౌండరీకి తరలించిన పృథ్వీషా... వరుస ఫోర్లతో స్కోరుబోర్డును పరుగులు పెట్టించాడు. 24 బంతుల్లో 9 ఫోర్లతో 43 పరుగులు చేసిన షా ఇన్నింగ్స్ కారణంగా 5.2 ఓవర్లలో 58 పరుగులు చేసింది భారత జట్టు.
పృథ్వీషా అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన ఇషాన్ కిషన్, తాను ఎదుర్కొన్న మొదటి బంతినే సిక్సర్గా మలిచాడు. వన్డే కెరీర్లో మొదటి బంతికే సిక్సర్ బాదిన మొట్టమొదటి భారత బ్యాట్స్మెన్గా రికార్డు క్రియేట్ చేశాడు ఇషాన్ కిషన్...
శ్రీలంక ఫీల్డర్ల తప్పిదాలకు తోడు అదృష్టం కూడా కలిసి రావడంతో రెండు సార్లు అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న ఇషాన్ కిషన్... 42 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 59 పరుగులు చేశాడు...
ఆరంగ్రేటం టీ20లో ఫోర్తో ఇన్నింగ్స్ ఆరంభించిన ఇషాన్ కిషన్, వన్డేలో సిక్సర్తో కెరీర్ మొదలెట్టి... రెండూ ఫార్మాట్లలోనూ హాఫ్ సెంచరీ మార్కు అందుకోవడం విశేషం...
ఇషాన్ కిషన్ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన సీనియర్ ప్లేయర్ మనీశ్ పాండే 40 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్తో 26 పరుగులు చేసి అవుట్ అయ్యాడు...
ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్తో కలిసి శిఖర్ ధావన్ లాంఛనాన్ని పూర్తిచేశాడు. కెప్టెన్గా తొలి మ్యాచ్లో హాఫ్ సెంచరీ నమోదుచేసిన శిఖర్ ధావన్, వన్డేల్లో 6 వేల పరుగులు, అంతర్జాతీయ కెరీర్లో 10 వేల పరుగులు పూర్తిచేసుకోవడం విశేషం...
శిఖర్ ధావన్ 95 బంతుల్లో 6 ఫోర్లు, ఓ సిక్సర్తో 86 పరుగులు చేయగా సూర్యకుమార్ యాదవ్, 19 బంతుల్లో 5 ఫోర్లతో 31 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు.