సెంచూరియన్లో టీమిండియా న్యూఇయర్ సెలబ్రేషన్స్... రచ్చ మామూలుగా లేదుగా...
ప్రస్తుతం సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్ కోసం సెంచూరియన్లో ఉన్న భారత జట్టు, అక్కడే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఘనంగా జరుపుకుంది. సఫారీ టూర్లో ఉన్న టీమిండియా సభ్యులందరూ కలిసి కొత్త సంవత్సరాన్ని సంబరంగా ఆహ్వానించారు...
భారత సారథి విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్తో పాటు మిగిలిన సభ్యులందరూ కలిసి న్యూఇయర్ పార్టీలో కుటుంబసభ్యులతో కలిసి పాల్గొన్నారు...
భారత హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్తో పాటు విక్రమ్ రాథోడ్ అండ్ కో... సఫారీ టూర్లోని క్రికెటర్లతో కలిసి సరదాగా ఫోటోలు దిగారు...
గ్రౌండ్పై కూర్చొని, క్రేజీ ఫోజులతో టీమిండియా దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఛతేశ్వర్ పూజారాతో పాటు రాహుల్ ద్రావిడ్ కూడా కుర్రాళ్లతో కలిసి పోవడం విశేషం...
భారత టెస్టు సారథి విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ, భర్తతో కలిసి టీమిండియాతో న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొంది.
తనకు 2021 ఏడాది ఇచ్చిన మధురానుభూతులను ధన్యవాదాలు తెలిపింది విరాట్ కోహ్లీ సతీమణి, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ...
రోహిత్ శర్మ గైర్హజరీతో ఓపెనర్గా చోటు దక్కించుకున్న మయాంక్ అగర్వాల్, తన భార్యతో కలిసి న్యూఇయర్ వేడుకల్లో ఫోటోలకు ఫోజులు ఇచ్చాడు...
రోహిత్ శర్మ గైర్హజరీతో ఓపెనర్గా చోటు దక్కించుకున్న మయాంక్ అగర్వాల్, తన భార్యతో కలిసి న్యూఇయర్ వేడుకల్లో ఫోటోలకు ఫోజులు ఇచ్చాడు...
భారత మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ, తన భార్య సాక్షి సింగ్, కొందరు ఆత్మీయులతో కలిసి యూఏఈలో గ్రాండ్గా న్యూ ఇయర్ పార్టీ జరుపుకున్నాడు.